టాలీవుడ్లో ఒక దశలో నంబర్ వన్ హీరోయిన్ పొజిషన్కు గట్టి పోటీదారుగా ఉంది రకుల్ ప్రీత్ సింగ్. ఇక ఆమే నంబర్ వన్ అని కూడా అంతా అనుకున్నారు. ‘నాన్నకు ప్రేమతో’; ‘సరైనోడు’ లాంటి హిట్లతో నంబర్ వన్ దిశగా దూసుకెళ్లిందామె. అలాంటి హీరోయిన్ రెండు మూడేళ్లు తిరిగేసరికి టాలీవుడ్ నుంచి అంతర్ధానం అయ్యే పరిస్థితి రావడం ఆశ్చర్యం కలిగించే విషయమే.
తెలుగులో రకుల్ మెరుపులు మెరిసి చాలా కాలం అయిపోయింది. చంద్రశేఖర్ యేలేటి-నితిన్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా మినహాయిస్తే ఆమెకు ఆఫర్లు లేవు. వేరే ఇండస్ట్రీల్లో కూడా రకుల్కు ఆఫర్లు పెద్దగా లేనట్లే కనిపిస్తోంది. ఇంకొన్నేళ్లలో కెరీర్ ముగించి పెళ్లి చేసుకుని వ్యక్తిగత జీవితంలో సెటిలైపోయినా ఆశ్చర్యం లేదేమో. ఐతే పెళ్లి ఎప్పుడు చేసుకుంటుందో ఏమో కానీ.. తనకు కాబోయే వరుడికి మాత్రం ఒక అర్హత కచ్చితంగా ఉండాల్సిందే అంటోంది రకుల్.
మంచి పొడగరే అయిన రకుల్.. తన కంటే ఇంకా ఎక్కువ ఎత్తున్న వాడినే చేసుకుంటానని.. తాను హై హీల్స్ వేసుకున్నా సరే.. తల ఎత్తి చూసేంత ఎత్తుగా అతనుండాలని చెప్పడం విశేషం. అలాగే ఆ వ్యక్తి చాలా తెలివైన వాడై ఉండాలని.. తాను పెళ్లి చేసుకునే సమయానికి ఏమైనా సాధించి ఉండాలని రకుల్ అభిప్రాయపడింది. ఇక మన వివాహ వ్యవస్థ మీద తనకెంతో గౌరవం ఉందన్న రకుల్.. చాలామంది పెల్లి అనగానే ఎందుకు ఒత్తిడికి గురవుతుంటారో తనకు అర్థం కాదని అంది.
పెళ్లి అనేది ఒక అందమైన అనుభూతి అన్న రకుల్.. ఎవరినైనా ప్రేమిస్తే మనస్ఫూర్తిగా ప్రేమించాలనేది తన ఉద్దేశమని చెప్పింది. ప్రస్తుతానికి తాను ఎవరి ప్రేమలోనూ లేనని.. సరైన సమయం వచ్చినపుడు పెళ్లి చేసుకుంటానని ఆమె చెప్పింది. తెలుగులో రకుల్ చివరగా అక్కినేని నాగార్జున సరసన ‘మన్మథుడు-2’లో కనిపించిన సంగతి తెలిసిందే.
This post was last modified on July 10, 2020 1:33 pm
అక్కినేని యువ కథానాయకుడు అఖిల్ హీరోగా స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి రూపొందించిన ‘ఏజెంట్’ టాలీవుడ్ చరిత్రలోనే అతి పెద్ద…
ఒక సినిమా రిలీజైన రెండు మూడేళ్ల తర్వాత కూడా దాని కలెక్షన్ల గురించి విపరీతమైన చర్చ జరగడం అరుదు. ‘దేవర’ విషయంలో ఇదే…
కేంద్ర విద్యా శాఖకు నూతన మంత్రిగా బీజేపీ సీనియర్ నేత, కేంద్ర కేబినెట్ లో కీలక శాఖల మంత్రిగా కొనసాగుతున్న ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు.…
బాక్సాఫీస్ దగ్గర పోటీ ఉన్నప్పుడు కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు జరుగుతాయి. ఇది అలాంటిదే. కేవలం ఒక్క రోజు గ్యాప్ తో…
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులను సొంతం చేసుకున్న స్పైడర్ మ్యాన్ సిరీస్ లోని కొత్త సినిమా బ్రాండ్ న్యూ డే జూలై…
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ కొత్త లాజిక్ మాట్లాడుతున్నారు. నైతిక బాధ్యత వహిస్తూ…