టాలీవుడ్లో ఒక దశలో నంబర్ వన్ హీరోయిన్ పొజిషన్కు గట్టి పోటీదారుగా ఉంది రకుల్ ప్రీత్ సింగ్. ఇక ఆమే నంబర్ వన్ అని కూడా అంతా అనుకున్నారు. ‘నాన్నకు ప్రేమతో’; ‘సరైనోడు’ లాంటి హిట్లతో నంబర్ వన్ దిశగా దూసుకెళ్లిందామె. అలాంటి హీరోయిన్ రెండు మూడేళ్లు తిరిగేసరికి టాలీవుడ్ నుంచి అంతర్ధానం అయ్యే పరిస్థితి రావడం ఆశ్చర్యం కలిగించే విషయమే.
తెలుగులో రకుల్ మెరుపులు మెరిసి చాలా కాలం అయిపోయింది. చంద్రశేఖర్ యేలేటి-నితిన్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా మినహాయిస్తే ఆమెకు ఆఫర్లు లేవు. వేరే ఇండస్ట్రీల్లో కూడా రకుల్కు ఆఫర్లు పెద్దగా లేనట్లే కనిపిస్తోంది. ఇంకొన్నేళ్లలో కెరీర్ ముగించి పెళ్లి చేసుకుని వ్యక్తిగత జీవితంలో సెటిలైపోయినా ఆశ్చర్యం లేదేమో. ఐతే పెళ్లి ఎప్పుడు చేసుకుంటుందో ఏమో కానీ.. తనకు కాబోయే వరుడికి మాత్రం ఒక అర్హత కచ్చితంగా ఉండాల్సిందే అంటోంది రకుల్.
మంచి పొడగరే అయిన రకుల్.. తన కంటే ఇంకా ఎక్కువ ఎత్తున్న వాడినే చేసుకుంటానని.. తాను హై హీల్స్ వేసుకున్నా సరే.. తల ఎత్తి చూసేంత ఎత్తుగా అతనుండాలని చెప్పడం విశేషం. అలాగే ఆ వ్యక్తి చాలా తెలివైన వాడై ఉండాలని.. తాను పెళ్లి చేసుకునే సమయానికి ఏమైనా సాధించి ఉండాలని రకుల్ అభిప్రాయపడింది. ఇక మన వివాహ వ్యవస్థ మీద తనకెంతో గౌరవం ఉందన్న రకుల్.. చాలామంది పెల్లి అనగానే ఎందుకు ఒత్తిడికి గురవుతుంటారో తనకు అర్థం కాదని అంది.
పెళ్లి అనేది ఒక అందమైన అనుభూతి అన్న రకుల్.. ఎవరినైనా ప్రేమిస్తే మనస్ఫూర్తిగా ప్రేమించాలనేది తన ఉద్దేశమని చెప్పింది. ప్రస్తుతానికి తాను ఎవరి ప్రేమలోనూ లేనని.. సరైన సమయం వచ్చినపుడు పెళ్లి చేసుకుంటానని ఆమె చెప్పింది. తెలుగులో రకుల్ చివరగా అక్కినేని నాగార్జున సరసన ‘మన్మథుడు-2’లో కనిపించిన సంగతి తెలిసిందే.
This post was last modified on July 10, 2020 1:33 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…