దర్శకుడు అనిల్ రావిపూడి ఎఫ్3 సినిమా అనుకున్నంత ఆడలేదు కాని, తదుపరి నందమూరి బాలకృష్ణతో తీయబోయే సినిమాపై మాత్రం చాలా కాన్ఫిడెంటుగా ఉన్నాడు. కాకపోతే ఎఫ్ 3 ప్రమోషన్స్ లో మాత్రం.. ఒక ప్రక్కన వెంకీ, వరుణ్ తేజ్, మెహ్రీన్, సోనాల్ ఉన్నా కూడా.. మనోడే ఫుల్లుగా హైలైట్ అయ్యాడు. దానికి కారణం చిన్నప్పటినుండి స్టేజీ మీద డ్యాన్సులు వేయడం, డ్రామాలు వేయడం వంటి పిచ్చి ఉండటమే. అయితే ఇప్పుడు ఆ పిచ్చిని మరో లెవెల్ కు తీసుకెళ్ళాడు ఈ టాలెంటెడ్ డైరక్టర్.
లైఫ్ అంటే ఇట్టా ఉండాలా అంటూ అనిల్ రావిపూడి రకరకాల ప్రమోషన్ స్టేజీల మీద వేసిన డ్యాన్స్ స్టెప్ వేసిన సంగతి తెలిసిందే. పైగా అప్పటికే ఈయన హ్యూమరస్ మాటలకు కూడా చాలా పాపులార్టీ వచ్చేసింది. దానితో ఇప్పుడు ఈటివిలో కొత్తగా ప్రారంభం అవుతున్న ఒక రియాల్టీ షో కోసం ఏకంగా అనిల్ ను జడ్జ్ గా దించేశారు. మిష్టర్ అండ్ మిస్సెస్ అంటూ ఈటివిలో వస్తున్న ఒక రియాల్టీ గేమ్ షో కు ఇప్పుడు మాజీ హీరోయిన్ స్నేహ, బిగ్బాస్ విన్నర్ కమ్ కనుమరుగైన హీరో శివబాలాజీతో కలసి ఒక జడ్జ్ గా రంగంలోకి దిగిపోయాడు. ప్రోమోలో అయితే మనోడి టైమింగ్ అదిరిపోయిందనే చెప్పాలి. యాంకర్ శ్రీముఖితో కలసి పంచులూ.. అలాగే ఇతర కంటెస్ట్ంట్లతో మనోడి టైమింగ్ డైలాగులూ అదిరిపోయాయ్.
నిజానికి తమిళంలో చాలామంది దర్శకులు ఇలా ఒకసారి మేకప్ వేసుకోగానే హీరోలుగా మారిపోయారు కూడా. కొంతమంది క్యారక్టర్ ఆర్టిస్టులుగా నిలదొక్కుకున్నారు. చూస్తుంటే అనిల్ కూడా నిధానంగా దర్శకత్వం కంటే యాక్టింగ్ మీద ఎక్కుగా ఫోకస్ పెట్టేస్తూ.. స్లిప్పయిపోతున్నాడా అంటూ సందేహాం వచ్చేస్తోంది. కాకపోతే మన తెలుగులో మాత్రం చాలామంది పూర్తిగా డైరక్షన్ మానేశాక మాంచి యాక్టర్లుగా స్థిరపడ్డారు. మరి అనిల్ డైరక్షన్ చేసుకుంటూ మరో ప్రక్కన రియాల్టీ షోలు అండ్ యాక్టింగ్ అంటూ తన హవా కొనసాగిస్తాడేమో చూడాలి.
This post was last modified on October 12, 2022 6:44 pm
హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…
నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…
ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…
నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…
ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…