Adipurush
Prabhas అభిమానుల దృష్టంతా ఇప్పుడు ఆదిపురుష్ మీదే ఉంది. బాహుబలి తర్వాత ప్రభాస్ నుంచి వచ్చిన సాహో, రాధేశ్యామ్ ఒకదాన్ని మించి ఒకటి నిరాశ పరచడంతో అభిమానుల ఆశలన్నీ ఆదిపురుష్ మీదే ఉన్నాయి. కానీ ఇటీవలే రిలీజైన ఆ సినిమా టీజర్ నెగెటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది.
అందులో విజువల్ ఎఫెక్ట్స్తో పాటు రావణుడు, హనుమంతుడు పాత్రల లుక్స్, అప్పీయరెన్స్ విషయంలో తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో ఓం రౌత్ అండ్ టీం మార్పులు చేర్పులకు ప్రయత్నిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఐతే సినిమాను సంక్రాంతికే రిలీజ్ చేయాలనే పట్టుదలతో ఉన్నట్లే చిత్ర బృందం నుంచి సంకేతాలు వచ్చాయి. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే సంక్రాంతికి ఆదిపురుష్ను రిలీజ్ చేయడం కరెక్టేనా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
Adipurush ఎంత బాలీవుడ్ మూవీ అయినా.. ఆ సినిమాకు మేజర్ వసూళ్లు వచ్చేది తెలుగు రాష్ట్రాల నుంచే. ప్రభాస్కు తెలుగులో ఉన్న ఫాలోయింగ్ అలాంటిది. కానీ సంక్రాంతికి తెలుగులో వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి లాంటి మాస్ మసాలా సినిమాలు రిలీజవుతున్నాయి. దీనికి తోడు విజయ్ డబ్బింగ్ మూవీ వారసుడు కూడా విడుదలవుతోంది.
ఈ సినిమాలు ఎలా ఉంటాయి.. ఎంత వసూళ్లు రాబడతాయన్నది పక్కన పెడితే.. వాటి కోసం చాలా థియేటర్లు కేటాయించాల్సి ఉంటుంది. ఆదిపురుష్ లాంటి భారీ చిత్రాన్ని ఎక్కువ థియేటర్లలో సోలోగా రిలీజ్ చేయడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. పోటీ లేకుంటేనే ఇలాంటి భారీ చిత్రానికి మంచిది.
తక్కువ థియేటర్లలో పోటీ మధ్య రిలీజ్ చేస్తే అటు ఇటు అయితే బయ్యర్లు దారుణంగా దెబ్బ తింటారు. ఈ నేపథ్యంలో సినిమాను సంక్రాంతి కంటే ముందో, వెనుకో రిలీజ్ చేయడంపై చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. కానీ దీపావళి సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్లో మాత్రం జనవరి 12నే రిలీజ్ అని కన్ఫమ్ చేశారు. మరి చివరగా రిలీజ్పై ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
This post was last modified on October 24, 2022 10:54 am
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…
దేశంలో గత కొంతకాలం నుంచి బీజేపీ హవా నడుస్తోంది. అయితే కొన్ని రాష్ట్రాల్లో ఆ పార్టీకి ఆశించిన మేర విజయాలు…