లెజెండరీ దర్శకులు మణిరత్నం చివరి బ్లాక్ బస్టర్ ఎప్పుడంటే వెంటనే గుర్తు తెచ్చుకోవడం కష్టం. 2000 సంవత్సరంలో సఖి సూపర్ సక్సెస్ అయ్యాక మళ్ళీ ఆ స్థాయి విజయం దక్కలేదు. ఓకే బంగారం హిట్ అనిపించుకుంది అన్ని భాషల్లో ఆయన రేంజ్ లో ఆడలేదు. యువ, విలన్ కు టెక్నికల్ గా ప్రశంసలు దక్కాయి కానీ కమర్షియల్ గా భారీ డిజాస్టర్లవి. ఇక కడలి, చెలియా గురించి గుర్తుచేసుకోకపోవడం ఉత్తమం. కానీ ఇప్పుడు పొన్నియన్ సెల్వన్ 1 తర్వాత అంతా మారిపోయింది. ఒకటి రెండు కాదు ఏకంగా నాలుగు వందల కోట్ల గ్రాస్ అందుకున్న విజువల్ క్లాసిక్ గా దీన్ని తమిళ జనం మాములుగా ఆదరించలేదు.
తెలుగుతో సహా ఇతర వెర్షన్లు ఆశించిన స్థాయిలో పెర్ఫార్మ్ చేయకపోయినా మణిరత్నం టేకింగ్, విజువల్స్, కలర్ఫుల్ క్యాస్టింగ్ పుణ్యమాని మరీ దారుణంగా దెబ్బ తినకుండా గట్టెక్కింది. ఇప్పుడీ ఫలితం ఆయన్ని సూపర్ స్టార్ రజనీకాంత్ ని మరోసారి కలిసేలా చేస్తోందని చెన్నై టాక్. ఈ ఇద్దరి కలయికలో వచ్చిన ఒకే ఒక సినిమా దళపతి. 1991లో మహాభారతంలో కర్ణుడు దుర్యోధనుడు పాత్రలను తీసుకుని ఈ క్లాసిక్ ని తీర్చిదిద్దిన తీరు భారీ వసూళ్లనే కాదు దశాబ్దాలు గడిచే కొద్దీ దాని కల్ట్ స్టేటస్ ని పెంచుకుంటూ పోతూనే ఉంది. ఇప్పటికే ఇళయరాజా బెస్ట్ ఆల్బమ్స్ దళపతిని ఒకటిగా చెప్పాల్సిందే.
ఇదంతా జరిగి 30 ఏళ్ళు దాటేసింది. పొన్నియన్ సెల్వన్ 2 తాలూకు పనులు మొత్తం పూర్తయ్యి 2023 వేసవిలో రిలీజ్ చేశాక రజనితో తో మణిరత్నం సినిమా మొదలుపెట్టబోతున్నట్టు తెలిసింది. పిఎస్ 1 & 2 లాగా ఇదేమి రాజవైభవానికి సంబంధించిన కథ కాదుట. జీవితంలో ఉన్నతం పతనం అన్నీ చూసేసిన ఒక మనిషి ఎమోషనల్ జర్నీని తనదైన శైలిలో నాయకుడు ఫార్మట్ లో తీయబోతున్నట్టు వినికిడి. ఇప్పటికే ఈ కాంబో సాధ్యం కావడం గురించి విశ్వసనీయ తమిళ మీడియా వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ తో జైలర్ చేస్తున్న రజని అది పూర్తి చేశాక దీనికి సంబంధించిన క్లారిటీ ఇవ్వొచ్చు.
This post was last modified on October 13, 2022 8:52 am
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…