యువ నటుడు సత్యదేవ్ ఏ సినిమా చేసినా.. అతడి నటన గురించి తప్పకుండా ప్రశంసలు వస్తాయి. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా అతడి నటనను మాత్రం అందరూ కొనియాడుతారు. ఇటివలే మెగాస్టార్ చిరంజీవి సినిమా గాడ్ ఫాదర్లో విలన్ పాత్రతో సత్యదేవ్ వావ్ అనిపించాడు. చిరు ముందు అతను విలన్ ఏంటి అని విడుదలకు ముందు అన్న వాళ్లు కూడా రిలీజ్ తర్వాత సినిమాకు సత్యదేవ్ పాత్ర, అతడి నటనే హైలైట్ అన్నారు. ఈ టాలెంటెడ్ యాక్టర్ బాలీవుడ్లోనూ ఓ పెద్ద సినిమాలో అవకాశం దక్కించుకున్నాడు.
అక్షయ్ కుమార్ కథానాయకుడిగా నటించిన ఆ చిత్రమే.. రామ్ సేతు. అభిషేక్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ అడ్వెంచరస్ థ్రిల్లర్ దీపావళి కానుకగా మంగళవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఐతే సినిమా మీద ప్రేక్షకులు పెట్టుకున్న అంచనాలను ఈ సినిమా అందుకోలేకపోయింది.
పురాణాలకు మాత్రమే పరిమితం అయిన రామసేతుకు సంబంధించిన ఆధారాలను కనుగొని అది నిజంగానే ఉంది అని చాటి చెప్పే ప్రయత్నంతో సాగే ఈ సినిమా పూర్తి స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. కాన్సెప్ట్ బాగున్నా.. ప్రథమార్ధం వరకు ఆసక్తికరంగా సాగినా సినిమా ఓవరాల్గా మెప్పించలేదని.. రెండో అర్ధం నుంచి గాడి తప్పిన సినిమా చివరికి నిరాశను మిగిల్చిందని అంటున్నారు. ఐతే సినిమా విషయంలో మిశ్రమ స్పందన వస్తున్నప్పటికీ.. సత్యదేవ్ పాత్ర, నటన విసయంలో మాత్రం ప్రశంసలు జల్లు కురుస్తోంది.
సినిమా చూసిన ప్రతి ఒక్కరూ సత్యదేవ్ సూపర్ అనే అంటున్నారు. ఫుల్ లెంగ్త్లో సాగే అక్షయ్ కుమార్ పాత్ర కంటే సత్యదేవ్ క్యారెక్టర్, అతడి నటనే బాగున్నాయని అంటున్నారు. మొత్తానికి సినిమా ఎలా ఉన్నప్పటికీ.. తనవరకు హైలైట్ అయ్యే ట్రెండుని సత్యదేవ్ కొనసాగిస్తున్నాడన్నమాట. ఈ సినిమాతో వచ్చిన పేరుతో బాలీవుడ్లో సత్యదేవ్ మరిన్ని అవకాశాలు దక్కించుకుంటాడేమో చూడాలి.
ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ 'మై వాపస్ ఆవుంగా'కు తొలి రోజు రివ్యూలు ఏమంత ఆశాజనకంగా లేవు. పబ్లిక్ టాక్…
సాయిధరమ్ తేజ్ హీరోగా రెండేళ్ల ముందు మొదలైన సినిమా.. సంబరాల యేటిగట్టు. తన మార్కెట్ స్థాయికి మించి పెద్ద బడ్జెట్లో…
పెద్ది మొదటి రెండు వారాలు బాగా సందడి చేసి కలెక్షన్ల వర్షం కురిపించాక మళ్ళీ దాన్ని కొనసాగించే సినిమా ఏది…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’యే చివరి చిత్రం అవుతుందనే అంచనాలు కలిగాయి ఒక దశలో.…
తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు, యువ ఉద్యోగుల మరణ వార్తలు అమెరికా నుంచి వరుసగా వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. రోడ్డు…
వైసీపీ ఆధ్వర్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని కోనసీమలో ఆదివారం నిర్వహించిన కాపుల సభలో మాజీ మంత్రి, ఉత్తరాంధ్రకు చెందిన బొత్స…