బాలీవుడ్లో ఎప్పుడు ఏ సినిమా ఎలా ఆడుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. కొవిడ్ తర్వాత పరిస్థితులు అంత చిత్రంగా మారిపోయాయి. ఒకప్పుడు అలవోకగా వీకెండ్లో వంద కోట్ల వసూళ్లు రాబట్టిన హీరోలు.. ఇప్పుడు అందులో సగం కలెక్ట్ చేయడానికి కూడా కష్టపడిపోతున్నారు. ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్గా కొన్నేళ్ల ముందు వరకు నీరాజనాలు అందుకున్న ఆమిర్ ఖాన్.. ఇటీవల ‘లాల్ సింగ్ చడ్డా’తో ఎంత దారుణమైన అనుభవాన్ని ఎదుర్కొన్నాడో తెలిసిందే. దానికి ముందు, తర్వాత కూడా కొన్ని పెద్ద సినిమాలకు ఇలాంటి అనుభవమే ఎదురైంది.
ఐతే ఇటీవల ‘బ్రహ్మాస్త్ర’ సినిమాకు భారీ ఓపెనింగ్స్ రావడం.. ఆ సినిమా కొన్ని వారాల పాటు సత్తా చాటడంతో పరిస్థితి మెరుగుపడిందని అనుకున్నారంతా. కానీ ఇప్పుడు ఇంకో పెద్ద సినిమాకు బాక్సాఫీస్ దగ్గర చేదు అనుభవం తప్పలేదు. ఆ చిత్రమే.. విక్రమ్ వేద.
హృతిక్ రోషన్, సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రలు పోషించిన ‘విక్రమ్ వేద’.. ఇదే పేరుతో తమిళంలో విడుదలై బ్లాక్బస్టర్ అయిన సినిమాకు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఒరిజినల్ డైరెక్టర్లు పుష్కర్, గాయత్రిలే హిందీలోనూ రీమేక్ చేశారు. ఈ సినిమాకు హిందీలోనూ మంచి టాక్ వచ్చింది. పెద్ద స్టార్ కాస్ట్, పాజిటివ్ టాక్.. ఒక సినిమా మంచి వసూళ్లు రాబట్టడానికి ఇంతకంటే ఏం కావాలి? కానీ తొలి రోజే రూ.10 కోట్ల వసూళ్లతో తీవ్రంగా నిరాశ పరిచిన ‘విక్రమ్ వేద’ తర్వాతి రెండు రోజుల్లోనూ పెద్దగా పుంజుకోలేకపోయింది.
వీకెండ్ అయ్యేసరికి మొత్తం వసూళ్లు రూ.36 కోట్లకు అటు ఇటుగా ఉన్నాయి. ఇక సోమవారం అయితే వసూళ్లు ఒక్కసారిగా డ్రాప్ అయ్యాయి. కేవలం దేశవ్యాప్తంగా రూ.4 కోట్లు రాబట్టిందీ చిత్రం. రూ.250 కోట్ల భారీ బడ్జెట్లో తెరకెక్కిన సినిమాకు తొలి నాలుగు రోజుల్లో రూ.50 కోట్ల వసూళ్లు కూడా రాకపోవడం దారుణం. హృతిక్ లాంటి పెద్ద స్టార్ నటించి, పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సినిమాకు ఈ దుస్థితి వస్తుందని ఎవ్వరూ ఊహించి ఉండరు.
This post was last modified on October 4, 2022 3:21 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…