హీరో డామినేటెడ్ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లకు సోలోగా నటించేంత క్రేజ్, గుర్తింపు రావడం చాలా కష్టం. అనుష్క, నయనతార, సమంత తర్వాత కీర్తి సురేష్ కి మాత్రమే అలాంటి పేరొచ్చింది. అనుష్క, సమంత అయినా చాలా కాలం హీరోల వెనక గ్లామర్ రోల్స్ చేస్తే కానీ ఆ ఇమేజ్ రాలేదు. కీర్తి సురేష్ కి మాత్రం మహానటితో చాలా త్వరగా అంతటి గుర్తింపు వచ్చేసింది.
కాకపోతే ఆ క్రేజ్ నిలబెట్టుకోవడంలో కీర్తి రైట్ డైరెక్షన్లో వెళ్తున్నట్టు కనిపించడం లేదు. పెంగ్విన్ సినిమాలో ఎనిమిదేళ్ల పిల్లాడికి తల్లిగా నటించే రిస్క్ తీసుకుంది కానీ… అటు తనకు నటిగా కానీ, ఇటు సక్సెస్ పరంగా కానీ కలిసి వచ్చే సినిమా చేయలేకపోయింది. ఆమె నటించిన మరో రెండు హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు కూడా ఓటిటిలో రిలీజ్ కాబోతున్నాయి.
మిస్ ఇండియా, గుడ్ లక్ సఖి నిర్మాతలు ప్రస్తుతం ఓటిటి కంపెనీలతో మంచి డీల్ కోసం మాట్లాడుతున్నారని సమాచారం. హీరోయిన్ ప్రధాన సినిమాలు థియేటర్లో విడుదలయితే సదరు హీరోయిన్ కి ఉన్న క్రౌడ్ పుల్లింగ్ పవర్ తెలుస్తుంది. ఇలా ఓటిటిలో వచ్చేస్తే ఆమె ఇమేజ్ కి ఇవి పెద్దగా యాడ్ అవ్వవు. అయితే కీర్తికి ఈ సినిమాలతో లాభం జరిగినా లేకున్నా… సర్కారు వారి పాట, రంగ్ దే లాంటి కమర్షియల్ చిత్రాలు లైనప్ లో ఉండడం మాత్రం పెద్ద అడ్వాంటేజ్.
This post was last modified on July 9, 2020 7:08 pm
2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్ సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కూటమిగా…
ఒక్కొక్కసారి కొన్నికొన్ని విషయాలను పట్టించుకోకపోవడమే మంచిది. అలా పట్టించుకుంటే.. మనకేదో మేలు జరుగుతుందని అనుకుంటే.. అదే పెద్ద తప్పిదం అయి…
మార్చిలో పెద్దగా అంచనాలు లేకుండా సైలెంట్ గా విడుదలై మంచి విజయం నమోదు చేసుకున్న బాలీవుడ్ మూవీ 'లాపతా లేడీస్'…
ఏదైనా మాట్లాడితే.. లాజిక్ ఉండాలి. ముఖ్యంగా పాతతరానికి చెందిన నాయకులు.. ఒక కులాన్ని ప్రభావితం చేస్తారని భావించే నాయకులు ముఖ్యంగా…
మే 4 దాసరి నారాయణరావు జయంతిని పురస్కరించుకుని డైరెక్టర్స్ డేని చాలా ఘనంగా నిర్వహించబోతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ దిగ్గజాలందరూ…
ఏపీలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల సమరంలో చిత్రమైన ఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రదాన పార్టీ జనసేనకు కేటాయించిన గాజు గ్లాసు…