తెలుగులో ఓటిటి కంటెంట్ అంటూ రీజనల్ ఫీలింగుతో పుట్టుకొచ్చిన డిజిటల్ స్ట్రీమింగ్ యాప్ ‘ఆహా’. వచ్చిన కొత్తలో అందరూ ఈ యాప్ పెనుసంచలనం అవుతుందని అనుకున్నారు కాని, రాను రాను యాప్ మీద మక్కువపోతోంది. కారణం ఏంటంటే.. ఎక్కువగా తెలుగు డబ్బింగ్ సినిమాలు పెట్టడం, లేదంటే తెలుగు యుట్యూబ్ ఛానల్స్ లో వచ్చే కంటెంట్ నే మంచి కెమెరాలతో తీయించి వెబ్ సిరీస్ లుగా రిలీజ్ చేయడం వలన.. ఆహా మీద ఇంట్రెస్ట్ రావట్లేదు. కాకపోతే మధ్యమధ్యలో డ్యాన్స్ షోలు, ఇంటర్యూలు అంటూ సగటు తెలుగు ఎంటర్టయిన్మెంట్ ఛానల్ తరహాలో కొన్ని విన్యాశాలు చేస్తున్నారు కాని, అవి కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయ్. ఈ టైములో ఆహాకు బీభత్సమైన బ్రాండ్ ఇమేజ్ తీసుకొస్తున్న ఏకైక ప్రోగ్రామ్.. అన్ స్టాపబుల్.
నందమూరి బాలకృష్ణను హోస్టుగా తీసుకోవాలనే ఐడియా అసలు అల్లు అరవింద్ కు ఎందుకొచ్చిందో తెలియదు కాని, ఆ షో ప్రారంభించాక ఆహా ఇమేజ్ మాత్రం అమాంతం పెరిగిపోయింది. అసలు బాలయ్య అంత ఫన్ గా మాట్లాడతారని కాని, ఆయనలో ఇలాంటి ఒక ఎమోషనల్ కోణం ఉందనికాని, బయట ప్రపంచానికి పెద్దగా తెలియదు. అందుకేనేమో ఆహాలో అన్ స్టాపబుల్ చూసేసరికి ఆయనకు చాలామంది ఫిదా అయిపోయారు. ఫ్యాన్స్ గా మారిపోయారు. ఆయన ఇమేజ్ ఒక్క దెబ్బతో మారిపోయింది. నిజానికి అఖండ సినిమాకు ఆ రేంజులో క్రేజ్ రావడానికి ఈ టాక్ షో ద్వారా ఆయనకు దగ్గరైనా ఫ్యామిలీ ఆడియన్స్ కూడా కారణమే అని చెప్పొచ్చు. అయితే ‘ఆహా’కి మాత్రం బాలయ్య అప్పణంగా దొరికేశారంటూ ఇప్పుడు టాక్ వినిపిస్తోంది. ఎందుకో తెలుసా?
నిజానికి మొదటి సీజన్ హిట్టవ్వగానే రెండో సీజన్ కు ఏ హోస్ట్ అయినా కూడా భారీగా కోట్ చేస్తారు. అత్యంత ప్రజాదారణ పొందిన షో కాబట్టి.. ప్రొడ్యూసర్లకు కూడా భారీ పేమెంట్ ఇవ్వడం తప్పిస్తే వేరే దారుండదు. కాని బాలకృష్ణ మాత్రం మొదటి సీజన్ హోస్ట్ చేయడానికి ఎంత తీసుకున్నారో అంతకే ఇప్పుడు అన్ స్టాపబుల్ రెండో సీజన్ కూడా హోస్ట్ చేస్తున్నారట. ఒక ప్రక్కన ఆహా వాళ్లు ఈ ప్రోగ్రామ్ కోసం రకరకాల స్పాన్సర్ల దగ్గర భారీగానే ఛార్జ్ చేస్తున్నారు. ఏకంగా బాలయ్య కోసం మ్యాన్షన్ హౌస్ వంటి బ్రాండ్ వచ్చేసిందంటే చూడండి. కాని బాలయ్య మాత్రం ఒక్క రూపాయి కూడా ఎక్కువ తీసుకోకపోవడం ఆయన ఎథిక్స్ కు నిదర్శనం.
This post was last modified on October 13, 2022 11:28 am
ఇండస్ట్రీ పెద్ద ఎవరు..? ఈ ప్రశ్న టాలీవుడ్లో తరచుగా వినిపిస్తుంటుంది. ఒకప్పుడు దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ పాత్రను…
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…