ఈ మధ్య కాలంలో రీమేకులు చేస్తున్న నిర్మాతలకు వస్తున్న అతి పెద్ద సమస్య ఒరిజినల్ వెర్షన్లు ఓటిటిలో అందుబాటులో ఉండటం. భీమ్లా నాయక్ ప్రకటన వచ్చినప్పుడు బాష రాకపోయినా సరే సబ్ టైటిల్స్ సహాయంతో అయ్యప్పనుం కోశియుమ్ ని చూసినవాళ్లు లక్షల్లో ఉన్నారు. గాడ్ ఫాదర్ రిలీజ్ కు రెడీ అయినప్పుడు దర్శకుడు మోహన్ రాజా ఏకంగా లూసిఫర్ ని చూసి రమ్మని ఎంకరేజ్ చేశారు. ఇవన్నీ అంతో ఇంతో బజ్ మీద ప్రభావం చూపించిన అంశాలే. ఒకప్పుడంటే వీడియో టెక్నాలజీ ఈ స్థాయిలో లేదు కాబట్టి వేరే లాంగ్వేజెస్ లో హిట్ అయిన వాటిని అంత సులభంగా చూసే అవకాశం ఉండేది కాదు.
అందుకే హిందీ నిర్మాతలు ఇప్పుడో కొత్త ఎత్తుగడ ఎంచుకున్నారు. రీమేక్ నిర్మాణంలో ఉన్నప్పుడే వాటి మూలాలు ఓటిటిలో లేకుండా జాగ్రత్త పడుతున్నారు. స్వర్గీయ శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ టైటిల్ రోల్ పోషించిన మిలి త్వరలో విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఇది 2019లో వచ్చిన మలయాళం సూపర్ హిట్ హెలెన్ రీమేక్. గతంలో అమెజాన్ ప్రైమ్ లో ఉండేది. హీరోయిన్ అన్నా బెన్ పెర్ఫార్మన్స్ కి వాహ్ అనని వాళ్ళు లేరు. ఇప్పుడు మిలి రిలీజ్ కు రెడీ అవుతోంది కాబట్టి దాన్ని ఓటిటి నుంచి మాయం చేసేశారు. చూడాలన్నా, పోలికలు పెట్టుకోవాలన్నా నో ఛాన్స్.
ఇదే కాదు 2014లో బెంగళూర్ డేస్ అనే మరో బ్లాక్ బస్టర్ ఉంది. ఇది హిందీలో యారియా 2 పేరుతో ఇప్పుడు తీస్తున్నారు. ముందు జాగ్రత్తగా ఇది కూడా డిజిటల్ లో లేపేశారు. కట్ చేస్తే ఇప్పుడీ స్ట్రాటజీ చక్కగా వర్కౌట్ అయ్యేలా ఉంది. పైరసీ మార్గంలో చూసేవాళ్లను కట్టడి చేయలేం కాని వీటి మీద అవగాహన లేక కేవలం ఓటిటిలో చూసే అలవాటున్న వాళ్ళు పై రెండు సినిమాలు థియేటర్లలోనే చూడాల్సి ఉంటుంది. గతంలో కాటమరాయుడు విషయంలోనూ ఇలాంటి నిర్లక్ష్యం ప్రభావం చూపించింది. ఏది ఏమైనా రీమేకులు మాత్రం ఇకపై వీలైనంత ఆలస్యం కాకుండా చూసుకోవడం బెటర్.
This post was last modified on October 21, 2022 8:57 am
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…