గత తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు కొత్త పార్టీ పెట్టి పూర్తి స్థాయి రాజకీయాల్లోకి దిగాలని అనుకున్నాడు సూపర్ స్టార్ రజినీకాంత్. అప్పటికే ఆయన 70వ పడికి చేరువ అయ్యారు. ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఇక పూర్తి స్థాయి రాజకీయాల్లోకి దిగాడంటే ఇక సినిమాల గురించి అందరూ మరిచిపోవాల్సిందే అనుకున్నారు. 2.0నే ఆయన చివరి చిత్రం అవుతుందని కూడా అంచనా వేశారు. కానీ తర్వాత పరిస్థితులు మారిపోయాయి.
పార్టీ పెట్టే విషయంలో రజినీ త్వరగా ఓ నిర్ణయం తీసుకోలేకపోయారు. రాజకీయ సమీకరణాలు మారి, కరోనా కారణంగా ఆరోగ్యం విషయంలో ఆందోళన తలెత్తి పూర్తిగా పార్టీ పెట్టే ఆలోచననే విరమించుకున్నారు. ఎప్పట్లాగే సినిమాలు చేసుకుంటూ సాగిపోయారు. ఈ క్రమంలోనే పేట, దర్బార్, అన్నాత్తె.. ఇలా వరుసగా సినిమాలు చేశాడు సూపర్ స్టార్. 71 ఏళ్ల వయసులోనూ ఇటీవలే జైలర్ అనే సినిమాను మొదలుపెట్టారు. ఉత్సాహంగా షూటింగ్లో పాల్గొంటున్నారు.
ఇప్పుడు రజినీ కొత్తగా రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం విశేషం. అది కూడా ఒకే నిర్మాతకు కావడం గమనార్హం. రజినీతో 2.0 లాంటి భారీ చిత్రాన్ని నిర్మించిన లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్తో రజినీ రెండు కొత్త సినిమాలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ విషయాన్ని లైకా వాళ్లే శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. ఇందులో ఒక సినిమాకు నవంబరు 4న మూహూర్త వేడుక జరపనున్నారు. మరి ఈ రెండు చిత్రాలకు దర్శకులు ఎవరు అనే విషయంలో సస్పెన్స్ నడుస్తోంది.
ఒక సినిమాను రజినీతో పేట తీసిన కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్ట్ చేయొచ్చనే ప్రచారం జరుగుతోంది. రజినీతో సినిమా చేయాలని కలగనే దర్శకులు కోలీవుడ్లో చాలామందే ఉన్నారు. బింబిసారతో బ్లాక్బస్టర్ ఎంట్రీ ఇచ్చిన టాలీవుడ్ యువ దర్శకుడు వశిష్ఠ్ సైతం రజినీకి ఒక కథ చెప్పినట్లు వార్తలొచ్చాయి. మరి అతడికి ఈ రెండు చిత్రాల్లో ఒకదాంట్లో ఏమైనా అవకాశం దక్కుతుందేమో చూడాలి.
This post was last modified on October 28, 2022 9:49 pm
రాజమండ్రిలో నిర్వహించిన కూటమి పార్టీల(జనసేన-బీజేపీ-టీడీపీ) ఎన్నికల ప్రచార సభ 'ప్రజాగళం'లో చంద్రబాబు పాల్గొన లేక పోయారు. ఆయన వేరే సభలో…
మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…
ఏపీలో డబుల్ ఇంజన్ సర్కారు రానుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమే కేంద్రంలోనూ…
ఆంధ్రప్రదేశ్లో కొన్ని వారాల నుంచి ఎన్నికల కమిషన్ కొరఢా ఝళిపిస్తూ ఉంది. ఎన్నికల సమయంలో తమ పరిధి దాటి వ్యవహరిస్తున్న…
కుర్ర హీరోల్లో వేగంగా మార్కెట్ పడిపోయిన వాళ్ళలో రాజ్ తరుణ్ పేరు మొదటగా చెప్పుకోవాలి. కెరీర్ ప్రారంభంలో కుమారి 21…
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. గత ఏడాది ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చట్టం. ఇప్పుడీ చట్టం ఎన్నికల ముంగిట…