ఈసారి దసరా పండక్కి మూడు సినిమాలు రిలీజైతే.. అందులో కంటెంట్ పరంగా కొత్తగా అనిపించి, మంచి సినిమాగా గుర్తింపు తెచ్చుకున్నది స్వాతిముత్యం సినిమానే. నాగార్జున సినిమా ది ఘోస్ట్ నెగెటివ్ టాక్ తెచ్చుకుని బోల్తా కొట్టగా.. చిరు సినిమాకు డీసెంట్ టాక్ వచ్చింది. అందుకు తగ్గట్లే తొలి వీకెండ్ వరకు మంచి వసూళ్లు కూడా వచ్చాయి. ఐతే స్వాతిముత్యం సినిమా మాత్రం టాక్తో తగ్గట్లుగా బాక్సాఫీస్ దగ్గర పెర్ఫామ్ చేయలేకపోయింది.
కొత్త హీరో, పేరు లేని హీరోయిన్ కాబట్టి విడుదల ముంగిట, రిలీజ్ రోజు సందడి లేదు అనుకోవచ్చు. కానీ మంచి టాక్ వచ్చింది, రివ్యూలు బాగున్నాయి. అందులోనూ దసరా సెలవులున్నాయి. అలాంటపుడు సినిమా కచ్చితంగా పుంజుకుంటుందని అనుకున్నారు. కానీ అలా జరగలేదు. నామమాత్రపు వసూళ్లతో సాగిన ఈ సినిమా బాక్సాఫీస్ ఫెయిల్యూర్గా నిలిచింది.
ఐతే ఇలా మంచి టాక్ తెచ్చుకుని కూడా థియేటర్లలో సరిగా ఆడని రాజావారు రాణివారు, అశోకవనంలో అర్జున కళ్యాణం లాంటి చిత్రాలు ఓటీటీల్లో చాలా మంచి స్పందన తెచ్చుకున్నాయి. చాలామంది ఆ సినిమాలు చూసి థియేటర్లలో ఇవెందుకు బాగా ఆడలేదని ఆశ్చర్యపోయారు. స్వాతిముత్యం విషయంలోనూ ఇదే జరుగుతుందని భావిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆహా ఓటీటీ స్ట్రీమింగ్ చేయబోతోంది.
ముందు ఈ నెల 28న డిజిటల్ రిలీజ్ అనుకున్నారు కానీ.. తర్వాత ఆలోచన మార్చుకున్నారు. దీపావళి కానుకగా ఈ నెల 24 నుంచి ఆహాలో ప్రసారం కాబోతోంది స్వాతిముత్యం. మరి థియేటర్లలో సరిగా ఆడలేకపోయిన ఈ చిత్రం డిజిటల్గా అయినా ప్రేక్షకులను అలరించి మంచి వ్యూయర్షిప్ తెచ్చుకుంటుందేమో చూడాలి. బెల్లంకొండ గణేష్ కథానాయికుడిగా పరిచయం అయిన ఈ చిత్రంలో వర్ష బొల్లమ్మ కథానాయికగా నటించింది. కొత్త దర్శకుడు లక్ష్మణ్ రూపొందించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించింది.
This post was last modified on October 20, 2022 2:55 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…