ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పూర్తయి ఏడాది దాటిపోయింది. ప్రమోషన్ల కోసం కొన్ని రోజులు కేటాయించడం తప్పితే హీరోలు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్లకు ఇంకే పని లేదు. చరణ్ ముందే శంకర్ సినిమాను ఓకే చేసి పెద్దగా ఆలస్యం చేయకుండా గత ఏడాది చివర్లోనే ఆ ప్రాజెక్టును పట్టాలెక్కించాడు. కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఇప్పటిదాకా తన కొత్త చిత్రాన్ని మొదలుపెట్టలేకపోయాడు.
త్రివిక్రమ్తో అంతకుముందు అనుకున్న సినిమా క్యాన్సిల్ అయిపోగా.. దాని స్థానంలోకి కొరటాల శివ చిత్రం వచ్చింది. కానీ ఈ సినిమా స్క్రిప్టు ఎంతకీ ఓకే కాకపోవడంతో ఇప్పటిదాకా సినిమా ప్రారంభం కాలేదు. ఇంకో రెండు మూడు నెలల తర్వాత అయినా ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్తుందా అన్నది సందేహంగానే ఉంది. ఇది తారక్ అభిమానులకు అస్సలు రుచించట్లేదు.
వ్యవహారం ఇలా ఉంటే.. ఇంకోవైపు యాంటీ ఫ్యాన్స్ ఈ సినిమా గురించి నెగెటివ్ వార్తలను అదే పనిగా స్ప్రెడ్ చేస్తున్నారు. అందులో ఈ సినిమా హీరోయిన్ టాపిక్ కూడా ఒకటి. ఈ చిత్రం కోసం కియారా అద్వానీ మొదలుకుని ఎంతోమంది హీరోయిన్లను ట్రై చేశారని.. కానీ ఏ ఒక్కరూ ఈ సినిమాను ఓకే చేయలేదని.. ఎవరికీ ఈ సినిమా పట్ల ఆసక్తి లేదని.. అందుకే రిజెక్ట్ చేస్తున్నారని వార్తలు వండి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. తాజాగా కీర్తి సురేష్ సైతం ఈ చిత్రాన్ని తిరస్కరించినట్లుగా ఓ వార్త హల్ చల్ చేస్తోంది.
కానీ అసలు విషయం ఏంటంటే.. ఇంకా స్క్రిప్టే ఓకే అవ్వలేదు. అలాంటపుడు నటీనటుల ఎంపిక వరకు ఎందుకు వెళ్తారు? హీరోయిన్లను సంప్రదించి ఎందుకు నో చెప్పించుకుంటారు? అయినా సినిమా ఎప్పుడు మొదలవుతుందో తెలియనపుడు ఏ హీరోయిన్ అయినా ఎందుకు డేట్లు ఇస్తుంది? ఇంత చిన్న లాజిక్ తెలియకుండా తారక్ హీరోయిన్ విషయంలో ఈ రచ్చ ఏంటన్నది అర్థం కాని విషయం. అయినా ఆర్ఆర్ఆర్ సినిమాతో అంత పేరు సంపాదించిన తారక్కు హీరోయిన్ దొరకని సమస్య ఎదురవుతుందా?
దర్శకుడు అనిల్ రావిపూడి చెప్పిన ప్రకారమే తన కొత్త సినిమా షూటింగ్ ఇవాళ మొదలుపెట్టేశారు. వెంకటేష్ కళ్యాణ్ రామ్ కలయికలో…
ఏపీలోని బీచ్ లలో విదేశాల్లో మాదిరి బార్లను ప్రవేశపెట్టాలన్న నిర్ణయంపై విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో పర్యాటక రంగానికి ఊతం ఇచ్చే…
మొబైల్ ఫోన్లు అందరి దగ్గరా ఉంటాయి. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ప్రతి 10 మందిలో ఏడుగురు ఏదో ఒక మొబైల్…
వెంకటేష్, కళ్యాణ్ రామ్ కాంబినేషన్ లో డైరెక్టర్ అనిల్ రావిపూడి అనుకున్నట్లే మల్టీస్టారర్ ను పట్టాలెక్కించారు. ఈ ప్రాజెక్ట్ ఉదయమే…
పెట్రోల్ ధరలపై కేంద్ర ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు చేసింది. పెట్రోలియం శాఖ కార్యదర్శి శుక్రవారం ఢిల్లీలో విడుదల చేసిన ప్రకటనలో…
వెంకటేష్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందుతున్న ఆదర్శ కుటుంబం మీద సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. మూడు…