Movie News

టీవీ ప్రీమియర్లకు కాలం చెల్లిందా

ఎప్పుడో ఓ పాతిక ముప్పై సంవత్సరాల క్రితం కేవలం దూరదర్శన్ ఛానల్ మాత్రమే అందుబాటులో ఉండేది. ప్రతి ఆదివారం ఓ తెలుగు సినిమా వచ్చేది. అది మురళీమోహన్ దైనా ఎన్టీఆర్ దైనా జనం పనులన్నీ మానుకుని గుడ్లప్పగించి చూసేవాళ్ళు. 1995 తర్వాత కేబుల్ విప్లవం ఊపందుకున్నాక ఈటీవీ, జెమినిల ప్రవేశంతో రోజుకో మూవీ కాన్సెప్ట్ తో ప్రేక్షకులకు ఎంటర్ టైన్మెంట్ ఆప్షన్లు పెరగడం ప్రారంభమయ్యింది. పెద్ద హీరోల చిత్రాలు బుల్లితెరపై చూడటం గొప్ప విషయంగా భావించే రోజుల్లో వీటి ఎంట్రీతో అది కాస్తా సులభమైన వ్యవహారంగా మారిపోయింది. దాంతో మొదలు శాటిలైట్ హక్కులు నిర్మాతలకు అదనపు డబ్బు తెచ్చే బంగారు బాతులా మారాయి.

మెల్లగా కాలం మారింది. పుట్టగొడుగుల్లా ఛానల్స్ పుట్టుకొచ్చాయి. ప్రతి భాషలో రోజుకో వంద సినిమాలు వస్తున్నాయి. మరోవైపు యుట్యూబ్ లో ఏది కావాలంటే అది క్షణాల్లో చూసుకునే వెసులుబాటు. ఓటిటిల మధ్య విపరీతమైన పోటీ. ఓ మూడు వారాల క్రితం ఊళ్ళో గోడల మీద చూసిన కొత్త పోస్టర్ లో ఉన్న బొమ్మ నేరుగా ఇంట్లోనే చూసుకోమంటూ స్ట్రీమింగ్ అలర్ట్ వస్తోంది. అది కూడా ఎలాంటి యాడ్స్ గొడవ లేకుండా ప్రశాంతంగా రివైండ్ ఫార్వార్డ్ చేసుకునే ఆప్షన్లతో. సహజంగానే టీవీలు చూసే ఆడియన్స్ శాతం క్రమంగా తగ్గుతూ వస్తోంది. సగటు మధ్యతరగతి జీవులకు ఇప్పటికీ ఇదే మెయిన్ ఆప్షన్ కానీ వాళ్ళూ మారే రోజు దగ్గరలో ఉంది.

గత రెండుమూడేళ్లుగా టీవీలో వచ్చే వరల్డ్ ప్రీమియర్ల టిఆర్పి రేటింగ్స్ బాగా పడిపోతున్నాయి. ఓటిటిలో ముప్పై నుంచి యాభై రోజుల్లోనే కొత్త సినిమాలు వస్తుంటే ఛానల్స్ లో మాత్రం మూడు నెలల గ్యాప్ తీసుకుంటున్నారు. దీనివల్ల అంత ఓపిగ్గా ఎదురు చూడలేని పబ్లిక్ హ్యాపీగా డిజిటల్ వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో కనీసం పదిహేనుకు పైగా రేటింగ్ రావాల్సిన సర్కారు వారి పాట, కెజిఎఫ్ లాంటి క్రేజీ మూవీస్ సైతం దాన్ని అందుకోలేకపోతున్నాయి. అంతగొప్ప ఆర్ఆర్ఆరే ఇరవైని త్రుటిలో మిస్ అయ్యింది. అల వైకుంఠపురములో తర్వాత మళ్ళీ అంత పెద్ద నెంబర్ అందుకున్న సినిమా ఏదీ లేదు. చూస్తుంటే వీటి శకానికి ముగింపు వచ్చినట్టే ఉంది.

This post was last modified on October 9, 2022 1:29 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

55 minutes ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

2 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

3 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

3 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

4 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

4 hours ago