ఏదో అద్భుతం చేస్తుందనుకున్న పొన్నియన్ సెల్వన్ 1 ఆ స్థాయిలో స్పందన దక్కించుకోలేకపోయింది. తమిళంలో అతి పెద్ద మల్టీ స్టారర్ కావడంతో అక్కడ ఓపెనింగ్స్ భారీగా వచ్చాయి కానీ మనదగ్గర మాత్రం నగరాలు మినహాయించి కింది సెంటర్లలో చెప్పుకోదగ్గ నెంబర్లు నమోదు కాలేదు. ఒకవేళ టాక్ బ్రహ్మాండంగా వచ్చి ఉంటే పికప్ అయ్యేదేమో కాని ఈ రెండు రోజులు దాటితే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడం కష్టమే. ఏదో అద్భుతం జరిగితే తప్ప టార్గెట్ పెట్టుకున్న పది కోట్ల మార్కుని అందుకోవడం సులభం కాదు. విక్రమ్ కు యునానిమస్ గా పాజిటివ్ టాక్ వస్తేనే బ్రేక్ ఈవెన్ అందుకోగలిగింది.
సరే దీని వల్ల మనకు తప్పిన ముప్పేమిటనుకుంటున్నారా. అక్కడికే వద్దాం. ఒకవేళ పిఎస్ 1కు సూపర్ రెస్పాన్స్ వచ్చి ఉంటే అక్టోబర్ 5న గాడ్ ఫాదర్, ది ఘోస్ట్, స్వాతిముత్యంలకు ఇబ్బంది కలిగేది. థియేటర్ల కౌంట్ దగ్గర పంచాయితీ పడేది. కానీ ఇప్పుడా సమస్య లేదు. ఆ సమయానికి ఇది నెమ్మదించడం ఖాయం. తక్కువ స్క్రీన్లున్న కేంద్రాల్లో తెలుగు స్ట్రెయిట్ సినిమాలు వేసుకోవడానికి రూట్ క్లియర్ అయ్యింది. ముఖ్యంగా స్వాతిముత్యంకు ఈ పరిణామం ఉపయోగపడుతుంది. ఆ రోజుకు పిఎస్ 1 మొదటి వారం పూర్తి కాకపోయినా రెండు రోజులు ఆగితే చాలు ఫస్ట్ వీక్ అగ్రిమెంట్లు పూర్తవుతాయి కాబట్టి థియేటర్లు ఫ్రీ అవుతాయి.
మొత్తానికి పొన్నియన్ సెల్వన్ ఫలితం టాలీవుడ్ కు అనుకూలంగానే మారిందని చెప్పాలి. దసరా బరిలో దిగే చిత్రాలకు ఇది సానుకూలాంశం. కాకపోతే మణిరత్నం మూవీకి కలిగిన అడ్వాంటేజ్ ఒకటి లేకపోలేదు. ఏపి తెలంగాణలో స్కూల్స్ కాలేజీల సెలవులు సెప్టెంబర్ 26 నుంచే మొదలయ్యాయి. అక్టోబర్ ఆరు నుంచి పదో తేదీ దాకా ఇవి కొనసాగనున్నాయి. అంటే పండగ రోజు వరకు జనానికి ఉన్న పెద్ద ఆప్షన్ పిఎస్ 1 ఒకటే. ఈ అవకాశాన్ని సరిగ్గా వాడుకుని ఉంటే ఇంకో లెవెల్ లో ఉండేది. మన సంగతి ఎలా ఉన్నా తమిళనాడు, కేరళలో మాత్రం రికార్డులు ఖాయమేనట.
This post was last modified on October 1, 2022 7:03 am
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…