మంచు మోహన్ బాబు ఏదైనా స్టేజ్ మీదికి ఎక్కారంటే మాటల తూటాలు పేలాల్సిందే. అవి కొన్నిసార్లు ఎవరికి తగులుతాయో కూడా అర్థం కాదు. తాజాగా తన పెద్ద కొడుకు మంచు విష్ణు మీదికే ఆయన బాణాలు విసిరారు. ఎన్టీ రామారావు, ఏఎన్నార్ లాంటి దిగ్గజ నటులే తనకు చెప్పని విషయాన్ని విష్ణు చెప్పాడంటూ కొంచెం సరదాగానే అతడి మీద వాగ్బాణాలు విసిరారు మోహన్ బాబు. ఇందుకు ‘జిన్నా’ ప్రి రిలీజ్ ఈవెంట్ వేదికగా మారింది.
“నేను 500కు పైగా సినిమాల్లో నటించాను. 75 సినిమాలకు పైగా నిర్మించాను. ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబు.. ఇలా ఎంతోమందితో కలిసి పని చేశాను. సినిమా వేడుకల్లో పాల్గొన్నాను. కానీ వాళ్లెవ్వరూ కూడా నువ్వు ఇన్ని నిమిషాలే మాట్లాడు అని నాకు చెప్పలేదు. కానీ మా విష్ణు బాబు మాత్రం ఈ రోజు ఉదయం నాతో ఒక మాట అన్నాడు. తక్కువ సమయం మాట్లాడండి. ఎక్కువ టైం తీసుకోవద్దు అని చెప్పాడు. ఆ మాటతో నేను షాకైపోయాను. అంతంత పెద్దవాళ్లే నాతో ఈ మాట చెప్పలేదు. ఈ మాట విష్ణు అనగానే మనమేమైనా ఎక్కువ టైం మాట్లాడేస్తున్నామా అనిపించింది. కానీ ఆ రోజులు వేరు. ఈ రోజులు వేరు” అని మోహన్ బాబు అన్నారు.
ఐతే ఆ తర్వాత తన కొడుకును మోహన్ బాబు ప్రశంసల్లో ముంచెత్తారు. “మన బిడ్డల్ని మనం పొగుడుకోకూడదన్నది శాస్త్రం. కానీ ‘జిన్నా’ సినిమాలో విష్ణు అద్భుతంగా నటించాడని ఇందులో పని చేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులు చెప్పారు. విష్ణు ఈ సినిమాకు పడ్డ కష్టం మరే సినిమాకూ పడలేదు. చాలా రిస్కీ షాట్లు చేశాడు. అద్భుతంగా డ్యాన్సులు చేశాడు. సినిమా కోసం మరీ అంత కష్టపడాల్సిన పని లేదని, జాగ్రత్తగా ఉండాలని విష్ణుకు చెప్పాను. విష్ణు ఉత్తమ నటుడే కాదు.. ఉత్తమ వ్యక్తి కూడా. ‘జిన్నా’ సినిమా ‘ఢీ’ని మించి పది రెట్లు బాగా ఆడాలని కోరుకుంటున్నా” అని మోహన్ బాబు అన్నారు.
అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రాకా సినిమా మేజర్ షెడ్యూల్ ఈ జూన్ మధ్యలో ప్రారంభం కాబోతున్నట్లు…
ఒకప్పుడు ఎంత పెద్ద సినిమా వచ్చినా.. దానికి ఎంత క్రేజున్నా, దాని బడ్జెట్ ఎంత అయినా సరే.. ప్రభుత్వం నిర్ణయించిన…
కరుప్పు / వీరభద్రుడు ఇచ్చిన సక్సెస్ కిక్కుతో సూర్య మాములు ఆనందంలో లేడు. పదమూడేళ్ళగా తన హయ్యెస్ట్ కలెక్షన్ దాటలేని…
తెలంగాణ ఎవరి అయ్య జాగీరు కాదు అంటూ జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లు…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు తెలంగాణ వ్యతిరేకిగా…
వైసీపీ అదినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు వింటేనే… ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం…