మెగాస్టార్ చిరంజీవి యథాలాపంగా చేసిన ఒక కామెంట్ మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ అభిమానులను హర్ట్ చేసింది. మోహన్ లాల్ ప్రధాన పాత్ర పోషించిన మలయాళ బ్లాక్బస్టర్ లూసిఫర్ను చిరు హీరోగా గాడ్ఫాదర్ పేరుతో తెలుగులో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బుధవారం దసరా కానుకగా విడుదలవుతున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రెస్ మీట్లో పాల్గొంది.
ఈ సందర్భంగా చిరు మాట్లాడుతూ.. లూసిఫర్ సినిమాను రీమేక్ చేస్తే బాగుంటుందని చరణ్ తనకు చెప్పాక రెండోసారి ఆ సినిమా చూశానని.. అప్పుడు ఆ సినిమా తనకు అంత బాగా అనిపించలేదని.. ఏదో అసంతృప్తిగా అనిపించిందని.. అప్పుడు సీనియర్ రైటర్ సత్యానంద్తో వర్క్ చేయించామని, ఆ తర్వాత దర్శకుడు మోమన్ రాజా కూడా ఈ ప్రాజెక్టులోకి వచ్చాడని, అతను చేసిన మార్పులు చేర్పులతో సినిమా సంతృప్తికరంగా మారిందని చిరు వ్యాఖ్యానించాడు.
లూసిఫర్ సినిమా అంత బాగా లేదని, తెలుగులో దాన్ని మరింత మెరుగ్గా తీర్చిదిద్దామని చిరు చేసిన వ్యాఖ్య మలయాళ ప్రేక్షకులకు, ముఖ్యంగా మోహన్ లాల్ అభిమానులకు రుచించలేదు. మరోవైపు గాడ్ఫాదర్కు మాటలు అందించిన లక్ష్మీభూపాల సైతం ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తెలుగులో చిరు చేసిన గాడ్ఫాదర్ పాత్రను మోహన్ లాల్ కూడా చేయలేదని వ్యాఖ్యానించడం కూడా వారిని హర్ట్ చేసినట్లే ఉంది. ఈ నేపథ్యంలో వాళ్లు చిరును, గాడ్ఫాదర్ టీంను ట్రోల్ చేస్తున్నారు సోషల్ మీడియాలో.
ఇంతకుముందు గాడ్ఫాదర్ ట్రైలర్ రిలీజైనపుడు మోహన్ లాల్తో పోల్చి చిరును వాళ్లు కొంతమేర కించపరిచే ప్రయత్నం చేశారు. కొన్ని షాట్లను పోల్చి చిరు లాల్ ముందు తేలిపోయాడని ట్రోల్ చేశారు. ఇప్పుడేమో చిరు చేసిన చిన్న కామెంట్ను పట్టుకుని ఆయన్ని టార్గెట్ చేస్తున్నారు. సినిమా రిలీజయ్యాక ఈ పోలికలు, ట్రోలింగ్లు ఏ స్థాయికి వెళ్తాయో చూడాలి.
సమంత అసాధ్యం అనుకున్నది చేసి చూపించేసింది. ఈ రోజుతో మా ఇంటి బంగారం వంద కోట్ల గ్రాస్ క్లబ్బులో అడుగు…
ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…