హీరో డామినేటెడ్ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లకు సోలోగా నటించేంత క్రేజ్, గుర్తింపు రావడం చాలా కష్టం. అనుష్క, నయనతార, సమంత తర్వాత కీర్తి సురేష్ కి మాత్రమే అలాంటి పేరొచ్చింది. అనుష్క, సమంత అయినా చాలా కాలం హీరోల వెనక గ్లామర్ రోల్స్ చేస్తే కానీ ఆ ఇమేజ్ రాలేదు. కీర్తి సురేష్ కి మాత్రం మహానటితో చాలా త్వరగా అంతటి గుర్తింపు వచ్చేసింది.
కాకపోతే ఆ క్రేజ్ నిలబెట్టుకోవడంలో కీర్తి రైట్ డైరెక్షన్లో వెళ్తున్నట్టు కనిపించడం లేదు. పెంగ్విన్ సినిమాలో ఎనిమిదేళ్ల పిల్లాడికి తల్లిగా నటించే రిస్క్ తీసుకుంది కానీ… అటు తనకు నటిగా కానీ, ఇటు సక్సెస్ పరంగా కానీ కలిసి వచ్చే సినిమా చేయలేకపోయింది. ఆమె నటించిన మరో రెండు హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు కూడా ఓటిటిలో రిలీజ్ కాబోతున్నాయి.
మిస్ ఇండియా, గుడ్ లక్ సఖి నిర్మాతలు ప్రస్తుతం ఓటిటి కంపెనీలతో మంచి డీల్ కోసం మాట్లాడుతున్నారని సమాచారం. హీరోయిన్ ప్రధాన సినిమాలు థియేటర్లో విడుదలయితే సదరు హీరోయిన్ కి ఉన్న క్రౌడ్ పుల్లింగ్ పవర్ తెలుస్తుంది. ఇలా ఓటిటిలో వచ్చేస్తే ఆమె ఇమేజ్ కి ఇవి పెద్దగా యాడ్ అవ్వవు. అయితే కీర్తికి ఈ సినిమాలతో లాభం జరిగినా లేకున్నా… సర్కారు వారి పాట, రంగ్ దే లాంటి కమర్షియల్ చిత్రాలు లైనప్ లో ఉండడం మాత్రం పెద్ద అడ్వాంటేజ్.
This post was last modified on July 9, 2020 7:08 pm
ఫంకీ ఫలితం త్వరగా తేలిపోవడంతో హీరో విశ్వక్ సేన్, నిర్మాణ సంస్థ సితార హఠాత్తుగా సైలెంటైపోయాయి. ఊరికే లేనిపోని హడావిడి…
వైసీపీ మాజీ ఎంపీ, ఆ పార్టీ మాజీ నేత రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారం జగన్ హయాంలో దేశవ్యాప్తంగా సంచలనం…
రాజమౌళి సినిమాలంటే చెప్పిన డేటుకి రావు అని ప్రేక్షకులు ముందే బలంగా ఫిక్సయిపోయి ఉంటారు. ఆయన చివరి చిత్రం ‘ఆర్ఆర్ఆర్’…
ఏపీలో ఉపాధ్యాయ ఉద్యోగార్ధులకు మంత్రి నారా లోకేష్ గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే మరో డీఎస్సీ వేస్తామని ప్రకటించారు. దీంతో…
ఓజి లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న సినిమాగా ఉస్తాద్ భగత్ సింగ్ మీద క్రమంగా హైప్ పెంచే ప్రయత్నాలు…
మొన్న మదనపల్లి, నేడు విశాఖ.. మృగాళ్ల అకృత్యాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. విశాఖపట్నం నగరంలోని పెదగంట్యాడ మండలంలో గురువారం…