అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ పాటికి బాలయ్య -గోపీచంద్ మలినేని కాంబో సినిమా వీర సింహా రెడ్డి షూటింగ్ పూర్తి ఫస్ట్ కాపీ చేతికి రావాలి. కానీ ఇంకా కొంత వర్క్ తో యూనిట్ పరుగులు పెడుతుంది. నిజానికి ఈ సినిమాకు సంబంధించి దాదాపు మొన్నటి వరకూ అన్ని షెడ్యుల్స్ సవ్యంగా జరిగిపోయాయి. కానీ ఫైనల్ షెడ్యుల్ మాత్రం బ్రేకులతో ముందుకు సాగడం లేదు.
బాలయ్య ఫైనల్ షెడ్యుల్ కోసం సెప్టెంబర్ లో కొన్ని , అక్టోబర్ లో మరికొన్ని డేట్స్ ఇచ్చాడు. కానీ అదే సమయంలో ఆహాకి బాలయ్య అన్ స్టాపబుల్ షూట్ కారణంగా వీర సింహా రెడ్డి షూట్ కి బ్రేక్ పడింది. ఆ తర్వాత బాలయ్య ఓ కన్స్ట్రక్షన్ కంపెనీ కోసం యాడ్ షూట్ చేశాడు. దానికి నాలుగైదు రోజులు తీసుకున్నారు. ఇక అన్ స్టాపబుల్ ప్రోమో షూట్ కోసం కూడా మధ్యలో కొన్ని డేట్స్ ఇచ్చాడు బాలయ్య.
ఇలా ఆహా కోసం కొన్ని రోజులు యాడ్ షూట్ మరికొన్ని రోజులు కేటాయించడంతో వీర సింహా రెడ్డి షూటింగ్ బ్రేక్ పడింది. మరో రెండు మూడు రోజుల్లో ఈ సినిమాకు సంబంధించి ఫైనల్ షెడ్యుల్ మొదలు పెట్టి ఫాస్ట్ గా షూట్ చేసే పనిలో ఉన్నారు. నవంబర్ ఎండింగ్ వరకూ షూట్ కంప్లీట్ చేసేసి డిసెంబర్ లో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకునేందుకు టీం ప్లాన్ చేసుకుంటున్నారు. నవంబర్ నుండి భారీ ఎత్తున ప్రమోషన్స్ మొదలు పెట్టె ఆలోచనలో ఉన్నారు.
This post was last modified on October 29, 2022 5:39 pm
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…
ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…
వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…
ఒక్కడు, చూడాలని ఉంది లాంటి అద్భుతమైన బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు గుణశేఖర్ కొత్త మూవీ యుఫొరియా ఫిబ్రవరిలో విడుదలైన…