లెజెండరీ దర్శకులు మణిరత్నం చివరి బ్లాక్ బస్టర్ ఎప్పుడంటే వెంటనే గుర్తు తెచ్చుకోవడం కష్టం. 2000 సంవత్సరంలో సఖి సూపర్ సక్సెస్ అయ్యాక మళ్ళీ ఆ స్థాయి విజయం దక్కలేదు. ఓకే బంగారం హిట్ అనిపించుకుంది అన్ని భాషల్లో ఆయన రేంజ్ లో ఆడలేదు. యువ, విలన్ కు టెక్నికల్ గా ప్రశంసలు దక్కాయి కానీ కమర్షియల్ గా భారీ డిజాస్టర్లవి. ఇక కడలి, చెలియా గురించి గుర్తుచేసుకోకపోవడం ఉత్తమం. కానీ ఇప్పుడు పొన్నియన్ సెల్వన్ 1 తర్వాత అంతా మారిపోయింది. ఒకటి రెండు కాదు ఏకంగా నాలుగు వందల కోట్ల గ్రాస్ అందుకున్న విజువల్ క్లాసిక్ గా దీన్ని తమిళ జనం మాములుగా ఆదరించలేదు.
తెలుగుతో సహా ఇతర వెర్షన్లు ఆశించిన స్థాయిలో పెర్ఫార్మ్ చేయకపోయినా మణిరత్నం టేకింగ్, విజువల్స్, కలర్ఫుల్ క్యాస్టింగ్ పుణ్యమాని మరీ దారుణంగా దెబ్బ తినకుండా గట్టెక్కింది. ఇప్పుడీ ఫలితం ఆయన్ని సూపర్ స్టార్ రజనీకాంత్ ని మరోసారి కలిసేలా చేస్తోందని చెన్నై టాక్. ఈ ఇద్దరి కలయికలో వచ్చిన ఒకే ఒక సినిమా దళపతి. 1991లో మహాభారతంలో కర్ణుడు దుర్యోధనుడు పాత్రలను తీసుకుని ఈ క్లాసిక్ ని తీర్చిదిద్దిన తీరు భారీ వసూళ్లనే కాదు దశాబ్దాలు గడిచే కొద్దీ దాని కల్ట్ స్టేటస్ ని పెంచుకుంటూ పోతూనే ఉంది. ఇప్పటికే ఇళయరాజా బెస్ట్ ఆల్బమ్స్ దళపతిని ఒకటిగా చెప్పాల్సిందే.
ఇదంతా జరిగి 30 ఏళ్ళు దాటేసింది. పొన్నియన్ సెల్వన్ 2 తాలూకు పనులు మొత్తం పూర్తయ్యి 2023 వేసవిలో రిలీజ్ చేశాక రజనితో తో మణిరత్నం సినిమా మొదలుపెట్టబోతున్నట్టు తెలిసింది. పిఎస్ 1 & 2 లాగా ఇదేమి రాజవైభవానికి సంబంధించిన కథ కాదుట. జీవితంలో ఉన్నతం పతనం అన్నీ చూసేసిన ఒక మనిషి ఎమోషనల్ జర్నీని తనదైన శైలిలో నాయకుడు ఫార్మట్ లో తీయబోతున్నట్టు వినికిడి. ఇప్పటికే ఈ కాంబో సాధ్యం కావడం గురించి విశ్వసనీయ తమిళ మీడియా వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ తో జైలర్ చేస్తున్న రజని అది పూర్తి చేశాక దీనికి సంబంధించిన క్లారిటీ ఇవ్వొచ్చు.
This post was last modified on October 13, 2022 8:52 am
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…
దేశంలో గత కొంతకాలం నుంచి బీజేపీ హవా నడుస్తోంది. అయితే కొన్ని రాష్ట్రాల్లో ఆ పార్టీకి ఆశించిన మేర విజయాలు…