ఆదివారం సాయంత్రం నుంచి భారత సినీ ప్రేక్షకుల చర్చలన్నీ ‘ఆదిపురుష్’ చుట్టూనే తిరుగుతున్నాయి. భారీ అంచనాల మధ్య రిలీజైన ఈ సినిమా టీజర్.. మెజారిటీ ప్రేక్షకులకు తీవ్ర నిరాశను మిగిల్చింది. సినిమా గురించి ఏదో ఊహించుకుంటే టీజర్లో ఇంకేదో కనిపించింది. టీజర్లో ఇదొక యానిమేషన్ మూవీలాగా కనిపించడమే చాలామందికి రుచించలేదు. ఇక ఇందులో విజువల్ ఎఫెక్ట్స్, రావణుడి పాత్ర పోషించిన సైఫ్ అలీఖాన్ అప్పీయిరెన్స్ మీద తీవ్ర విమర్శలే వచ్చాయి.
ఈ మధ్య కాలంలో ఈ స్థాయిలో సోషల్ మీడియాలో ట్రోల్ అయిన మూవీ ఇంకోటి లేదు అనే స్థాయిలో ‘ఆదిపరుష్’ నెగెటివిటీని ఎదుర్కొంటోంది ఇప్పటికీ ఈ ట్రోల్ కొనసాగుతూనే ఉంది. ఇదే సమయంలో ప్రభాస్ లైవ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది ‘ఆదిపురుష్’ టీజర్ లాంచ్ తర్వాత అయోధ్యలో ప్రభాస్ అండ్ టీం బస చేసిన ఒక హోటల్లో తీసిన వీడియో.
ఆ వీడియోలో ప్రభాస్ చాలా సీరియస్గా కనిపిస్తున్నాడు. ఓం రౌత్ వైపు వేలు చూపిస్తూ.. ‘‘Om. Are you coming to my room. Come’’ అని ప్రభాస్ అనడం కనిపించింది. బయట చాలా సరదాగా కనిపించే ప్రభాస్.. ఈ వీడియోలో చాలా కోపంగ ఉన్నట్లు కనిపిస్తున్నాడు. అతను క్యాజువల్గానే ఓం రౌత్ను తన రూంకి రమ్మని పిలిచి ఉండొచ్చు. కానీ నెటిజన్లు మాత్రం దీనికి వేరే భాష్యం చెబుతున్నారు.
‘ఆదిపురుష్’ టీజర్, దానికి వచ్చిన రెస్సాన్స్ చూసి ప్రభాస్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడని.. ఈ క్రమంలోనే ఓం రౌత్ను రఫ్ఫాడించడానికి తన రూంకి పిలిచాడని అంటున్నారు. ‘నువ్వు నాకు నచ్చావ్’లో కిళ్ళీ గురించి మాట్లాడాలి అంటూ సునీల్ను వెంకీ పట్టుకునే వీడియో, అలాగే ‘కిక్’లో ఆలీని లోపలికి తీసుకెళ్లి రవితేజ బాదే వీడియో.. ఇంకా ‘బృందావనం’లో బ్రహ్మానందానికి ఎన్టీఆర్ కోటింగ్ ఇచ్చే వీడియో.. ఇలా రకరకాల వీడియోలు దానికి జోడించి ఓం రౌత్ను ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.
This post was last modified on October 4, 2022 4:41 pm
భారత దేశ రాజకీయాల్లో ఎన్నో పార్టీలు పుడుతున్నాయి. ఆ వెంటనే కనుమరుగు అవుతున్నాయి. ఎక్కడో ఒకటి అరా పార్టీలు కొనసాగుతున్నా... అవన్నీ దాదాపుగా…
టాలీవుడ్లో క్యారెక్టర్ రోల్స్ తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి సురేఖా వాణి. వందల సంఖ్యలో సినిమాలు చేసిన ఆమెకు…
ఈ వారం టాలీవుడ్లో ఒక ఆసక్తికర అరంగేట్రం జరిగింది. ఇండస్ట్రీలో అతి పెద్ద కుటుంబాల్లో ఒకటైన ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి…
వైసీపీలో జగన్ అంటే ప్రాణం పెట్టేవారే ఉన్నారని, ఆయన గీసిన గీత దాటబోరని చెప్పే వారు కనిపిస్తారు. అయితే.. తాజాగా…
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…