యువ నటుడు సత్యదేవ్ ఏ సినిమా చేసినా.. అతడి నటన గురించి తప్పకుండా ప్రశంసలు వస్తాయి. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా అతడి నటనను మాత్రం అందరూ కొనియాడుతారు. ఇటివలే మెగాస్టార్ చిరంజీవి సినిమా గాడ్ ఫాదర్లో విలన్ పాత్రతో సత్యదేవ్ వావ్ అనిపించాడు. చిరు ముందు అతను విలన్ ఏంటి అని విడుదలకు ముందు అన్న వాళ్లు కూడా రిలీజ్ తర్వాత సినిమాకు సత్యదేవ్ పాత్ర, అతడి నటనే హైలైట్ అన్నారు. ఈ టాలెంటెడ్ యాక్టర్ బాలీవుడ్లోనూ ఓ పెద్ద సినిమాలో అవకాశం దక్కించుకున్నాడు.
అక్షయ్ కుమార్ కథానాయకుడిగా నటించిన ఆ చిత్రమే.. రామ్ సేతు. అభిషేక్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ అడ్వెంచరస్ థ్రిల్లర్ దీపావళి కానుకగా మంగళవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఐతే సినిమా మీద ప్రేక్షకులు పెట్టుకున్న అంచనాలను ఈ సినిమా అందుకోలేకపోయింది.
పురాణాలకు మాత్రమే పరిమితం అయిన రామసేతుకు సంబంధించిన ఆధారాలను కనుగొని అది నిజంగానే ఉంది అని చాటి చెప్పే ప్రయత్నంతో సాగే ఈ సినిమా పూర్తి స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. కాన్సెప్ట్ బాగున్నా.. ప్రథమార్ధం వరకు ఆసక్తికరంగా సాగినా సినిమా ఓవరాల్గా మెప్పించలేదని.. రెండో అర్ధం నుంచి గాడి తప్పిన సినిమా చివరికి నిరాశను మిగిల్చిందని అంటున్నారు. ఐతే సినిమా విషయంలో మిశ్రమ స్పందన వస్తున్నప్పటికీ.. సత్యదేవ్ పాత్ర, నటన విసయంలో మాత్రం ప్రశంసలు జల్లు కురుస్తోంది.
సినిమా చూసిన ప్రతి ఒక్కరూ సత్యదేవ్ సూపర్ అనే అంటున్నారు. ఫుల్ లెంగ్త్లో సాగే అక్షయ్ కుమార్ పాత్ర కంటే సత్యదేవ్ క్యారెక్టర్, అతడి నటనే బాగున్నాయని అంటున్నారు. మొత్తానికి సినిమా ఎలా ఉన్నప్పటికీ.. తనవరకు హైలైట్ అయ్యే ట్రెండుని సత్యదేవ్ కొనసాగిస్తున్నాడన్నమాట. ఈ సినిమాతో వచ్చిన పేరుతో బాలీవుడ్లో సత్యదేవ్ మరిన్ని అవకాశాలు దక్కించుకుంటాడేమో చూడాలి.
This post was last modified on October 25, 2022 10:06 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…