ఈ మధ్య కాలంలో రీమేకులు చేస్తున్న నిర్మాతలకు వస్తున్న అతి పెద్ద సమస్య ఒరిజినల్ వెర్షన్లు ఓటిటిలో అందుబాటులో ఉండటం. భీమ్లా నాయక్ ప్రకటన వచ్చినప్పుడు బాష రాకపోయినా సరే సబ్ టైటిల్స్ సహాయంతో అయ్యప్పనుం కోశియుమ్ ని చూసినవాళ్లు లక్షల్లో ఉన్నారు. గాడ్ ఫాదర్ రిలీజ్ కు రెడీ అయినప్పుడు దర్శకుడు మోహన్ రాజా ఏకంగా లూసిఫర్ ని చూసి రమ్మని ఎంకరేజ్ చేశారు. ఇవన్నీ అంతో ఇంతో బజ్ మీద ప్రభావం చూపించిన అంశాలే. ఒకప్పుడంటే వీడియో టెక్నాలజీ ఈ స్థాయిలో లేదు కాబట్టి వేరే లాంగ్వేజెస్ లో హిట్ అయిన వాటిని అంత సులభంగా చూసే అవకాశం ఉండేది కాదు.
అందుకే హిందీ నిర్మాతలు ఇప్పుడో కొత్త ఎత్తుగడ ఎంచుకున్నారు. రీమేక్ నిర్మాణంలో ఉన్నప్పుడే వాటి మూలాలు ఓటిటిలో లేకుండా జాగ్రత్త పడుతున్నారు. స్వర్గీయ శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ టైటిల్ రోల్ పోషించిన మిలి త్వరలో విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఇది 2019లో వచ్చిన మలయాళం సూపర్ హిట్ హెలెన్ రీమేక్. గతంలో అమెజాన్ ప్రైమ్ లో ఉండేది. హీరోయిన్ అన్నా బెన్ పెర్ఫార్మన్స్ కి వాహ్ అనని వాళ్ళు లేరు. ఇప్పుడు మిలి రిలీజ్ కు రెడీ అవుతోంది కాబట్టి దాన్ని ఓటిటి నుంచి మాయం చేసేశారు. చూడాలన్నా, పోలికలు పెట్టుకోవాలన్నా నో ఛాన్స్.
ఇదే కాదు 2014లో బెంగళూర్ డేస్ అనే మరో బ్లాక్ బస్టర్ ఉంది. ఇది హిందీలో యారియా 2 పేరుతో ఇప్పుడు తీస్తున్నారు. ముందు జాగ్రత్తగా ఇది కూడా డిజిటల్ లో లేపేశారు. కట్ చేస్తే ఇప్పుడీ స్ట్రాటజీ చక్కగా వర్కౌట్ అయ్యేలా ఉంది. పైరసీ మార్గంలో చూసేవాళ్లను కట్టడి చేయలేం కాని వీటి మీద అవగాహన లేక కేవలం ఓటిటిలో చూసే అలవాటున్న వాళ్ళు పై రెండు సినిమాలు థియేటర్లలోనే చూడాల్సి ఉంటుంది. గతంలో కాటమరాయుడు విషయంలోనూ ఇలాంటి నిర్లక్ష్యం ప్రభావం చూపించింది. ఏది ఏమైనా రీమేకులు మాత్రం ఇకపై వీలైనంత ఆలస్యం కాకుండా చూసుకోవడం బెటర్.
సెలబ్రెటీల కుటుంబాల్లో కొందరిలో ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ.. అది ఎప్పుడో కానీ బయటికి రాదు. ఎప్పుడూ మామూలుగా కనిపించే వ్యక్తులు..…
రిలీజైన రోజు నుంచి వీకెండ్ దాకా చెడుగుడు ఆడేసిన లెనిన్ ఎట్టకేలకు అఖిల్ కెరీర్ లో ఒక హిట్టుని చేర్చేసింది.…
టాలీవుడ్ అగ్రశ్రేణి డ్యాన్స్ మాస్టర్లు ఇద్దరి మధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ మధ్య ఘర్షణ చోటు…
టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…
మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…
ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…