మహేష్ బాబు , త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో #SSMB28 సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటివలే ఓ యాక్షన్ ఎపిసోడ్ తో మొదటి షెడ్యుల్ జరుపుకున్న ఈ సినిమాకు సంబంధించి రెండో షెడ్యుల్ త్వరలోనే మొదలు కానుంది. తాజాగా మహేష్ అమ్మ ఇందిరా దేవి మరణంతో సెకండ్ షెడ్యుల్ కి బ్రేక్ పడింది. దీంతో ఆ షెడ్యుల్ ప్లానింగ్ మారింది. ఇక ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఫర్ ది ఫస్ట్ టైం మహేష్ కోసం త్రివిక్రమ్ ఐటెం సాంగ్ పెట్టనున్నాడనేది ఆ న్యూస్.
లేటెస్ట్ గా ఈ విషయంపై నిర్మాత నాగ వంశీ స్పందించాడు. సినిమాలో ఐటెం సాంగ్ పెట్టాలని అనుకుంటున్న మాట వాస్తవమే. కానీ ఇంకా డిసిషన్ తీసుకోలేదు. మహేష్ గారి ఫ్యాన్స్ , మాస్ ప్రేక్షకుల కోసం ఐటెం సాంగ్ పెడితే బాగుంటుందని త్రివిక్రమ్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆయన ఇంకా డిసిషన్ తీసుకోలేదంటూ క్లారిటీ ఇచ్చాడు. ఇక మహేష్ – త్రివిక్రమ్ గార్ల కాంబోలో వచ్చిన ‘అతడు’, ‘ఖలేజా’ రెండూ థియేటర్స్ లో అనుకున్నంత ఆదరణ అందుకోలేకపోయాయి. ఆ సినిమాలు టివీ లో బిగ్గెస్ట్ వ్యూస్ అందుకున్నాయి. కానీ ఈసారి ఈ కాంబో మీద ఎన్ని అంచనాలు పెట్టుకున్నా వాటిని మించి సినిమా ఉండబోతుందని నమ్మకం వ్యక్తం చేశాడు నాగ వంశీ.
బేసిక్ గా త్రివిక్రమ్ సినిమాల్లో ఐటెం సాంగ్ ఉండదు. కానీ ఆ స్పెషల్ పబ్ సాంగ్ పెడుతుంటాడు. ఇప్పుడు మహేష్ బాబు కోసం తన సినిమాలో మరో కమర్షియల్ ఎలిమెంట్ ఫిక్స్ చేయబోతున్నాడు. త్వరలోనే ఈ విషయంపై పూర్తి క్లారిటీ రానుంది. మరి మహేష్ కోసం త్రివిక్రమ్ తన పంథా మార్చుకొని సుకుమార్ లా ఐటెం సాంగ్ తో హంగామా చేస్తాడేమో చూడాలి.
This post was last modified on October 1, 2022 2:38 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…