ఏదో అద్భుతం చేస్తుందనుకున్న పొన్నియన్ సెల్వన్ 1 ఆ స్థాయిలో స్పందన దక్కించుకోలేకపోయింది. తమిళంలో అతి పెద్ద మల్టీ స్టారర్ కావడంతో అక్కడ ఓపెనింగ్స్ భారీగా వచ్చాయి కానీ మనదగ్గర మాత్రం నగరాలు మినహాయించి కింది సెంటర్లలో చెప్పుకోదగ్గ నెంబర్లు నమోదు కాలేదు. ఒకవేళ టాక్ బ్రహ్మాండంగా వచ్చి ఉంటే పికప్ అయ్యేదేమో కాని ఈ రెండు రోజులు దాటితే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడం కష్టమే. ఏదో అద్భుతం జరిగితే తప్ప టార్గెట్ పెట్టుకున్న పది కోట్ల మార్కుని అందుకోవడం సులభం కాదు. విక్రమ్ కు యునానిమస్ గా పాజిటివ్ టాక్ వస్తేనే బ్రేక్ ఈవెన్ అందుకోగలిగింది.
సరే దీని వల్ల మనకు తప్పిన ముప్పేమిటనుకుంటున్నారా. అక్కడికే వద్దాం. ఒకవేళ పిఎస్ 1కు సూపర్ రెస్పాన్స్ వచ్చి ఉంటే అక్టోబర్ 5న గాడ్ ఫాదర్, ది ఘోస్ట్, స్వాతిముత్యంలకు ఇబ్బంది కలిగేది. థియేటర్ల కౌంట్ దగ్గర పంచాయితీ పడేది. కానీ ఇప్పుడా సమస్య లేదు. ఆ సమయానికి ఇది నెమ్మదించడం ఖాయం. తక్కువ స్క్రీన్లున్న కేంద్రాల్లో తెలుగు స్ట్రెయిట్ సినిమాలు వేసుకోవడానికి రూట్ క్లియర్ అయ్యింది. ముఖ్యంగా స్వాతిముత్యంకు ఈ పరిణామం ఉపయోగపడుతుంది. ఆ రోజుకు పిఎస్ 1 మొదటి వారం పూర్తి కాకపోయినా రెండు రోజులు ఆగితే చాలు ఫస్ట్ వీక్ అగ్రిమెంట్లు పూర్తవుతాయి కాబట్టి థియేటర్లు ఫ్రీ అవుతాయి.
మొత్తానికి పొన్నియన్ సెల్వన్ ఫలితం టాలీవుడ్ కు అనుకూలంగానే మారిందని చెప్పాలి. దసరా బరిలో దిగే చిత్రాలకు ఇది సానుకూలాంశం. కాకపోతే మణిరత్నం మూవీకి కలిగిన అడ్వాంటేజ్ ఒకటి లేకపోలేదు. ఏపి తెలంగాణలో స్కూల్స్ కాలేజీల సెలవులు సెప్టెంబర్ 26 నుంచే మొదలయ్యాయి. అక్టోబర్ ఆరు నుంచి పదో తేదీ దాకా ఇవి కొనసాగనున్నాయి. అంటే పండగ రోజు వరకు జనానికి ఉన్న పెద్ద ఆప్షన్ పిఎస్ 1 ఒకటే. ఈ అవకాశాన్ని సరిగ్గా వాడుకుని ఉంటే ఇంకో లెవెల్ లో ఉండేది. మన సంగతి ఎలా ఉన్నా తమిళనాడు, కేరళలో మాత్రం రికార్డులు ఖాయమేనట.
This post was last modified on October 1, 2022 7:03 am
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…