కరోనా విజృంభిస్తున్న సమయంలో షూటింగ్ చేయడం ఎంత ప్రమాదకరమో సీరియల్ షూటింగ్స్ లోనే తెలిసిపోయింది. ముఖ్యంగా మాస్క్ లేకుండా నటించాల్సిన నటీనటులకు ఇది అత్యంత ప్రమాదకరంగా మారింది. అయితే ఇంకా చాలా భాగం షూటింగ్ చేయాల్సిన సినిమాలను ఇప్పుడే మొదలు పెట్టడం లేదు కానీ… కొన్ని రోజుల పాటు షూటింగ్ చేస్తే పూర్తవుతుంది అనే సినిమాలకు నిర్మాతలు వివిధ ఐడియాలతో వస్తున్నారు.
సల్మాన్ ఖాన్ సినిమా రాధే షూటింగ్ కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ షూటింగ్ పూర్తి చేయాలంటే వీలయినంత పెద్ద స్థలం కావాలని భావించి సల్మాన్ ఖాన్ ఒక స్టూడియో మొత్తం బ్లాక్ చేసాడట. దీనివల్ల మనుషుల మధ్య వీలయినంత దూరం ఉంటుందని, రిహార్సల్స్ కి కూడా స్క్రీన్స్ వేసి మేనేజ్ చేయవచ్చునని, మెయిన్ షాట్ మినహా మరేదీ దగ్గరగా ఉంది చేయాల్సిన పని లేదని, స్టూడియో అంతా తమ అధీనంలో ఉంటుంది కనుక బయట నుంచి రాకపోకలు పూర్తిగా నియంత్రించవచ్చునని భావిస్తున్నారు.
ఇందుకోసం ఖర్చు పెరిగినా కానీ, షూటింగ్ పూర్తయి, సినిమా ఎప్పుడంటే అప్పుడు రిలీజ్ చేసుకోవడానికి వీలుంటుందని భాయ్ ఆలోచన. రాధే షూటింగ్ ఇలా సజావుగా సాగినట్లయితే మిగిలిన భారీ చిత్రాలు కూడా ఈ రూట్లో వెళ్లే అవకాశం ఉంది.
This post was last modified on July 9, 2020 7:07 pm
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ మరో సంప్రదాయాన్ని బ్రేక్ చేశారు. ఎన్నికలకు ముందు అందరం ఒక్కటేనంటూ నీతులు వల్లించే నాయకులు…
సౌత్ ఇండియన్ ఫిలిం మేకింగ్ ని కొత్త పుంతలు తొక్కించిన దర్శకుల్లో శంకర్, మురుగదాస్ పేర్లు ప్రత్యేకంగా నిలుస్తాయి. ఎందుకంటే…
‘టాక్సిక్’ వచ్చిన తర్వాత ‘ఇరుముడి’ రన్ మీద ప్రభావం తప్పదేమో అని డౌట్ ఉండేది. పెద్ద పాన్ ఇండియా సినిమా…
సుప్రసిద్ధ గాయని ఏంఎస్ సుబ్బులక్ష్మి జీవిత కథ ఆధారంగా బయోపిక్ తీసేందుకు నిర్మాత బన్నీ వాస్, అల్లు అరవింద్, రాక్…
నవంబర్ లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద అంచనాలు ఎలా ఉన్నా బిజినెస్ వ్యవహారాలు మాత్రం జోరుగా…
సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ పుట్టినరోజు రానుంది. అభిమానులు పెద్ద ఎత్తున సెలెబ్రేట్ చేసుకునేందుకు రెడీ అవుతున్నారు. అసలు రిలీజ్…