అభిమానులను కుటుంబ సభ్యులను శోక సంద్రంలో ముంచేస్తూ కాలం చేసి నెలలు గడుస్తున్నా శాండల్ వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ చివరి జ్ఞాపకాలు మాత్రం సినిమాల రూపంలో ఇంకా వస్తూనే ఉన్నాయి. నిజానికి తన చివరి చిత్రంగా జేమ్స్ ని ప్రమోట్ చేశారు కానీ ఆ తర్వాత కూడా మరో రెండు థియేటర్లలో రావడం విశేషం. అందులో మొదటిది లక్కీ మ్యాన్. ఇటీవలే విశ్వక్ వెంకటేష్ ల కాంబోలో వచ్చిన ఓరి దేవుడాకు కన్నడ రూపం. ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు కానీ పునీత్ ని చూసుకుని ఫ్యాన్స్ మురిసిపోయారు. ఇప్పుడు ఆఖరి నివాళికి సమయం వచ్చింది.
అడవిలో అడ్వెంచర్ రూపంలో పునీత్ చేసిన సాహసాన్ని గంధధగుడి పేరుతో రేపు విడుదల చేయబోతున్నారు. ఇది డాక్యుమెంటరీ తరహాలో సాగే థ్రిల్లర్. అటవీ పర్యావరణాన్ని చిత్రీకరించడంలో అశేమైన పేరు ప్రఖ్యాతులున్న అమోఘవర్ష జెఎస్ దర్శకత్వం వహించారు. దీనికి సంబంధించి మరికొన్ని విశేషాలున్నాయి గంధద గుడి టైటిల్ తో పునీత్ తండ్రి డాక్టర్ రాజ్ కుమార్ 1973లో ఒక సినిమా చేశారు. అది ఆ సమయంలో ఆల్ టైం బ్లాక్ బస్టర్. రికార్డు వసూళ్లు దక్కించుకుంది. దశాబ్దాల తరబడి కల్ట్ క్లాసిక్ గా చరిత్రలో నిలిచిపోయింది. ఎన్టీఆర్ అడవి రామడుకి ప్రధాన స్ఫూర్తి ఈ చిత్రమే.
దీనికి కొనసాగింపుగా 1995లో పునీత్ అన్నయ్య శివ రాజ్ కుమార్ ఓ చిత్రం చేశారు. అదీ హిట్టే. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత సిల్వర్ స్క్రీన్ పై తన చివరి చూపుకు అదే గంధద గుడిని ఎంచుకోవాల్సి రావడం కాకతాళీయం. రేపు ఇది భారీ ఎత్తున విడుదల కానుంది. ఒక రోజు ముందే ఇవాళ బెంగళూర్ లాంటి నగరాల్లో స్పెషల్ ప్రీమియర్లు వేస్తుంటే దాదాపు అడ్వాన్స్ బుకింగ్స్ లోనే ఫుల్ అయిపోయే పరిస్థితి ఉంది. చాలా చిన్న వయసులోనే కన్నుమూసిన పునీత్ కు ఇన్ని నెలల తర్వాత కూడా ఈ స్థాయిలో ఆదరణ దక్కడం చూస్తుంటే భాషతో సంబంధం లేకుండా అతనెంత పునీతుడో అర్థమవుతోంది.
This post was last modified on October 27, 2022 12:38 pm
కొత్త జిల్లాల ఏర్పాటు అంశం రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో ఆశలు రేకెత్తించింది. ఈ ప్రభుత్వం అయినా తమకు న్యాయం చేస్తుందని వారు…
ఒక బాలీవుడ్ మూవీ మూడో వారంలోనూ సూపర్ స్ట్రాంగ్ గా ఉండటం చూసి ఎన్ని నెలలయ్యిందో గుర్తు చేసుకోవడం కష్టం.…
అదేంటో కాకతాళీయంగా జరిగినా పరిశ్రమకు సంబంధించిన కొన్ని విషయాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. ఇటీవలే విడుదలైన అఖండ తాండవం 2 ఆశించిన…
రామ్ గోపాల్ వర్మ అంటే ఒకప్పుడు ఇండియన్ సినిమాలోనే ఒక ట్రెండ్ సెట్టర్. శివ, రంగీలా, సత్య, కంపెనీ, సర్కార్…
రాష్ట్ర రాజకీయాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల నాడిని పట్టుకునే దిశగా పార్టీలు అడుగులు వేస్తున్నాయి. సహజంగా అధికారంలో ఉన్నపార్టీలు…
తెలంగాణలో తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం దక్కించుకుందని.. ఇది 2029 వరకు కొనసాగుతుందని.. అప్పుడు…