Movie News

ర‌జినీకాంత్.. ఇంకో రెండు సినిమాలు

గ‌త త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు కొత్త పార్టీ పెట్టి పూర్తి స్థాయి రాజ‌కీయాల్లోకి దిగాల‌ని అనుకున్నాడు సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్. అప్ప‌టికే ఆయ‌న 70వ ప‌డికి చేరువ అయ్యారు. ఆరోగ్య స‌మ‌స్య‌ల‌తో ఇబ్బంది ప‌డుతున్నారు. ఇక పూర్తి స్థాయి రాజ‌కీయాల్లోకి దిగాడంటే ఇక సినిమాల గురించి అంద‌రూ మ‌రిచిపోవాల్సిందే అనుకున్నారు. 2.0నే ఆయ‌న చివ‌రి చిత్రం అవుతుంద‌ని కూడా అంచ‌నా వేశారు. కానీ త‌ర్వాత ప‌రిస్థితులు మారిపోయాయి.

పార్టీ పెట్టే విష‌యంలో ర‌జినీ త్వ‌ర‌గా ఓ నిర్ణ‌యం తీసుకోలేక‌పోయారు. రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు మారి, క‌రోనా కార‌ణంగా ఆరోగ్యం విష‌యంలో ఆందోళ‌న త‌లెత్తి పూర్తిగా పార్టీ పెట్టే ఆలోచ‌న‌నే విర‌మించుకున్నారు. ఎప్ప‌ట్లాగే సినిమాలు చేసుకుంటూ సాగిపోయారు. ఈ క్ర‌మంలోనే పేట‌, ద‌ర్బార్, అన్నాత్తె.. ఇలా వ‌రుస‌గా సినిమాలు చేశాడు సూప‌ర్ స్టార్. 71 ఏళ్ల వ‌య‌సులోనూ ఇటీవ‌లే జైల‌ర్ అనే సినిమాను మొద‌లుపెట్టారు. ఉత్సాహంగా షూటింగ్‌లో పాల్గొంటున్నారు.

ఇప్పుడు ర‌జినీ కొత్త‌గా రెండు సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డం విశేషం. అది కూడా ఒకే నిర్మాత‌కు కావ‌డం గ‌మ‌నార్హం. ర‌జినీతో 2.0 లాంటి భారీ చిత్రాన్ని నిర్మించిన లైకా ప్రొడ‌క్ష‌న్స్ అధినేత సుభాస్క‌ర‌న్‌తో ర‌జినీ రెండు కొత్త సినిమాల‌కు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ విష‌యాన్ని లైకా వాళ్లే శుక్ర‌వారం అధికారికంగా ప్ర‌క‌టించారు. ఇందులో ఒక సినిమాకు న‌వంబ‌రు 4న మూహూర్త వేడుక జ‌ర‌ప‌నున్నారు. మ‌రి ఈ రెండు చిత్రాల‌కు ద‌ర్శ‌కులు ఎవ‌రు అనే విష‌యంలో స‌స్పెన్స్ న‌డుస్తోంది.

ఒక సినిమాను ర‌జినీతో పేట తీసిన కార్తీక్ సుబ్బ‌రాజ్ డైరెక్ట్ చేయొచ్చ‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. ర‌జినీతో సినిమా చేయాల‌ని క‌ల‌గనే ద‌ర్శ‌కులు కోలీవుడ్లో చాలామందే ఉన్నారు. బింబిసార‌తో బ్లాక్‌బ‌స్ట‌ర్ ఎంట్రీ ఇచ్చిన టాలీవుడ్ యువ ద‌ర్శ‌కుడు వ‌శిష్ఠ్ సైతం ర‌జినీకి ఒక క‌థ చెప్పిన‌ట్లు వార్త‌లొచ్చాయి. మ‌రి అత‌డికి ఈ రెండు చిత్రాల్లో ఒక‌దాంట్లో ఏమైనా అవ‌కాశం ద‌క్కుతుందేమో చూడాలి.

This post was last modified on October 28, 2022 9:49 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఓటమి చూడని జట్లతో భారత్ అసలైన ఫైట్

టీ20 వరల్డ్ కప్ 2026 లీగ్ దశ ముగిసి అసలైన మజా మొదలవ్వబోతోంది. ఈసారి సూపర్ 8 గ్రూపులు ఫైనల్…

1 hour ago

అమీర్ పేటలో భారీ అగ్ని ప్రమాదం.. విద్యార్ధులు సేఫేనా?

హైదరాబాద్ నగరంలోని అమీర్‌పేట మైత్రీవనం చౌరస్తా వద్ద ఉన్న ఆదిత్య ఎన్‌క్లేవ్ భవనంలో శుక్రవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.…

1 hour ago

ఫోన్‌పే ద్వారా లంచాలు.. ఎనిమిది మంది ఇంజనీర్లపై వేటు!

​విద్యుత్ శాఖలో అవినీతి ఆరోపణలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. లంచాల వ్యవహారంపై విజిలెన్స్ జరిపిన విచారణలో షాకింగ్ నిజాలు బయటపడటంతో…

3 hours ago

అన్వేషణ హద్దు దాటేస్తుందా?

నా అన్వేష్.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్రతి ఒక్కరికి ఈ పేరు తెలిసే ఉంటుంది...! యూట్యూబర్‌గా అందరికీ సుపరిచితమే.…

3 hours ago

హ‌రీష్‌రావు కంచుకోట‌ను క‌విత బ‌ద్ద‌లు కొట్ట‌గ‌లదా?

బీఆర్ఎస్ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి.. అంత‌కుమించి మాట‌ల మాంత్రీకుడు.. త‌న్నీరు హ‌రీష్ రావు గురించి చెప్ప‌డానికి ఇవి చాలు.…

3 hours ago

మాఫియా రాజ్యంలో ‘టాక్సిక్’ రక్తపాతం

కెజిఎఫ్ లాంటి ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న యష్ వచ్చే నెల టాక్సిక్ తో రాబోతున్న…

4 hours ago