‘బాహుబలి-2’, ‘కేజీఎఫ్-2’ చిత్రాల తర్వాత దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న సీక్వెల్ అంటే ‘పుష్ప-2’నే. గత ఏడాది డివైడ్ టాక్తో మొదలైన ఈ సినిమా అంచనాలను మించి ఆడేసింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల అవతల.. అందులోనూ ఉత్తరాదిన ఈ సినిమాకు వచ్చిన స్పందన అనూహ్యం. అక్కడ చాలా పెద్ద బ్లాక్బస్టర్ అయిపోయి.. ఒక యుఫోరియా సృష్టించింది ‘పుష్ప’. ఈ సినిమాలో బన్నీ తగ్గేదేలే మేనరిజం అంతర్జాతీయ స్థాయిలో పాపులర్ అయింది. దీని వల్ల కూడా సీక్వెల్కు ఇంకా క్రేజ్ పెరిగింది.
ఐతే ఈ అంచనాలు పెరగడం వల్ల సుకుమార్ మరింత జాగ్రత్త పడుతున్నాడు. ముందు అనుకున్న స్క్రిప్టును మార్చి ఇంకా పకడ్బందీగా తయారు చేసే క్రమంలో బాగా టైం తీసుకుంటున్నాడు. ఫస్ట్ పార్ట్ వచ్చి పది నెలలు దాటినా ఈ చిత్రం ఇంకా సెట్స్ మీదికి వెళ్లని సంగతి తెలిసిందే. ఈ నెల చివరి వారంలో షూటింగ్ ప్రారంభం కావచ్చని అంటున్నారు.
ఐతే షూటింగ్ మొదలవడానికి ముందే బన్నీ లుక్ టెస్ట్ జరిగింది. అన్నపూర్ణ స్టూడియలో రెండు దశలుగా కొన్ని రోజుల పాటు ఈ షూట్ నడిచింది. ఈ సందర్భంగా లుక్ ఒకటి సెట్ చేసి రకరకాల గెటప్పుల్లో టెస్ట షూట్ చేశారు. అందులో ఒక స్టన్నింగ్ గెటప్ ఉందని, అది సినిమాలో కీలక ఎపిసోడ్కు సంబంధించినదని సమాచారం. ముందు ఆ గెటప్ను సర్ప్రైజ్ లాగా దాచి పెట్టాలని అనుకున్నప్పటికీ.. దాన్నే ఫస్ట్ లుక్గా రిలీజ్ చేయాలని సుకుమార్ ఫిక్సయ్యాడట.
దీపావళికి ‘పుష్ప-2’ ఫస్ట్ లుక్ లాంచ్ చేసే అవకాశాలున్నట్లు సమాచారం. ‘పుష్ప’ సినిమాకు కూడా ఇలాగే టెస్ట్ షూట్ చేసి, షూటింగ్ మొదలవడానికి ముందే ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ లుక్తోటే సినిమా మీద అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఇప్పుడు ఆల్రెడీ అంచనాలు ఎక్కువే ఉండగా.. వాటిని ఇంకా పీక్స్కు తీసుకెళ్లేలా సంచలన లుక్ను సుకుమార్ రెడీ చేసినట్లు చెబుతున్నారు.
This post was last modified on October 17, 2022 2:54 pm
నిన్న విడుదలైన ది రాజా సాబ్ అభిమానుల అంచనాలకు తగ్గట్టే సెంచరీతో ఓపెనింగ్స్ మొదలుపెట్టింది. నిర్మాత విశ్వప్రసాద్ సక్సెస్ మీట్…
సెన్సార్ ఇష్యూతో పాటు థియేటర్ల కొరత కారణంగా తమిళ మూవీ పరాశక్తి మన దగ్గర విడుదల కాలేదు. ఒక వారం…
రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న మన శంకరవరప్రసాద్ గారు మీద ఆల్రెడీ ఉన్న బజ్ మరింత పెరిగే దిశగా…
పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…
తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…
ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…