Movie News

వెండితెరపై పునీత్ చివరి దర్శనం

అభిమానులను కుటుంబ సభ్యులను శోక సంద్రంలో ముంచేస్తూ కాలం చేసి నెలలు గడుస్తున్నా శాండల్ వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ చివరి జ్ఞాపకాలు మాత్రం సినిమాల రూపంలో ఇంకా వస్తూనే ఉన్నాయి. నిజానికి తన చివరి చిత్రంగా జేమ్స్ ని ప్రమోట్ చేశారు కానీ ఆ తర్వాత కూడా మరో రెండు థియేటర్లలో రావడం విశేషం. అందులో మొదటిది లక్కీ మ్యాన్. ఇటీవలే విశ్వక్ వెంకటేష్ ల కాంబోలో వచ్చిన ఓరి దేవుడాకు కన్నడ రూపం. ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు కానీ పునీత్ ని చూసుకుని ఫ్యాన్స్ మురిసిపోయారు. ఇప్పుడు ఆఖరి నివాళికి సమయం వచ్చింది.

అడవిలో అడ్వెంచర్ రూపంలో పునీత్ చేసిన సాహసాన్ని గంధధగుడి పేరుతో రేపు విడుదల చేయబోతున్నారు. ఇది డాక్యుమెంటరీ తరహాలో సాగే థ్రిల్లర్. అటవీ పర్యావరణాన్ని చిత్రీకరించడంలో అశేమైన పేరు ప్రఖ్యాతులున్న అమోఘవర్ష జెఎస్ దర్శకత్వం వహించారు. దీనికి సంబంధించి మరికొన్ని విశేషాలున్నాయి గంధద గుడి టైటిల్ తో పునీత్ తండ్రి డాక్టర్ రాజ్ కుమార్ 1973లో ఒక సినిమా చేశారు. అది ఆ సమయంలో ఆల్ టైం బ్లాక్ బస్టర్. రికార్డు వసూళ్లు దక్కించుకుంది. దశాబ్దాల తరబడి కల్ట్ క్లాసిక్ గా చరిత్రలో నిలిచిపోయింది. ఎన్టీఆర్ అడవి రామడుకి ప్రధాన స్ఫూర్తి ఈ చిత్రమే.

దీనికి కొనసాగింపుగా 1995లో పునీత్ అన్నయ్య శివ రాజ్ కుమార్ ఓ చిత్రం చేశారు. అదీ హిట్టే. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత సిల్వర్ స్క్రీన్ పై తన చివరి చూపుకు అదే గంధద గుడిని ఎంచుకోవాల్సి రావడం కాకతాళీయం. రేపు ఇది భారీ ఎత్తున విడుదల కానుంది. ఒక రోజు ముందే ఇవాళ బెంగళూర్ లాంటి నగరాల్లో స్పెషల్ ప్రీమియర్లు వేస్తుంటే దాదాపు అడ్వాన్స్ బుకింగ్స్ లోనే ఫుల్ అయిపోయే పరిస్థితి ఉంది. చాలా చిన్న వయసులోనే కన్నుమూసిన పునీత్ కు ఇన్ని నెలల తర్వాత కూడా ఈ స్థాయిలో ఆదరణ దక్కడం చూస్తుంటే భాషతో సంబంధం లేకుండా అతనెంత పునీతుడో అర్థమవుతోంది.

This post was last modified on October 27, 2022 12:38 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప్రీమియర్ల నుంచే హడావిడి మొదలు

కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…

1 hour ago

హ్యాపీగా వస్తే ఎవరూ పట్టించుకోలేదు

జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…

3 hours ago

‘మావిగన్’ పేరుతో జగన్ కొత్త రాజధాని ప్రతిపాదన

ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…

4 hours ago

కాంగ్రెస్ ఎమ్మెల్యేకు మంచు విష్ణు కౌంటర్

టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…

5 hours ago

అమరావతిపై జగన్ అక్కసు తగ్గలేదా?

ఏపీ మాజీ సీఎం జగన్ తన అజ్ఞానపూరితమైన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. జగన్ ప్రెస్ మీట్…

5 hours ago

జయలలిత స్ట్రాటజీ మళ్లీ: విజయ్ పెద్ద ప్లాన్

సినిమాల్లో డ్యూయల్ రోల్స్ తో మెప్పించిన హీరో విజయ్ ఇప్పుడు రాజకీయ రంగంలోనూ అదే తరహాలో రెండు నియోజకవర్గాల నుంచి…

5 hours ago