అదేంటి ఎప్పుడో వచ్చిన రంగస్థలంతో లేటెస్ట్ కన్నడ హిట్ మూవీకి లింక్ ఏమిటనుకుంటున్నారా. తాజాగా కాంతారా సృష్టిస్తున్న సంచలనం చూసి మెగా ఫ్యాన్స్ ఇదే ఫీలవుతున్నారు. ఎందుకంటే ఇందులో మెయిన్ స్టోరీ లైన్ చరణ్ సినిమాకు దగ్గరగా ఉండటం వల్లే. అన్న కుమార్ బాబుని ప్రెసిడెంట్ చంపేస్తే మొదట్లో గుర్తించని చిట్టిబాటు తర్వాత నిజం తెలుసుకుని అతన్ని మట్టుబెట్టడం సుకుమార్ అద్భుతంగా చూపించారు. కట్ చేస్తే ఇప్పుడీ కాంతారాలో రివర్స్ లో ఉంటుంది. తమ్ముడిని దొర హత్య చేస్తే ముందు పసిగట్టని హీరో చివర్లో దేవుడి వేషంలో ఉగ్రరూపం ధరించి మట్టికరిపిస్తాడు.
బ్యాక్ డ్రాప్, క్యారెక్టరైజేషన్ల పరంగా ఎలాంటి పోలిక లేకపోయినా ఎమోషన్ కు సంబంధించిన కీలక పాయింట్ మాత్రం దగ్గరగా ఉన్న మాట వాస్తవం. నిజానికి రంగస్థలం కూడా రా విలేజ్ డ్రామా. కమర్షియల్ అంశాలు ఉన్నప్పటికీ 1985 నాటి పరిస్థితులను చాలా సహజంగా చిత్రీకరించిన తీరు దాన్ని ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ చేసింది. రామ్ చరణ్ ఇమేజ్ ని దృష్టిలో ఉంచుకుని మాస్ కోసం ఐటెం సాంగ్ లాంటివి పెట్టారు కానీ ఓవరాల్ గా చూస్తే నిజాయితీతో కూడిన ప్రయత్నం అందులో కనిపిస్తుంది. అందుకే క్లాసు మాసు తేడా లేకుండా అందరూ ఆ చిత్రాన్ని ఆదరించారు.
కాకపోతే రంగస్థలం అప్పట్లో తెలుగుకే పరిమితం అయ్యింది. ప్యాన్ ఇండియా ట్రెండ్ ఆ టైంలో లేకపోవడంతో నిర్మాతలు ఇతర భాషల్లో డబ్బింగ్ గురించి ఆలోచించలేదు. కన్నడలో సైతం చాలా ఆలస్యంగా అనువదించారు. ఒకవేళ ఇదే సినిమా హిందీలోనూ వచ్చి ఉంటే ఆర్ఆర్ఆర్ కన్నా ముందే ఎక్కువ గుర్తింపు చరణ్ కు వచ్చేదని అభిమానుల అభిప్రాయం. ఇందులో కొంత వాస్తవం ఉన్నప్పటికీ మారిన పరిస్థితులను కాంతారాలాంటివి క్యాష్ చేసుకుంటున్నాయి. మనదగ్గరా అంతకు మించిన కల్ట్స్ తీసే సత్తా ఉన్న దర్శకులు కాబట్టి ఇకనైనా ముందు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం.
This post was last modified on October 17, 2022 12:23 am
తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…
నిన్నటివరకు టీవీకే అధ్యక్షుడు, దళపతి విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారని కేవలం తమిళనాట ప్రజలు మాత్రమే కాదు, దక్షిణ భారత…
మెగాస్టార్ చిరంజీవి అభినందన అంటే యువ నటీనటులకు ఒక సర్టిఫికెట్ లాంటిదే. ఐతే ఏదైనా ఈవెంట్లకు వచ్చినపుడు అక్కడున్న వారిని…
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…