టాలీవుడ్లో దసరా సందడి మొదలైపోయింది. ఈ పండక్కి ఒకే రోజు మూడు సినిమాలు రిలీజవుతున్నాయి. తర్వాతి వారం కూడా ఈ సినిమాల సందడే కొనసాగేలా ఉంది. చెప్పుకోదగ్గ సినిమాలేమీ రిలీజ్ కావట్లేదు. మళ్లీ దీపావళి ముంగిట సందడి నెలకొనబోతోంది. అక్టోబరు 21కి వరుసగా ఒక్కో సినిమా బెర్తు బుక్ చేసుకుంటోంది.
ఇప్పటికే తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కుతున్న ‘ప్రిన్స్’ మూవీ దీపావళికి ఫిక్సయింది. ఈ మధ్యే విశ్వక్సేన్ సినిమా ‘ఓరి దేవుడా’ను కూడా దీపావళి రేసులో నిలబెట్టిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మంచు విష్ణు సినిమా జిన్నాను సైతం దీపావళి పోటీలోకి తీసుకొచ్చారు. మూడు పేరున్న సినిమాలు రిలీజవుతుండడంతో దీపావళికి బెర్తులు లాక్ అయిపోయినట్లే భావించారు. ఇంతకుమించి సినిమాలు వస్తే థియేటర్లు సర్దుబాటు చేయడం కష్టమే అవుతుందని భావించారు.
దీపావళి పోటీ అంతటితో ఆగడం లేదు. తాజాగా నందిని రెడ్డి దర్శకత్వంలో సంతోష్ శోభన్-మాళవిక నాయర్ జంటగా తెరకెక్కిన వైజయంతీ మూవీస్ వారి సినిమా అన్నీ మంచి శకునములే కూడా దీపావళికే విడుదల కాబోతోంది. ఈమేరకు అధికారిక ప్రకటన కూడా ఇచ్చేశారు. మరోవైపు దర్శకుడు తేజ ఏమో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దగ్గుబాటి అభిరామ్ హీరోగా తాను తెరకెక్కించిన అహింస సినిమాను సైతం దీపావళికి విడుదల చేయబోతున్నట్లు ప్రకటించాడు.
ఇవి చాలవన్నట్లు మరో తమిళ డబ్బింగ్ సినిమా కూడా దీపావళికే విడుదల కాబోతోంది. కార్తి కొత్త చిత్రం సర్దార్ను ఈ పండక్కే రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. అది తెలుగులో కూడా ఒకేసారి విడుదల కావాల్సి ఉంది. మరి మూడు సినిమాలకే థియేటర్ల సర్దుబాటు కష్టం అంటే.. ఏకంగా అరడజను సినిమాలు దీపావళి పోటీకి సై అంటుండడంతో స్క్రీన్లు, షోలు సర్దుబాటు ఎలా అన్నది అర్థం కావడం లేదు. ఇందులో కనీసం రెండయినా రేసు నుంచి తప్పుకోక తప్పదేమో.
This post was last modified on October 5, 2022 10:18 am
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…