టాలీవుడ్లో దసరా సందడి మొదలైపోయింది. ఈ పండక్కి ఒకే రోజు మూడు సినిమాలు రిలీజవుతున్నాయి. తర్వాతి వారం కూడా ఈ సినిమాల సందడే కొనసాగేలా ఉంది. చెప్పుకోదగ్గ సినిమాలేమీ రిలీజ్ కావట్లేదు. మళ్లీ దీపావళి ముంగిట సందడి నెలకొనబోతోంది. అక్టోబరు 21కి వరుసగా ఒక్కో సినిమా బెర్తు బుక్ చేసుకుంటోంది.
ఇప్పటికే తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కుతున్న ‘ప్రిన్స్’ మూవీ దీపావళికి ఫిక్సయింది. ఈ మధ్యే విశ్వక్సేన్ సినిమా ‘ఓరి దేవుడా’ను కూడా దీపావళి రేసులో నిలబెట్టిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మంచు విష్ణు సినిమా జిన్నాను సైతం దీపావళి పోటీలోకి తీసుకొచ్చారు. మూడు పేరున్న సినిమాలు రిలీజవుతుండడంతో దీపావళికి బెర్తులు లాక్ అయిపోయినట్లే భావించారు. ఇంతకుమించి సినిమాలు వస్తే థియేటర్లు సర్దుబాటు చేయడం కష్టమే అవుతుందని భావించారు.
దీపావళి పోటీ అంతటితో ఆగడం లేదు. తాజాగా నందిని రెడ్డి దర్శకత్వంలో సంతోష్ శోభన్-మాళవిక నాయర్ జంటగా తెరకెక్కిన వైజయంతీ మూవీస్ వారి సినిమా అన్నీ మంచి శకునములే కూడా దీపావళికే విడుదల కాబోతోంది. ఈమేరకు అధికారిక ప్రకటన కూడా ఇచ్చేశారు. మరోవైపు దర్శకుడు తేజ ఏమో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దగ్గుబాటి అభిరామ్ హీరోగా తాను తెరకెక్కించిన అహింస సినిమాను సైతం దీపావళికి విడుదల చేయబోతున్నట్లు ప్రకటించాడు.
ఇవి చాలవన్నట్లు మరో తమిళ డబ్బింగ్ సినిమా కూడా దీపావళికే విడుదల కాబోతోంది. కార్తి కొత్త చిత్రం సర్దార్ను ఈ పండక్కే రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. అది తెలుగులో కూడా ఒకేసారి విడుదల కావాల్సి ఉంది. మరి మూడు సినిమాలకే థియేటర్ల సర్దుబాటు కష్టం అంటే.. ఏకంగా అరడజను సినిమాలు దీపావళి పోటీకి సై అంటుండడంతో స్క్రీన్లు, షోలు సర్దుబాటు ఎలా అన్నది అర్థం కావడం లేదు. ఇందులో కనీసం రెండయినా రేసు నుంచి తప్పుకోక తప్పదేమో.
This post was last modified on October 5, 2022 10:18 am
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…