టాలీవుడ్లో మిగతా సీనియర్ హీరోల పరిస్థితి మెరుగ్గానే ఉంది కానీ.. అక్కినేని నాగార్జున మాత్రం రోజు రోజుకూ కిందికి పడిపోతున్నారు. చెత్త సినిమాలకు కేరాఫ్ అడ్రస్గా మారిపోయిన రామ్ గోపాల్ వర్మను నమ్మి ‘ఆఫీసర్’ మూవీ చేయడం ఆయన కెరీర్లో అతి పెద్ద మిస్టేక్. ఆ సినిమాతో ఆయన ఒకేసారి పాతాళానికి పడిపోయారు.
అక్కడి నుంచి పైకి లేవడానికి ఎంతగా ప్రయత్నిస్తున్నా ఫలితం దక్కట్లేదు. ‘వైల్డ్ డాగ్’ సినిమా మంచి టాక్ తెచ్చుకుని కూడా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ‘బంగార్రాజు’ సినిమా బ్లాక్బస్టర్ మూవీ ‘సోగ్గాడే చిన్నినాయనా’కు సీక్వెల్ కావడం, సంక్రాంతికి రిలీజ్ కావడం వల్ల ఎలాగోలా బయటపడిపోయింది కానీ.. ‘ది ఘోస్ట్’ సినిమాకు వచ్చేసరికి నాగ్ యథాప్రకారం పతనం చవిచూస్తున్నారు. అసలే ఈ సినిమాకు ప్రి రిలీజ్ బజ్ లేదు. దీనికి తోడు బ్యాడ్ టాక్ రావడంతో వసూళ్లు దారుణంగా ఉన్నాయి.
విడుదలకు ముందు ఆశించిన స్థాయిలో బిజినెస్ ఆఫర్లు రాలేదో.. లేక సినిమా మీద ఉన్న నమ్మకంతో నిర్ణయం తీసుకున్నారో తెలియదు కానీ.. ఈ చిత్రాన్ని మెజారిటీ ఏరియాల్లో నిర్మాతలతో కలిసి నాగార్జునే సొంతంగా రిలీజ్ చేశాడు. ఎందుకీ రిస్క్ చేస్తున్నారని విడుదలకు ముందు అడిగితే సినిమా మీద తమకున్న నమ్మకమే కారణమని చెప్పాడు. సునీల్ నారంగ్ లాంటి బలమైన ఎగ్జిబిటర్ ఈ సినిమాకు నిర్మాత కావడంతో నైజాం ఏరియాలో మంచి మంచి థియేటర్లు లభించాయి. థియేటర్ల సంఖ్య పరిమితమే అయినా.. మంచి థియేటర్లను ‘ది ఘోస్ట్’ దక్కించుకుంది.
ఐతే ఇప్పుడా థియేటర్లన్నీ వెలవెలబోతున్నాయి. దసరా సీజన్ను ఉపయోగించుకోలేక నిరుపయోగం అవుతున్నాయి. ‘ది ఘోస్ట్’ సినిమాను సాధ్యమైనంత త్వరగా గాడ్ఫాదర్ లేదా స్వాతిముత్యం సినిమాలతో రీప్లేస్ చేయడం మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సినిమాను సొంతంగా రిలీజ్ చేయాలన్న నిర్ణయం బెడిసికొట్టి నిర్మాతలకు మరింత నష్టం తప్పేలా లేదు. డిస్ట్రిబ్యూటర్లకు అమ్మేసి ఉంటే ఓ మోస్తరుగా ఆదాయం వచ్చి నిర్మాతలు బయటపడేవారు. సినిమా మీద అతి నమ్మకంతో చేసిన ఈ ప్రయత్నం పెద్ద దెబ్బే కొట్టినట్లు కనిపిస్తోంది.
పోలీసు స్టేషన్లకు వెళ్లి ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేకుండా.. ఇక నుంచి వాయిస్ మెసేజ్ల ద్వారా కూడా ఫిర్యాదులు చేసే…
ఏపీలో వైసీపీ అదికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని పాత జిల్లాలతో పాటుగా వైసీపీ సర్కారే కొత్తగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల్లోనూ…
పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును వేధింపులకు గురిచేసి.. కస్టడీలో టార్చర్ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…
రాజకీయాలంటే చాలా మంది చెడిపోయాయని అనుకుంటారు. కానీ, రాజకీయాలు అంతగా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కారణంగానే ఈ పేరు…
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…