గత నెల సెప్టెంబర్ 30న భారీ ఎత్తున విడుదలైన పొన్నియన్ సెల్వన్ 1 ఓటిటిలో వచ్చేసింది. ఎలాంటి ప్రమోషన్ హడావిడి లేకుండా అమెజాన్ ప్రైమ్ లో అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఇక్కడే ఒక ట్విస్టు ఉంది. ఇప్పటికిప్పుడు దీన్ని చూసేయాలంటే 199 రూపాయలు చెల్లించాలి. మాకు మెంబెర్ షిప్ ఉందంటే మాత్రం ఇంకో వారం ఆగి నవంబర్ 4 నుంచి ఉచితంగా చూసుకోవచ్చు. డబ్బులు కట్టేసి అంత కొంపమునిగిపోయేలా చూసేంత ఉద్దేశంలో తెలుగు ప్రేక్షకులు పెద్దగా ఉండరు కానీ థియేటర్ లో మిస్ అయిన అరవ ఆడియన్స్ ఈ ఖర్చుకు వెనుకాడకపోవచ్చు.
గతంలో కెజిఎఫ్ 2నూ ఇదే తరహాలో పే అండ్ సీ మోడల్ ను అమలుపరిచిన ప్రైమ్ గత ఆరేడు నెలల నుంచి బాలీవుడ్ హాలీవుడ్ మూవీస్ కి ఇదే పద్ధతిని అనుసరిస్తోంది. డెబ్భై రూపాయలతో మొదలుపెట్టి మూడు వందల దాకా రకరకాల ధరలతో కొత్త కంటెంట్ ఇస్తోంది. ఇది అమెరికా లాంటి దేశాల్లో ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ ఇక్కడ మాత్రం మెల్లగా అలవాటు చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. నాలుగు వందల కోట్ల వసూళ్లు తెచ్చుకుందని తమిళ మీడియా తెగమోసిన పీఎస్ 1 ఊహించని విధంగా ఇంత త్వరగా డిజిటల్ ప్రీమియర్ గా రావడం మాత్రం అనూహ్యమే.
బ్లాక్ బస్టర్లు సైతం ఇలా నాలుగు వారాలకే వస్తే ఎలా అనే ప్రశ్నకు సమాధానం లేదు. ఒకపక్క నిర్మాతలు థియేటర్ కు ఓటిటికి మధ్య కనీసం రెండు నెలల గ్యాప్ ఉండాలని నిర్దేశించుకుంటున్న టైంలో ఇలా చేయడం చూస్తే ఎవరిని తప్పుబట్టాలో అర్థం కాని పరిస్థితి. తెలుగులో బ్రేక్ ఈవెన్ టచ్ చేయడానికే చాలా కష్టపడ్డ పొన్నియన్ సెల్వన్ 1 ఒరిజినల్ వెర్షన్ లో మాత్రం మణిరత్నం కంబ్యాక్ స్థాయిలో వసూళ్లు తెచ్చుకుంది. ఎలా చూసినా ప్యాన్ ఇండియా లెవెల్ లో బాహుబలి, కెజిఎఫ్, పుష్ప రేంజ్ లో సీక్వెల్ మీద హైప్ ని తెచ్చుకోవడంలో ఫెయిలైన మాట వాస్తవం
తెలుగులో చాలా కొద్ది మంది హీరోయిన్లకు మాత్రమే సాధ్యమైన స్టార్ ఇమేజ్ సంపాదించింది సమంత. విజయశాంతి, అనుష్కల తర్వాత హీరోలతో…
కేవలం పది కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన సినిమా.. అబ్సెషన్. ఈ హాలీవుడ్ హార్రర్ మూవీ విడుదలైనప్పటి నుంచి వరల్డ్ వైడ్…
స్టార్ హీరో సినిమాల రిపీట్ వేల్యూకి ప్రధానంగా దోహదం చేసేది పాటలే. ఫైట్లు, ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్లు ఎక్కువ లేని…
సంక్రాంతికి రిలీజైన మన శంకరవరప్రసాద్ గారులో ప్రాణ స్నేహితులుగా నటించిన చిరంజీవి, వెంకటేష్ మొదటిసారి స్క్రీన్ పంచుకుని ఎంత పెద్ద…
హెడింగ్ చూడగానే ఏవో ముళ్లచెట్ల వల్ల ఎవరికో ఏదో అయిపోయి షూటింగ్ బ్రేక్ పడిందని అనుకోకండి. ఇక్కడ అడ్డంకులనే కోణంలో…
రాష్ట్రంలో అటవీ సంపదను కాపాడడంతోపాటు.. వన్యప్రాణుల సంరక్షణకు సైతం ప్రాధాన్యం ఇస్తున్న ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్…