అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ పాటికి బాలయ్య -గోపీచంద్ మలినేని కాంబో సినిమా వీర సింహా రెడ్డి షూటింగ్ పూర్తి ఫస్ట్ కాపీ చేతికి రావాలి. కానీ ఇంకా కొంత వర్క్ తో యూనిట్ పరుగులు పెడుతుంది. నిజానికి ఈ సినిమాకు సంబంధించి దాదాపు మొన్నటి వరకూ అన్ని షెడ్యుల్స్ సవ్యంగా జరిగిపోయాయి. కానీ ఫైనల్ షెడ్యుల్ మాత్రం బ్రేకులతో ముందుకు సాగడం లేదు.
బాలయ్య ఫైనల్ షెడ్యుల్ కోసం సెప్టెంబర్ లో కొన్ని , అక్టోబర్ లో మరికొన్ని డేట్స్ ఇచ్చాడు. కానీ అదే సమయంలో ఆహాకి బాలయ్య అన్ స్టాపబుల్ షూట్ కారణంగా వీర సింహా రెడ్డి షూట్ కి బ్రేక్ పడింది. ఆ తర్వాత బాలయ్య ఓ కన్స్ట్రక్షన్ కంపెనీ కోసం యాడ్ షూట్ చేశాడు. దానికి నాలుగైదు రోజులు తీసుకున్నారు. ఇక అన్ స్టాపబుల్ ప్రోమో షూట్ కోసం కూడా మధ్యలో కొన్ని డేట్స్ ఇచ్చాడు బాలయ్య.
ఇలా ఆహా కోసం కొన్ని రోజులు యాడ్ షూట్ మరికొన్ని రోజులు కేటాయించడంతో వీర సింహా రెడ్డి షూటింగ్ బ్రేక్ పడింది. మరో రెండు మూడు రోజుల్లో ఈ సినిమాకు సంబంధించి ఫైనల్ షెడ్యుల్ మొదలు పెట్టి ఫాస్ట్ గా షూట్ చేసే పనిలో ఉన్నారు. నవంబర్ ఎండింగ్ వరకూ షూట్ కంప్లీట్ చేసేసి డిసెంబర్ లో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకునేందుకు టీం ప్లాన్ చేసుకుంటున్నారు. నవంబర్ నుండి భారీ ఎత్తున ప్రమోషన్స్ మొదలు పెట్టె ఆలోచనలో ఉన్నారు.
సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…
లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…
పోలవరం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు శపథం చేశారు. గోదావరి జిల్లాల్లో పర్యటనకు వచ్చిన ఆయన…
అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ…
జూనియర్ ఎన్టీఆర్.. రాజకీయ రంగ ప్రవేశంపై తరచుగా ప్రచారం జరుగుతూనే ఉంది. ఆయనకు అను కూలంగా ఏపీలోనూ కొన్ని ప్రాంతాల్లో…
తెలుగు టాప్ కొరియోగ్రాఫర్లయిన జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ పరస్పరం అరుచుకుంటూ ఒకరి మీదికి ఒకరు దూసుకువెళ్తున్న వీడియో తాజాగా…