టాలీవుడ్లో ఒక దశలో నంబర్ వన్ హీరోయిన్ పొజిషన్కు గట్టి పోటీదారుగా ఉంది రకుల్ ప్రీత్ సింగ్. ఇక ఆమే నంబర్ వన్ అని కూడా అంతా అనుకున్నారు. ‘నాన్నకు ప్రేమతో’; ‘సరైనోడు’ లాంటి హిట్లతో నంబర్ వన్ దిశగా దూసుకెళ్లిందామె. అలాంటి హీరోయిన్ రెండు మూడేళ్లు తిరిగేసరికి టాలీవుడ్ నుంచి అంతర్ధానం అయ్యే పరిస్థితి రావడం ఆశ్చర్యం కలిగించే విషయమే.
తెలుగులో రకుల్ మెరుపులు మెరిసి చాలా కాలం అయిపోయింది. చంద్రశేఖర్ యేలేటి-నితిన్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా మినహాయిస్తే ఆమెకు ఆఫర్లు లేవు. వేరే ఇండస్ట్రీల్లో కూడా రకుల్కు ఆఫర్లు పెద్దగా లేనట్లే కనిపిస్తోంది. ఇంకొన్నేళ్లలో కెరీర్ ముగించి పెళ్లి చేసుకుని వ్యక్తిగత జీవితంలో సెటిలైపోయినా ఆశ్చర్యం లేదేమో. ఐతే పెళ్లి ఎప్పుడు చేసుకుంటుందో ఏమో కానీ.. తనకు కాబోయే వరుడికి మాత్రం ఒక అర్హత కచ్చితంగా ఉండాల్సిందే అంటోంది రకుల్.
మంచి పొడగరే అయిన రకుల్.. తన కంటే ఇంకా ఎక్కువ ఎత్తున్న వాడినే చేసుకుంటానని.. తాను హై హీల్స్ వేసుకున్నా సరే.. తల ఎత్తి చూసేంత ఎత్తుగా అతనుండాలని చెప్పడం విశేషం. అలాగే ఆ వ్యక్తి చాలా తెలివైన వాడై ఉండాలని.. తాను పెళ్లి చేసుకునే సమయానికి ఏమైనా సాధించి ఉండాలని రకుల్ అభిప్రాయపడింది. ఇక మన వివాహ వ్యవస్థ మీద తనకెంతో గౌరవం ఉందన్న రకుల్.. చాలామంది పెల్లి అనగానే ఎందుకు ఒత్తిడికి గురవుతుంటారో తనకు అర్థం కాదని అంది.
పెళ్లి అనేది ఒక అందమైన అనుభూతి అన్న రకుల్.. ఎవరినైనా ప్రేమిస్తే మనస్ఫూర్తిగా ప్రేమించాలనేది తన ఉద్దేశమని చెప్పింది. ప్రస్తుతానికి తాను ఎవరి ప్రేమలోనూ లేనని.. సరైన సమయం వచ్చినపుడు పెళ్లి చేసుకుంటానని ఆమె చెప్పింది. తెలుగులో రకుల్ చివరగా అక్కినేని నాగార్జున సరసన ‘మన్మథుడు-2’లో కనిపించిన సంగతి తెలిసిందే.
This post was last modified on July 10, 2020 1:33 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…