Movie News

కాంతారాలో రంగస్థలం లింకు

అదేంటి ఎప్పుడో వచ్చిన రంగస్థలంతో లేటెస్ట్ కన్నడ హిట్ మూవీకి లింక్ ఏమిటనుకుంటున్నారా. తాజాగా కాంతారా సృష్టిస్తున్న సంచలనం చూసి మెగా ఫ్యాన్స్ ఇదే ఫీలవుతున్నారు. ఎందుకంటే ఇందులో మెయిన్ స్టోరీ లైన్ చరణ్ సినిమాకు దగ్గరగా ఉండటం వల్లే. అన్న కుమార్ బాబుని ప్రెసిడెంట్ చంపేస్తే మొదట్లో గుర్తించని చిట్టిబాటు తర్వాత నిజం తెలుసుకుని అతన్ని మట్టుబెట్టడం సుకుమార్ అద్భుతంగా చూపించారు. కట్ చేస్తే ఇప్పుడీ కాంతారాలో రివర్స్ లో ఉంటుంది. తమ్ముడిని దొర హత్య చేస్తే ముందు పసిగట్టని హీరో చివర్లో దేవుడి వేషంలో ఉగ్రరూపం ధరించి మట్టికరిపిస్తాడు.

బ్యాక్ డ్రాప్, క్యారెక్టరైజేషన్ల పరంగా ఎలాంటి పోలిక లేకపోయినా ఎమోషన్ కు సంబంధించిన కీలక పాయింట్ మాత్రం దగ్గరగా ఉన్న మాట వాస్తవం. నిజానికి రంగస్థలం కూడా రా విలేజ్ డ్రామా. కమర్షియల్ అంశాలు ఉన్నప్పటికీ 1985 నాటి పరిస్థితులను చాలా సహజంగా చిత్రీకరించిన తీరు దాన్ని ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ చేసింది. రామ్ చరణ్ ఇమేజ్ ని దృష్టిలో ఉంచుకుని మాస్ కోసం ఐటెం సాంగ్ లాంటివి పెట్టారు కానీ ఓవరాల్ గా చూస్తే నిజాయితీతో కూడిన ప్రయత్నం అందులో కనిపిస్తుంది. అందుకే క్లాసు మాసు తేడా లేకుండా అందరూ ఆ చిత్రాన్ని ఆదరించారు.

కాకపోతే రంగస్థలం అప్పట్లో తెలుగుకే పరిమితం అయ్యింది. ప్యాన్ ఇండియా ట్రెండ్ ఆ టైంలో లేకపోవడంతో నిర్మాతలు ఇతర భాషల్లో డబ్బింగ్ గురించి ఆలోచించలేదు. కన్నడలో సైతం చాలా ఆలస్యంగా అనువదించారు. ఒకవేళ ఇదే సినిమా హిందీలోనూ వచ్చి ఉంటే ఆర్ఆర్ఆర్ కన్నా ముందే ఎక్కువ గుర్తింపు చరణ్ కు వచ్చేదని అభిమానుల అభిప్రాయం. ఇందులో కొంత వాస్తవం ఉన్నప్పటికీ మారిన పరిస్థితులను కాంతారాలాంటివి క్యాష్ చేసుకుంటున్నాయి. మనదగ్గరా అంతకు మించిన కల్ట్స్ తీసే సత్తా ఉన్న దర్శకులు కాబట్టి ఇకనైనా ముందు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం.

This post was last modified on October 17, 2022 12:23 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

బైకర్ సౌండ్ లేదు… మురారి ఆగడం లేదు

శర్వానంద్ సినిమాలు విచిత్రమైన పరిస్థితిని ఎదురుకుంటున్నాయి. కారణం ఒకేసారి రెండు రిలీజులు రెడీ కావడం. అంతా సవ్యంగా జరిగి ఉంటే…

23 minutes ago

హీరోయిన్ సీన్లు క‌ట్ చేయించిన హీరో

హ‌నుమాన్, మిరాయ్ చిత్రాలు పాన్ ఇండియా స్థాయిలో ఘ‌న‌విజ‌యం సాధించ‌డంతో పెద్ద రేంజికి వెళ్లిపోయాడు తేజ స‌జ్జా. ఐతే ఈ…

32 minutes ago

శ్రీవారి వైకుంఠ ద‌ర్శ‌నం… సెక‌నుకు 8 మంది!

ఔను! నిజం. మీరు చ‌దివింది అక్ష‌రాలా క‌రెక్టే!. సెక‌ను అంటే రెప్ప‌పాటు కాలం. ఈ రెప్ప‌పాటు కాలంలోనే అఖిలాండ కోటి…

59 minutes ago

సచివాలయంలో బ్యారికెట్లపై సీఎం బాబు ఫైర్

ఏపీ సీఎం చంద్రబాబు తాను వెళ్లిన ప్రతి చోట ప్రజలతో మమేకం అవుతుంటారు. గత ప్రభుత్వంలో అప్పటి సీఎం పరదాలు…

1 hour ago

ఆ ముగ్గురు అనుకుంటే ప్రభుత్వంలో జరగనిది ఏది లేదు

భద్రాద్రి కొత్తగూడెంలో డా.మన్మోహన్‌ సింగ్‌ ఎర్త్‌ సైన్స్‌ యూనివర్సిటీని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన…

2 hours ago

ఏపీలో ఏంటీ ‘చిన్న పురుగు’ టెన్షన్

ఏపీలో ఒక చిన్న పురుగు ప్రజల్లో టెన్షన్ రేకెత్తిస్తోంది. దాని కారణంగా స్క్రబ్ టైఫస్ అనే వ్యాధి వస్తుంది. అసలు…

2 hours ago