Movie News

పుష్ప-2.. సంచలనం సిద్ధం

‘బాహుబలి-2’, ‘కేజీఎఫ్-2’ చిత్రాల తర్వాత దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న సీక్వెల్ అంటే ‘పుష్ప-2’నే. గత ఏడాది డివైడ్ టాక్‌తో మొదలైన ఈ సినిమా అంచనాలను మించి ఆడేసింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల అవతల.. అందులోనూ ఉత్తరాదిన ఈ సినిమాకు వచ్చిన స్పందన అనూహ్యం. అక్కడ చాలా పెద్ద బ్లాక్‌బస్టర్ అయిపోయి.. ఒక యుఫోరియా సృష్టించింది ‘పుష్ప’. ఈ సినిమాలో బన్నీ తగ్గేదేలే మేనరిజం అంతర్జాతీయ స్థాయిలో పాపులర్ అయింది. దీని వల్ల కూడా సీక్వెల్‌కు ఇంకా క్రేజ్ పెరిగింది.

ఐతే ఈ అంచనాలు పెరగడం వల్ల సుకుమార్ మరింత జాగ్రత్త పడుతున్నాడు. ముందు అనుకున్న స్క్రిప్టును మార్చి ఇంకా పకడ్బందీగా తయారు చేసే క్రమంలో బాగా టైం తీసుకుంటున్నాడు. ఫస్ట్ పార్ట్ వచ్చి పది నెలలు దాటినా ఈ చిత్రం ఇంకా సెట్స్ మీదికి వెళ్లని సంగతి తెలిసిందే. ఈ నెల చివరి వారంలో షూటింగ్ ప్రారంభం కావచ్చని అంటున్నారు.

ఐతే షూటింగ్ మొదలవడానికి ముందే బన్నీ లుక్ టెస్ట్ జరిగింది. అన్నపూర్ణ స్టూడియలో రెండు దశలుగా కొన్ని రోజుల పాటు ఈ షూట్ నడిచింది. ఈ సందర్భంగా లుక్ ఒకటి సెట్ చేసి రకరకాల గెటప్పుల్లో టెస్ట షూట్ చేశారు. అందులో ఒక స్టన్నింగ్ గెటప్ ఉందని, అది సినిమాలో కీలక ఎపిసోడ్‌కు సంబంధించినదని సమాచారం. ముందు ఆ గెటప్‌ను సర్ప్రైజ్ లాగా దాచి పెట్టాలని అనుకున్నప్పటికీ.. దాన్నే ఫస్ట్ లుక్‌గా రిలీజ్ చేయాలని సుకుమార్ ఫిక్సయ్యాడట.

దీపావళికి ‘పుష్ప-2’ ఫస్ట్ లుక్ లాంచ్ చేసే అవకాశాలున్నట్లు సమాచారం. ‘పుష్ప’ సినిమాకు కూడా ఇలాగే టెస్ట్ షూట్ చేసి, షూటింగ్ మొదలవడానికి ముందే ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ లుక్‌తోటే సినిమా మీద అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఇప్పుడు ఆల్రెడీ అంచనాలు ఎక్కువే ఉండగా.. వాటిని ఇంకా పీక్స్‌కు తీసుకెళ్లేలా సంచలన లుక్‌ను సుకుమార్ రెడీ చేసినట్లు చెబుతున్నారు.

This post was last modified on October 17, 2022 2:54 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నిన్న బాబు – నేడు పవన్!!

పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…

8 minutes ago

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

2 hours ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

3 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

4 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

4 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

5 hours ago