మూడు సంవత్సరాల తరువాత ఇండియాలోకి అడుగుపెట్టిన ప్రియాంక చోప్రా అంటూ ఆల్రెడీ బాలీవుడ్ మీడియాలో తెగ హడావుడి చేస్తున్నాయి. ఈ మంగళవారం ఉదయం అమ్మడు ముంబాయ్ ఎయిర్ పోర్టులో దిగబోతోంది అంటూ ఆమె పిఆర్ వర్గాలు ఓ రెండు వారాల నుండి సందడి చేయడం మొదలు పెట్టేరు. అక్కడికేదో దేశానికి తిరిగొచ్చిన నెల్సన్ మండేలా అన్నట్లు ప్రియాంక కోసం కొంతమంది బాలీవుడ్ సీనియర్ జర్నలిస్టులు కూడా ఉదయాన్నే విమానాశ్రయానికి వెళిపోవడం ఇంకా ఆశ్చర్యకరంగానే ఉంది.
ఇదంతా ఒకెత్తయితే.. ఒక ఫోటోగ్రాఫర్ కమ్ జర్నలిస్ట్ మాత్రం.. తన ప్రశ్నతో ప్రియాంకకే షాకిచ్చాడు. ప్రియాంక ఎదురుపడగానే.. ఆలియా భట్ మమ్మీ అవుతోంది.. దీనిపై మీ కామెంట్ ఏంటి అని అడిగాడు సదరు జర్నలిస్ట్. నవ్వేసి వెళ్ళిపోయింది ప్రియాంక. ప్రస్తుతం నెట్టింట్లో ఈ వీడియో వైరల్ కావడంతో.. ఇదేం నాసిరకం జర్నలిజం అంటూ ఇప్పుడు నెటిజన్లందరూ మండిపడుతున్నారు. కాకపోతే విషయం ఏంటంటే.. విమానాశ్రయంలో కనిపించిన ప్రియాంకను అసలు ఏం ప్రశ్నలు అడగాలి, ఏమని అడుగుతాం అనేది జర్నలిస్టులకు కూడా క్లిష్టమైన అంశమే. ఒకవేళ ప్రియాంక కూడా కంగనా రనౌత్ తరహాలో రాజీకయపరమైన కామెంట్లు చేయడంలో దిట్టయితే.. ఖచ్చితంగా ప్రపంచ స్థితిగతుల మీద ప్రశ్నల వర్షం కురిపించవచ్చు. ప్రియాంక కేవలం సినిమాల గురించే ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటుంది కాబట్టి.. వాళ్ళు మాత్రం ఏం ప్రశ్నలు సందిస్తారు చెప్పండి?
అంతేకాకుండా.. ఒక ప్రక్కన ఫుల్ ఫామ్ లో వరుస సినిమాలతో బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న ఆలియా భట్ సొంతంగా తల్లి అవుతుంటే.. ప్రియాంక మాత్రం అద్దె గర్భంతో సరోగసీ రూట్లో మమ్మీ అయిపోయింది. ఒకవేళ హెల్త్ ఇష్యూస్ కారణంగా అలా చేసినా కూడా.. ఇప్పుడు ఆలియా గురించి కామెంట్ చేస్తే.. నువ్వెందుకు సరోగసీకి వెళ్ళావ్.. నీ అందచందాలు పాడైపోకూడదనా అనే ప్రశ్న కూడా ఆమెను అడిగే ఛాన్సుంది. మేబీ అందుకే నవ్వేసి వెళిపోయింది కాబోలు అంటూ ఇప్పుడు కొన్ని కామెంట్లు కూడా వినిపిస్తున్నాయిలే.
This post was last modified on November 1, 2022 10:16 pm
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…