Adipurush
Prabhas అభిమానుల దృష్టంతా ఇప్పుడు ఆదిపురుష్ మీదే ఉంది. బాహుబలి తర్వాత ప్రభాస్ నుంచి వచ్చిన సాహో, రాధేశ్యామ్ ఒకదాన్ని మించి ఒకటి నిరాశ పరచడంతో అభిమానుల ఆశలన్నీ ఆదిపురుష్ మీదే ఉన్నాయి. కానీ ఇటీవలే రిలీజైన ఆ సినిమా టీజర్ నెగెటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది.
అందులో విజువల్ ఎఫెక్ట్స్తో పాటు రావణుడు, హనుమంతుడు పాత్రల లుక్స్, అప్పీయరెన్స్ విషయంలో తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో ఓం రౌత్ అండ్ టీం మార్పులు చేర్పులకు ప్రయత్నిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఐతే సినిమాను సంక్రాంతికే రిలీజ్ చేయాలనే పట్టుదలతో ఉన్నట్లే చిత్ర బృందం నుంచి సంకేతాలు వచ్చాయి. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే సంక్రాంతికి ఆదిపురుష్ను రిలీజ్ చేయడం కరెక్టేనా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
Adipurush ఎంత బాలీవుడ్ మూవీ అయినా.. ఆ సినిమాకు మేజర్ వసూళ్లు వచ్చేది తెలుగు రాష్ట్రాల నుంచే. ప్రభాస్కు తెలుగులో ఉన్న ఫాలోయింగ్ అలాంటిది. కానీ సంక్రాంతికి తెలుగులో వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి లాంటి మాస్ మసాలా సినిమాలు రిలీజవుతున్నాయి. దీనికి తోడు విజయ్ డబ్బింగ్ మూవీ వారసుడు కూడా విడుదలవుతోంది.
ఈ సినిమాలు ఎలా ఉంటాయి.. ఎంత వసూళ్లు రాబడతాయన్నది పక్కన పెడితే.. వాటి కోసం చాలా థియేటర్లు కేటాయించాల్సి ఉంటుంది. ఆదిపురుష్ లాంటి భారీ చిత్రాన్ని ఎక్కువ థియేటర్లలో సోలోగా రిలీజ్ చేయడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. పోటీ లేకుంటేనే ఇలాంటి భారీ చిత్రానికి మంచిది.
తక్కువ థియేటర్లలో పోటీ మధ్య రిలీజ్ చేస్తే అటు ఇటు అయితే బయ్యర్లు దారుణంగా దెబ్బ తింటారు. ఈ నేపథ్యంలో సినిమాను సంక్రాంతి కంటే ముందో, వెనుకో రిలీజ్ చేయడంపై చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. కానీ దీపావళి సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్లో మాత్రం జనవరి 12నే రిలీజ్ అని కన్ఫమ్ చేశారు. మరి చివరగా రిలీజ్పై ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
ఏపీ సీఎం చంద్రబాబును విజయవాడలోని కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ కుటుంబ సభ్యులు కలిసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మీడియాతో…
విజువల్ ఎఫెక్ట్స్ మీద ఆధారపడి సినిమాలు తీయడం చాలా రిస్క్. కొన్నిసార్లు ఇవి తీసుకునే సమయం హీరోల కెరీర్ల మీద…
బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న NBK111 ప్రాజెక్టులో స్టార్ క్యాస్ట్ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా ఉంది.…
విజయవాడలో యువకుడి అదృశ్యం కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తిస్తోంది. రాజకీయ, కులం రంగు పులుముకున్న ఈ వ్యవహారం…
విజయవాడలో కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ అనే యువకుడు లాకప్ డెత్ కు గురయ్యాడని ఆరోపణలు రావడం రాజకీయ దుమారం రేపిన…
పెద్ది విడుదలకు ముందు జాన్వీ కపూర్ ప్రమోషన్ల పరంగా ఎంత చేయాలో అంతా చేసింది. ఇండియా మొత్తం టీమ్ తో…