టాలీవుడ్లో దసరా సందడి మొదలైపోయింది. ఈ పండక్కి ఒకే రోజు మూడు సినిమాలు రిలీజవుతున్నాయి. తర్వాతి వారం కూడా ఈ సినిమాల సందడే కొనసాగేలా ఉంది. చెప్పుకోదగ్గ సినిమాలేమీ రిలీజ్ కావట్లేదు. మళ్లీ దీపావళి ముంగిట సందడి నెలకొనబోతోంది. అక్టోబరు 21కి వరుసగా ఒక్కో సినిమా బెర్తు బుక్ చేసుకుంటోంది.
ఇప్పటికే తమిళ, తెలుగు భాషల్లో తెరకెక్కుతున్న ‘ప్రిన్స్’ మూవీ దీపావళికి ఫిక్సయింది. ఈ మధ్యే విశ్వక్సేన్ సినిమా ‘ఓరి దేవుడా’ను కూడా దీపావళి రేసులో నిలబెట్టిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మంచు విష్ణు సినిమా జిన్నాను సైతం దీపావళి పోటీలోకి తీసుకొచ్చారు. మూడు పేరున్న సినిమాలు రిలీజవుతుండడంతో దీపావళికి బెర్తులు లాక్ అయిపోయినట్లే భావించారు. ఇంతకుమించి సినిమాలు వస్తే థియేటర్లు సర్దుబాటు చేయడం కష్టమే అవుతుందని భావించారు.
దీపావళి పోటీ అంతటితో ఆగడం లేదు. తాజాగా నందిని రెడ్డి దర్శకత్వంలో సంతోష్ శోభన్-మాళవిక నాయర్ జంటగా తెరకెక్కిన వైజయంతీ మూవీస్ వారి సినిమా అన్నీ మంచి శకునములే కూడా దీపావళికే విడుదల కాబోతోంది. ఈమేరకు అధికారిక ప్రకటన కూడా ఇచ్చేశారు. మరోవైపు దర్శకుడు తేజ ఏమో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దగ్గుబాటి అభిరామ్ హీరోగా తాను తెరకెక్కించిన అహింస సినిమాను సైతం దీపావళికి విడుదల చేయబోతున్నట్లు ప్రకటించాడు.
ఇవి చాలవన్నట్లు మరో తమిళ డబ్బింగ్ సినిమా కూడా దీపావళికే విడుదల కాబోతోంది. కార్తి కొత్త చిత్రం సర్దార్ను ఈ పండక్కే రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. అది తెలుగులో కూడా ఒకేసారి విడుదల కావాల్సి ఉంది. మరి మూడు సినిమాలకే థియేటర్ల సర్దుబాటు కష్టం అంటే.. ఏకంగా అరడజను సినిమాలు దీపావళి పోటీకి సై అంటుండడంతో స్క్రీన్లు, షోలు సర్దుబాటు ఎలా అన్నది అర్థం కావడం లేదు. ఇందులో కనీసం రెండయినా రేసు నుంచి తప్పుకోక తప్పదేమో.
This post was last modified on October 5, 2022 10:18 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…