కాంతార.. కాంతార.. కాంతార.. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ కన్నడ చిత్రం గురించే చర్చ. కేజీఎఫ్ నిర్మాణ సంస్థ హోంబళె ఫిలిమ్స్.. రూ.18 కోట్ల పరిమిత బడ్జెట్లో తీసిన మిడ్ రేంజ్ మూవీ ఇది. కిరిక్ పార్టీ సహా కొన్ని హిట్ సినిమాలు తీసిన నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి తనే లీడ్ రోల్ చేస్తూ ఈ సినిమాను రూపొందించాడు.
సెప్టెంబరు 30న కన్నడ నాట ఓ మోస్తరు అంచనాలతో విడుదలైన ఈ చిత్రం ఆ రాష్ట్రంలోనే కాక దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ముందు కర్ణాటకలో ఈ చిత్రానికి భారీ వసూళ్లు వచ్చాయి. ఆ తర్వాత హైదరాబాద్, ముంబయి, చెన్నై లాంటి ఇతర రాష్ట్రాల్లోని మేజర్ సిటీల్లో జనం ఈ సినిమా కోసం ఎగబడ్డారు. ఒక రోజు ముందు బుక్ చేసుకుంటే తప్ప టికెట్లు దొరకనంత డిమాండ్ కనిపించింది సినిమాకు. కన్నడ వెర్షన్ చూడడానికి ఇతర భాషల వాళ్లు అలా ఎగబడ్డం చూసి ఆయా భాషల్లో సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు మొదలుపెట్టేశారు నిర్మాతలు.
తెలుగులో శనివారమే ఈ చిత్రం గీతా ఆర్ట్స్ ద్వారా విడుదలైంది. తమిళంలో కూడా ఇదే రోజు సినిమాను రిలీజ్ చేశారు. మలయాళంలో వచ్చే వారం ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు ప్రేక్షకులు ఇలాంటి ఈవెంట్ ఫిలిమ్స్, అందునా అదిరిపోయే టాక్ తెచ్చుకున్న సినిమాలు వస్తే వదిలిపెడతారా? ఈ వారం రిలీజైన తెలుగు సినిమాలను అస్సలు పట్టించుకోకుండా, గత వారం నుంచి నడుస్తున్న గాడ్ ఫాదర్ మూవీని కూడా పక్కన పెట్టేసి ‘కాంతార’ మీద పడిపోయారు.
అడ్వాన్స్ బుకింగ్స్ జోరు చూసే అందరూ ఆశ్చర్యపోగా.. శనివారం అన్ని చోట్లా మార్నింగ్ షోలకు మంచి ఆక్యుపెన్సీ కనిపిస్తోంది. సినిమాకు టాక్ కూడా చాలా బాగుండడం.. హైదరాబాద్ ప్రసాద్ మల్టీప్లెక్సులో 8.45 షో పూర్తయ్యాక ప్రెస్ వాళ్లతో పాటు మామూలు జనాలు కూడా స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారన్న సమాచారం రావడంతో జనాలకు సినిమా మీద ఇంకా ఆసక్తి పెరిగిపోతోంది. ఈ టాక్, హైప్ చూస్తుంటే తెలుగులో కాంతార వసూళ్లు కుమ్మేయబోతోందన్నది స్పష్టం.
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…