రీమేక్ సినిమాల పట్ల నానాటికీ ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గిపోతోందన్న విషయం ఎప్పటికప్పుడు రుజవవుతూనే ఉంది. కానీ టాలీవుడ్ మాత్రం పరభాషా చిత్రాల మీద మోజు తగ్గించుకోవట్లేదు. మాతృకను చెడగొట్టకుండా ఉన్నదున్నట్లు తీసినా.. కొన్ని మార్పులు చేర్పులు చేసి, కొంచెం మసాలా అద్ది మన ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు తీర్చిదిద్దినా.. ఇలా ఏం చేసినా పెద్దగా ఫలితం లేకపోతోంది. పాజిటివ్ టాక్ తెచ్చుకున్న రీమేక్ సినిమాలు కూడా ప్రతికూల ఫలితాన్నే అందుకుంటున్నాయి.
ఈ ఏడాది పవన్ కళ్యాణ్ సినిమా భీమ్లా నాయక్కు ఎంత మంచి టాక్ వచ్చిందో తెలిసిందే. వకీల్ సాబ్ తరహాలోనే దీన్ని కూడా మన ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా మార్చి బాగానే తీర్చిదిద్దారు. కానీ మామూలుగా పవన్ సినిమాలకు పాజిటివ్ టాక్ వస్తే వసూళ్ల మోత మోగిపోతుంది. కానీ ఈ చిత్రం ఓ మోస్తరు వసూళ్లతో సరిపెట్టుకుంది.
ఇక దసరా కానుకగా ఈ నెలలోనే రిలీజైన గాడ్ ఫాదర్ సంగతి తెలిసిందే. ఆ సినిమాను కూడా తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు బాగానే మార్చాడు దర్శకుడు మోహన్ రాజా. కానీ దసరా సెలవుల్లో పోటీగా వచ్చిన సినిమాలు తుస్సుమన్నా కూడా గాడ్ ఫాదర్ ఈ అడ్వాంటేజీని పెద్దగా ఉపయోగించుకోలేకపోయింది. తొలి వీకెండ్ వరకు ఓ మోస్తరు వసూళ్లు రాబట్టి ఆ తర్వాత చల్లబడిపోయింది. ఫైనల్గా చూస్తే ఆ సినిమా బాక్సాఫీస్ ఫెయిల్యూర్ అనే చెప్పాలి.
ఇక తాజాగా ఓరి దేవుడా అనే మరో రీమేక్ మూవీ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా చూసిన వాళ్లంతా బాగుందన్నారు. రివ్యూలు బాగున్నాయి. తీరా చూస్తే వసూళ్లు లేవు. కాంతార, సర్దార్ సినిమాల జోరు ముందు ఇది నిలవలేకపోయింది. తొలి రోజు నుంచి ఓ మోస్తరు వసూళ్లే వచ్చాయీ సినిమాకు. వీకెండ్ తర్వాత సినిమా ప్రభావం అంతంతమాత్రమే. ఓటీటీల పుణ్యమా అని అన్ని భాషల చిత్రాలనూ అందరూ చూసేస్తున్న ఈ రోజుల్లో రీమేక్ సినిమాలు ఇకపై అంతగా వర్కవుట్ కావడానికి ఇది తాజా హెచ్చరిక.
This post was last modified on October 31, 2022 12:43 pm
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…
న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…
ఈ ఏడాది మార్చి-ఏప్రిల్ మధ్య జరిగే తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినానికి భారీ ప్రకటన చేసేందుకు ఏపీ మంత్రి నారా…