రితేష్ దేశ్ముఖ్ రెండు దశాబ్దాలకు పైగా సినిమాలు చేస్తున్నాడు. కానీ కెరీర్లో చాలా కాలం మాజీ ముఖ్యమంత్రి విలాస్ రావ్ దేశ్ముఖ్ కొడుకుగా.. జెనీలియా భర్తగానే గుర్తింపు తెచ్చుకున్నాడు. రితేష్ కెరీర్లో కొన్ని హిట్లున్నప్పటికీ.. అతడి నటనకు ప్రశంసలు రావడం.. ఒక సినిమా అతడి వల్లే హిట్ అయింది అనే గుర్తింపు రావడం పెద్దగా జరగలేదు. అయినా అలుపెరగకుండా సినిమాలు చేస్తూనే ఉన్నాడు.
కొన్నేళ్లుగా హిందీలో సినిమాలు చేస్తూనే తన మాతృభాష మరాఠీలో సైతం అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు రితేష్. తాజాగా అతను మరాఠీలో ‘వేద్’ అనే సినిమాను అనౌన్స్ చేశాడు. ఐతే రితేష్ మరాఠీలో సినిమా చేస్తే ఏంటంట అంటారా? ఇందులో రెండు ప్రత్యేకతలు ఉన్నాయి.
రితేష్ ‘వేద్’ సినిమాతో దర్శకుడిగా మారుతున్నాడు. అంతే కాక ఇందులో జెనీలియా అతడికి జోడీగా నటిస్తోంది. ఈ మధ్య బాలీవుడ్లో హిందూ సంస్కృతి, సంప్రదాయాలు, హిందూ ధర్మంతో ముడిపడ్డ సినిమాలు చాలా బాగా ఆడుతున్నాయి. ‘వేద్’ అనే టైటిల్, ఈ సినిమా ఫస్ట్ లుక్ అదీ చూస్తే.. రితేష్ కూడా ట్రెండును ఫాలో అవుతున్నట్లే కనిపిస్తోంది.
నటుడిగా అంత పేరు తెచ్చుకోని రితేష్.. దర్శకుడిగా ఏమాత్రం మెరుపులు మెరిపిస్తాడో చూడాలి. ఇక పెళ్లి తర్వాత కొన్నేళ్ల పాటు కుటుంబం, పిల్లల బాధ్యతల్లో మునిగిపోయిన జెన్నీ.. ఇటీవలే మళ్లీ ముఖానికి రంగేసుకుంది. ఆల్రెడీ బాలీవుడ్లో ఓ సినిమా చేస్తున్న జెన్నీ.. మరాఠీలో భర్తతో కలిసి సినిమాకు రెడీ అయింది. మరి ఈ భార్యాభర్తలకు తమ మాతృభాషలో ఎలాంటి ఫలితం దక్కుతుందో చూడాలి.
This post was last modified on October 27, 2022 12:35 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…