కరోనా విజృంభిస్తున్న సమయంలో షూటింగ్ చేయడం ఎంత ప్రమాదకరమో సీరియల్ షూటింగ్స్ లోనే తెలిసిపోయింది. ముఖ్యంగా మాస్క్ లేకుండా నటించాల్సిన నటీనటులకు ఇది అత్యంత ప్రమాదకరంగా మారింది. అయితే ఇంకా చాలా భాగం షూటింగ్ చేయాల్సిన సినిమాలను ఇప్పుడే మొదలు పెట్టడం లేదు కానీ… కొన్ని రోజుల పాటు షూటింగ్ చేస్తే పూర్తవుతుంది అనే సినిమాలకు నిర్మాతలు వివిధ ఐడియాలతో వస్తున్నారు.
సల్మాన్ ఖాన్ సినిమా రాధే షూటింగ్ కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ షూటింగ్ పూర్తి చేయాలంటే వీలయినంత పెద్ద స్థలం కావాలని భావించి సల్మాన్ ఖాన్ ఒక స్టూడియో మొత్తం బ్లాక్ చేసాడట. దీనివల్ల మనుషుల మధ్య వీలయినంత దూరం ఉంటుందని, రిహార్సల్స్ కి కూడా స్క్రీన్స్ వేసి మేనేజ్ చేయవచ్చునని, మెయిన్ షాట్ మినహా మరేదీ దగ్గరగా ఉంది చేయాల్సిన పని లేదని, స్టూడియో అంతా తమ అధీనంలో ఉంటుంది కనుక బయట నుంచి రాకపోకలు పూర్తిగా నియంత్రించవచ్చునని భావిస్తున్నారు.
ఇందుకోసం ఖర్చు పెరిగినా కానీ, షూటింగ్ పూర్తయి, సినిమా ఎప్పుడంటే అప్పుడు రిలీజ్ చేసుకోవడానికి వీలుంటుందని భాయ్ ఆలోచన. రాధే షూటింగ్ ఇలా సజావుగా సాగినట్లయితే మిగిలిన భారీ చిత్రాలు కూడా ఈ రూట్లో వెళ్లే అవకాశం ఉంది.
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు భారీ షాక్ తగిలింది. తెలంగాణలో జనసేన బలోపేతం దిశగా…
తెలుగు మూవీ లవర్స్ చిరకాల వాంఛ ఐమాక్స్ గురించి గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో ఎడతెగని చర్చ…
దక్షిణాదిన క్యారెక్టర్, విలన్ పాత్రలకు మాంచి డిమాండ్ ఉన్న నటుల్లో విజయ్ సేతుపతి ఒకడు. సుకుమార్ అంతటి పెద్ద దర్శకుడు…
అదేంటి పెద్ది వస్తుంటే ఇంకెవరు పోటీకి దిగుతారనే డౌట్ వస్తోందా. టాలీవుడ్ ప్రొడ్యూసర్లు అంత సాహసం చేయరు కానీ ఇతర…
తెలుగులో రిలీజయ్యే ఏ సినిమాకైనా అటు ఏపీలో, ఇటు తెలంగాణలో ఒకేసారి షోలు మొదలుపెట్టాల్సి ఉంటుంది. ఒకట్రెండు గంటల తేడా…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఢిల్లీ టూర్ పై ఓ రేంజి తరహా వ్యాఖ్యలు చేసిన…