టాలీవుడ్లో దసరా సందడి మొదలైపోయింది. ఈ పండక్కి ఒకే రోజు మూడు సినిమాలు రిలీజవుతున్నాయి. తర్వాతి వారం కూడా ఈ సినిమాల సందడే కొనసాగేలా ఉంది. చెప్పుకోదగ్గ సినిమాలేమీ రిలీజ్ కావట్లేదు. మళ్లీ దీపావళి ముంగిట సందడి నెలకొనబోతోంది. అక్టోబరు 21కి వరుసగా ఒక్కో సినిమా బెర్తు బుక్ చేసుకుంటోంది.
ఇప్పటికే తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కుతున్న ‘ప్రిన్స్’ మూవీ దీపావళికి ఫిక్సయింది. ఈ మధ్యే విశ్వక్సేన్ సినిమా ‘ఓరి దేవుడా’ను కూడా దీపావళి రేసులో నిలబెట్టిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మంచు విష్ణు సినిమా జిన్నాను సైతం దీపావళి పోటీలోకి తీసుకొచ్చారు. మూడు పేరున్న సినిమాలు రిలీజవుతుండడంతో దీపావళికి బెర్తులు లాక్ అయిపోయినట్లే భావించారు. ఇంతకుమించి సినిమాలు వస్తే థియేటర్లు సర్దుబాటు చేయడం కష్టమే అవుతుందని భావించారు.
దీపావళి పోటీ అంతటితో ఆగడం లేదు. తాజాగా నందిని రెడ్డి దర్శకత్వంలో సంతోష్ శోభన్-మాళవిక నాయర్ జంటగా తెరకెక్కిన వైజయంతీ మూవీస్ వారి సినిమా అన్నీ మంచి శకునములే కూడా దీపావళికే విడుదల కాబోతోంది. ఈమేరకు అధికారిక ప్రకటన కూడా ఇచ్చేశారు. మరోవైపు దర్శకుడు తేజ ఏమో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దగ్గుబాటి అభిరామ్ హీరోగా తాను తెరకెక్కించిన అహింస సినిమాను సైతం దీపావళికి విడుదల చేయబోతున్నట్లు ప్రకటించాడు.
ఇవి చాలవన్నట్లు మరో తమిళ డబ్బింగ్ సినిమా కూడా దీపావళికే విడుదల కాబోతోంది. కార్తి కొత్త చిత్రం సర్దార్ను ఈ పండక్కే రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. అది తెలుగులో కూడా ఒకేసారి విడుదల కావాల్సి ఉంది. మరి మూడు సినిమాలకే థియేటర్ల సర్దుబాటు కష్టం అంటే.. ఏకంగా అరడజను సినిమాలు దీపావళి పోటీకి సై అంటుండడంతో స్క్రీన్లు, షోలు సర్దుబాటు ఎలా అన్నది అర్థం కావడం లేదు. ఇందులో కనీసం రెండయినా రేసు నుంచి తప్పుకోక తప్పదేమో.
This post was last modified on October 5, 2022 10:18 am
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…
బీఆర్ ఎస్ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్రావు.. తన ఇంటిని తాకట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వద్దుకు…
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…