ఈ మధ్యన చాలామంది యంగ్ హీరోయిన్లు ఒక్క హిట్టు కొడితే చాలా ఎగిరెగిరి పడుతున్నారు. సినిమాను సరిగ్గా ప్రమోట్ చేయడానికి రాకపోవడమే కాకుండా, ఏకంగా యారోగెన్స్ తో చంపేస్తున్నారు. కాని కొంతమంది హీరోయిన్లు మాత్రం.. స్టార్డమ్ అంతా చూసేశాక, వయసైపోయాక కూడా తమ ప్రవర్తనతో చూపరులను కట్టిపాడేస్తుంటారు. ఈ మధ్యనే సెక్సీ ఫోటోషూట్లతో చెలరేగిపోతున్న శ్రీయ ఇప్పుడు అదే పని చేసింది.
మొన్న ఆదివారం మధ్యహ్నం హైదారబాద్ లో ఒక మల్టీప్లెక్స్ లో త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన నువ్వే నువ్వే సినిమా రిలీజై 20 సంవత్సరాలు కావొస్తున్న సందర్భంగా ఒక స్పెషల్ స్క్రీనింగ్ వేశారు. ఆ తరువాత సోమవారం ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టేశారు. ఈ కార్యక్రమానికి స్రవంతి రవికిషోర్, త్రివిక్రమ్, ప్రకాష్ రాజ్, తరుణ్ లతో పాటు శ్రీయ సరన్ కూడా విచ్చేసింది. ఈ సందర్భంగా మాట్లాడిన శ్రీయ.. తన యునిట్ అందరినీ తెగ పొగిడేసింది. రవికిషోర్ స్వీట్ అంటూ.. త్రివిక్రమ్ సార్ చాలా సపోర్ట్ చేశారంటూ.. అలాగే తరుణ్ అయితే చాలా మంచోడంటూ.. ప్రకాష్ రాజ్ చూడ్డానికి చిన్నోడిలా ఉంటాడు కాని, తనకు ఫాదర్ తరహా మనిషంటూ ఆకాశానికి ఎత్తేసింది. తరుణ్ కు ఏకంగా స్టేజీ మీద ఒక కిస్ కూడా పెట్టిందిలే.
అక్కుడన్నవారిలో తరుణ్ తో సహా అందరూ ఏజ్ పెరిగినోళ్లలా కనిపిస్తుంటే.. శ్రీయ మాత్రం 40 ఏళ్ళొచ్చినా కూడా ఇంకా చాలా హాటుగా, క్రేజీ కుర్రదానిలే ఉండటమే కాకుండా.. ఇలా తన మాటలతో కూడా ఆకట్టుకుంది. ఈ సీన్ చూసినోళ్ళు ఎవ్వరైనా సరే, అక్కడున్న త్రివిక్రమ్ కాని లేదంటే ప్రొడ్యూసర్ రవికిషోర్ కాని ఆమెకు మరిన్ని ఛాన్సులు ఇవ్వొచ్చుకదా అనకుండా ఉండలేరు మరి. నిజానికి శ్రీయకు ఇప్పటివరకు చాలా అవకాశాలు వస్తూనే ఉన్నాయ్ కాని, ఎందుకో సడన్ గా ఆమె గ్లామరస్ రోల్స్ కూడా చేయాలని కోరుకుంటోంది. చూద్దాం ఏమవుతుందో మరి!
This post was last modified on October 11, 2022 2:16 pm
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…
దేశంలో గత కొంతకాలం నుంచి బీజేపీ హవా నడుస్తోంది. అయితే కొన్ని రాష్ట్రాల్లో ఆ పార్టీకి ఆశించిన మేర విజయాలు…