ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పూర్తయి ఏడాది దాటిపోయింది. ప్రమోషన్ల కోసం కొన్ని రోజులు కేటాయించడం తప్పితే హీరోలు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్లకు ఇంకే పని లేదు. చరణ్ ముందే శంకర్ సినిమాను ఓకే చేసి పెద్దగా ఆలస్యం చేయకుండా గత ఏడాది చివర్లోనే ఆ ప్రాజెక్టును పట్టాలెక్కించాడు. కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఇప్పటిదాకా తన కొత్త చిత్రాన్ని మొదలుపెట్టలేకపోయాడు.
త్రివిక్రమ్తో అంతకుముందు అనుకున్న సినిమా క్యాన్సిల్ అయిపోగా.. దాని స్థానంలోకి కొరటాల శివ చిత్రం వచ్చింది. కానీ ఈ సినిమా స్క్రిప్టు ఎంతకీ ఓకే కాకపోవడంతో ఇప్పటిదాకా సినిమా ప్రారంభం కాలేదు. ఇంకో రెండు మూడు నెలల తర్వాత అయినా ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్తుందా అన్నది సందేహంగానే ఉంది. ఇది తారక్ అభిమానులకు అస్సలు రుచించట్లేదు.
వ్యవహారం ఇలా ఉంటే.. ఇంకోవైపు యాంటీ ఫ్యాన్స్ ఈ సినిమా గురించి నెగెటివ్ వార్తలను అదే పనిగా స్ప్రెడ్ చేస్తున్నారు. అందులో ఈ సినిమా హీరోయిన్ టాపిక్ కూడా ఒకటి. ఈ చిత్రం కోసం కియారా అద్వానీ మొదలుకుని ఎంతోమంది హీరోయిన్లను ట్రై చేశారని.. కానీ ఏ ఒక్కరూ ఈ సినిమాను ఓకే చేయలేదని.. ఎవరికీ ఈ సినిమా పట్ల ఆసక్తి లేదని.. అందుకే రిజెక్ట్ చేస్తున్నారని వార్తలు వండి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. తాజాగా కీర్తి సురేష్ సైతం ఈ చిత్రాన్ని తిరస్కరించినట్లుగా ఓ వార్త హల్ చల్ చేస్తోంది.
కానీ అసలు విషయం ఏంటంటే.. ఇంకా స్క్రిప్టే ఓకే అవ్వలేదు. అలాంటపుడు నటీనటుల ఎంపిక వరకు ఎందుకు వెళ్తారు? హీరోయిన్లను సంప్రదించి ఎందుకు నో చెప్పించుకుంటారు? అయినా సినిమా ఎప్పుడు మొదలవుతుందో తెలియనపుడు ఏ హీరోయిన్ అయినా ఎందుకు డేట్లు ఇస్తుంది? ఇంత చిన్న లాజిక్ తెలియకుండా తారక్ హీరోయిన్ విషయంలో ఈ రచ్చ ఏంటన్నది అర్థం కాని విషయం. అయినా ఆర్ఆర్ఆర్ సినిమాతో అంత పేరు సంపాదించిన తారక్కు హీరోయిన్ దొరకని సమస్య ఎదురవుతుందా?
This post was last modified on October 13, 2022 8:48 am
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…
దేశంలో గత కొంతకాలం నుంచి బీజేపీ హవా నడుస్తోంది. అయితే కొన్ని రాష్ట్రాల్లో ఆ పార్టీకి ఆశించిన మేర విజయాలు…