హీరో డామినేటెడ్ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లకు సోలోగా నటించేంత క్రేజ్, గుర్తింపు రావడం చాలా కష్టం. అనుష్క, నయనతార, సమంత తర్వాత కీర్తి సురేష్ కి మాత్రమే అలాంటి పేరొచ్చింది. అనుష్క, సమంత అయినా చాలా కాలం హీరోల వెనక గ్లామర్ రోల్స్ చేస్తే కానీ ఆ ఇమేజ్ రాలేదు. కీర్తి సురేష్ కి మాత్రం మహానటితో చాలా త్వరగా అంతటి గుర్తింపు వచ్చేసింది.
కాకపోతే ఆ క్రేజ్ నిలబెట్టుకోవడంలో కీర్తి రైట్ డైరెక్షన్లో వెళ్తున్నట్టు కనిపించడం లేదు. పెంగ్విన్ సినిమాలో ఎనిమిదేళ్ల పిల్లాడికి తల్లిగా నటించే రిస్క్ తీసుకుంది కానీ… అటు తనకు నటిగా కానీ, ఇటు సక్సెస్ పరంగా కానీ కలిసి వచ్చే సినిమా చేయలేకపోయింది. ఆమె నటించిన మరో రెండు హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు కూడా ఓటిటిలో రిలీజ్ కాబోతున్నాయి.
మిస్ ఇండియా, గుడ్ లక్ సఖి నిర్మాతలు ప్రస్తుతం ఓటిటి కంపెనీలతో మంచి డీల్ కోసం మాట్లాడుతున్నారని సమాచారం. హీరోయిన్ ప్రధాన సినిమాలు థియేటర్లో విడుదలయితే సదరు హీరోయిన్ కి ఉన్న క్రౌడ్ పుల్లింగ్ పవర్ తెలుస్తుంది. ఇలా ఓటిటిలో వచ్చేస్తే ఆమె ఇమేజ్ కి ఇవి పెద్దగా యాడ్ అవ్వవు. అయితే కీర్తికి ఈ సినిమాలతో లాభం జరిగినా లేకున్నా… సర్కారు వారి పాట, రంగ్ దే లాంటి కమర్షియల్ చిత్రాలు లైనప్ లో ఉండడం మాత్రం పెద్ద అడ్వాంటేజ్.
This post was last modified on July 9, 2020 7:08 pm
అసలు ఓజి ఎప్పుడు విడుదలవుతుందో తెలియదు కానీ అప్పుడే ఓజి 2 గురించి ప్రచారాలు ఊపందుకున్నాయి. ఎన్నికల ముందు వరకు…
ఏపీలో విపక్షం వైసీపీలో ఫైర్ బ్రాండ్ నేతలుగా మాజీ మంత్రి, నగరి మాజీ ఎమ్మెల్యే ఆర్కే రోజా, నంద్యాల జిల్లాకు…
నిర్మాతగా నాని విపరీతమైన నమ్మకం పెట్టుకున్న కోర్ట్ ఇంకో మూడు రోజుల్లో విడుదల కానుంది. ఇంతకు ముందు ప్రొడ్యూసర్ గా…
వైసీపీ హయాంలో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరుగానే బుక్ అయిపోతున్నారు. వైసీపీ జమానాలో ఆయా నేతలు సాగించిన…
ఏపీ రాజధాని అమరావతి విషయంలో ప్రతిపక్షం వైసీపీ నాయకులు సృష్టిస్తున్న విషప్రచారాన్ని ప్రజలు నమ్మరాదని ఏపీ మంత్రులు కోరారు. రాజధాని…
సాధారణంగా ఒక రాజకీయ పార్టీ విఫలమైతే.. ఆ పార్టీ నష్టపోవడమే కాదు.. ప్రత్యర్థి పార్టీలు కూడా బలోపేతం అవుతాయి. ఇప్పుడు…