కరోనా విజృంభిస్తున్న సమయంలో షూటింగ్ చేయడం ఎంత ప్రమాదకరమో సీరియల్ షూటింగ్స్ లోనే తెలిసిపోయింది. ముఖ్యంగా మాస్క్ లేకుండా నటించాల్సిన నటీనటులకు ఇది అత్యంత ప్రమాదకరంగా మారింది. అయితే ఇంకా చాలా భాగం షూటింగ్ చేయాల్సిన సినిమాలను ఇప్పుడే మొదలు పెట్టడం లేదు కానీ… కొన్ని రోజుల పాటు షూటింగ్ చేస్తే పూర్తవుతుంది అనే సినిమాలకు నిర్మాతలు వివిధ ఐడియాలతో వస్తున్నారు.
సల్మాన్ ఖాన్ సినిమా రాధే షూటింగ్ కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ షూటింగ్ పూర్తి చేయాలంటే వీలయినంత పెద్ద స్థలం కావాలని భావించి సల్మాన్ ఖాన్ ఒక స్టూడియో మొత్తం బ్లాక్ చేసాడట. దీనివల్ల మనుషుల మధ్య వీలయినంత దూరం ఉంటుందని, రిహార్సల్స్ కి కూడా స్క్రీన్స్ వేసి మేనేజ్ చేయవచ్చునని, మెయిన్ షాట్ మినహా మరేదీ దగ్గరగా ఉంది చేయాల్సిన పని లేదని, స్టూడియో అంతా తమ అధీనంలో ఉంటుంది కనుక బయట నుంచి రాకపోకలు పూర్తిగా నియంత్రించవచ్చునని భావిస్తున్నారు.
ఇందుకోసం ఖర్చు పెరిగినా కానీ, షూటింగ్ పూర్తయి, సినిమా ఎప్పుడంటే అప్పుడు రిలీజ్ చేసుకోవడానికి వీలుంటుందని భాయ్ ఆలోచన. రాధే షూటింగ్ ఇలా సజావుగా సాగినట్లయితే మిగిలిన భారీ చిత్రాలు కూడా ఈ రూట్లో వెళ్లే అవకాశం ఉంది.
This post was last modified on July 9, 2020 7:07 pm
తమిళగ వెట్రి కళగం అధినేత జోసెఫ్ విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం ఖరారైంది. ఆరు రోజులుగా ట్విస్టులతో సాగిన రాజకీయ…
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…