ఇటీవలే బెంగళూరులో జరిగిన ఫిలింఫేర్ సౌత్ అవార్డుల్లో అఖండకు చోటు దక్కకపోవడం పట్ల నందమూరి అభిమానుల నుంచే కాదు సగటు మూవీ లవర్స్ నుంచి సైతం ఆశ్చర్యం వ్యక్తమయ్యింది. మొత్తం పుష్ప హవా నడవటం మీద ఇప్పటికే సోషల్ మీడియాలో పలు కామెంట్లు వచ్చి పడుతున్నాయి. ఈ రెండు గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదలైనవే. వరల్డ్ వైడ్ లెక్కల్లో రెవిన్యూ పరంగా వ్యత్యాసం ఉండొచ్చు కానీ తెలుగు రాష్ట్రాల వరకు చూసుకుంటే పుష్ప కంటే అఖండనే బయ్యర్లకు ఎక్కువ లాభాలు ఇచ్చిన మాట వాస్తవం. బన్నీ మూవీ కొన్ని నష్టాలు తెచ్చిందని దర్శకుడు తేజ ఇటీవలే చెప్పడం ఇంకా హాట్ టాపిక్ గానే ఉంది.
ఫిలింఫేర్ అనేది ఏదో ప్రమాణాలు పెట్టుకుని నేషనల్ అవార్డులా ఇచ్చేది కాదు. అన్ని కమర్షియల్ సినిమాలనూ ఇందులో పరిగణనలోకి తీసుకుంటారు. ఆ మాటొస్తే పుష్ప ఒక అడవి సంపదను దోచుకుని డాన్ గా ఎదిగే స్మగ్లర్ కథ. కానీ అఖండ అలా కాదు. బాలయ్య పోషించిన అఘోరా పాత్ర ద్వారా హిందూ మత తత్వాన్ని గొప్పదనాన్ని చెబుతూనే కమర్షియల్ ఎలిమెంట్స్ ని జొప్పించిన ఎంటర్ టైనర్. పోలిక పరంగా చూసుకున్నా బెటర్ కంటెంట్ అఖండలోనే ఉందనేది బాలయ్య ఫ్యాన్స్ వాదన. పెర్ఫార్మన్స్ కోణంలో చూస్తే అల్లు అర్జున్ బాలకృష్ణ ఎవరినీ తక్కువ చేయలేం కానీ ఇంకా ఇతర విభాగాలు ఉన్నాయిగా.
ఈ ఫిలిం ఫేర్ నిర్వహించేది బాలీవుడ్ సంస్థలు కాబట్టి వాళ్లకు పుష్ప నార్త్ లో సాధించిన ఘనవిజయం కొలమానంగా కనిపించి ఉండొచ్చు. అఖండను ఆ టైంలో హిందీ డబ్బింగ్ చేసి థియేటర్లలో వదల్లేదు. దానివల్లే అది అక్కడి ఆడియన్స్ కి రీచ్ కాలేకపోయింది. తర్వాత హాట్ స్టార్ లో చూసిన వాళ్ళు ఇది బిగ్ స్క్రీన్ ఎక్స్ పీరియన్స్ కదా అనుకున్నారు. ఇదంతా అఖండని మెచ్చుకోవడమో పొగడటమో కాదు. కమర్షియల్ సినిమాలకు పురస్కారాలు ఇచ్చేటప్పుడు ఒకదాని మీదే ఫోకస్ ఎక్కువ కావడం వల్ల వచ్చే చిక్కే ఇదంతా. రాష్ట్రప్రభుత్వాలు ఇవ్వాల్సిన నంది అవార్డులు కనుమరుగయ్యాక వీటి ప్రాధాన్యం పెరిగిపోయింది.
This post was last modified on October 11, 2022 11:33 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…