రీమేక్ సినిమాల పట్ల నానాటికీ ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గిపోతోందన్న విషయం ఎప్పటికప్పుడు రుజవవుతూనే ఉంది. కానీ టాలీవుడ్ మాత్రం పరభాషా చిత్రాల మీద మోజు తగ్గించుకోవట్లేదు. మాతృకను చెడగొట్టకుండా ఉన్నదున్నట్లు తీసినా.. కొన్ని మార్పులు చేర్పులు చేసి, కొంచెం మసాలా అద్ది మన ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు తీర్చిదిద్దినా.. ఇలా ఏం చేసినా పెద్దగా ఫలితం లేకపోతోంది. పాజిటివ్ టాక్ తెచ్చుకున్న రీమేక్ సినిమాలు కూడా ప్రతికూల ఫలితాన్నే అందుకుంటున్నాయి.
ఈ ఏడాది పవన్ కళ్యాణ్ సినిమా భీమ్లా నాయక్కు ఎంత మంచి టాక్ వచ్చిందో తెలిసిందే. వకీల్ సాబ్ తరహాలోనే దీన్ని కూడా మన ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా మార్చి బాగానే తీర్చిదిద్దారు. కానీ మామూలుగా పవన్ సినిమాలకు పాజిటివ్ టాక్ వస్తే వసూళ్ల మోత మోగిపోతుంది. కానీ ఈ చిత్రం ఓ మోస్తరు వసూళ్లతో సరిపెట్టుకుంది.
ఇక దసరా కానుకగా ఈ నెలలోనే రిలీజైన గాడ్ ఫాదర్ సంగతి తెలిసిందే. ఆ సినిమాను కూడా తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు బాగానే మార్చాడు దర్శకుడు మోహన్ రాజా. కానీ దసరా సెలవుల్లో పోటీగా వచ్చిన సినిమాలు తుస్సుమన్నా కూడా గాడ్ ఫాదర్ ఈ అడ్వాంటేజీని పెద్దగా ఉపయోగించుకోలేకపోయింది. తొలి వీకెండ్ వరకు ఓ మోస్తరు వసూళ్లు రాబట్టి ఆ తర్వాత చల్లబడిపోయింది. ఫైనల్గా చూస్తే ఆ సినిమా బాక్సాఫీస్ ఫెయిల్యూర్ అనే చెప్పాలి.
ఇక తాజాగా ఓరి దేవుడా అనే మరో రీమేక్ మూవీ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా చూసిన వాళ్లంతా బాగుందన్నారు. రివ్యూలు బాగున్నాయి. తీరా చూస్తే వసూళ్లు లేవు. కాంతార, సర్దార్ సినిమాల జోరు ముందు ఇది నిలవలేకపోయింది. తొలి రోజు నుంచి ఓ మోస్తరు వసూళ్లే వచ్చాయీ సినిమాకు. వీకెండ్ తర్వాత సినిమా ప్రభావం అంతంతమాత్రమే. ఓటీటీల పుణ్యమా అని అన్ని భాషల చిత్రాలనూ అందరూ చూసేస్తున్న ఈ రోజుల్లో రీమేక్ సినిమాలు ఇకపై అంతగా వర్కవుట్ కావడానికి ఇది తాజా హెచ్చరిక.
This post was last modified on October 31, 2022 12:43 pm
ప్రభాస్ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్న స్పిరిట్ కు రంగం సిద్ధమవుతోంది. చేతిలో ఉన్న ఫౌజీ, ది రాజా సాబ్…
రెండేళ్ల క్రితం బేబీ రిలీజ్ ముందు వరకు తనెవరో పెద్దగా పరిచయం లేని పేరు. అల వైకుంఠపురములో అల్లు అర్జున్…
తమిళనాట అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ... అధికార డీఎంకేలో ఫుల్ జోష్ నింపే పరిణామం ఒకటి శనివారం జరిగింది. సుప్రీంకోర్టులో రెండేళ్లుగా…
హర్యానాలోని సోనిపట్లో ఉన్న ఓపీ జిందాల్ విశ్వవిద్యాలయంలో ఓ విద్యార్థి చేసిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ అవుతోంది.…
మాజీ ఉప రాష్ట్రపతి, బీజేపీ నాయకుడు ముప్పవరపు వెంకయ్యనాయుడు.. తాజాగా అటు తెలంగాణ, ఇటు ఏపీ నేతలపై సెటర్లు గుప్పించారు.…
కొన్నిసార్లు బాక్సాఫీస్ ఫలితాలు అనూహ్యంగా ఉంటాయి. టాక్ తేడాగా వచ్చినా, జనానికి పూర్తిగా నచ్చకపోయినా కలెక్షన్లు మాత్రం భీభత్సంగా వచ్చేస్తాయి.…