Movie News

పృథ్వీకు కోర్టు షాక్

టాలీవుడ్ లో ప్రముఖ కమెడియన్ గా పృథ్వీకు మంచి పేరున్న సంగతి తెలిసిందే. “30 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ” అన్న డైలాగ్ తో పాపులర్ అయిన పృథ్వీ తనదైన టైమింగ్ తో డైలాగులు చెబుతూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. అయితే, తెరమీద అందరినీ నవ్విస్తున్న పృథ్వీ తెర వెనుక వ్యక్తిగత జీవితం, వైవాహిక జీవితంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలాకాలంగా తన భార్య శ్రీలక్ష్మికి పృథ్వీ దూరంగా ఉంటున్నారు.

ఈ క్రమంలోనే పృథ్వీపై ఆమె భార్య శ్రీలక్ష్మి కొద్ది నెలల క్రితం విజయవాడ ఫ్యామిలీ కోర్టులో కేసు పెట్టారు. 2016లో తనను పృథ్వీ ఇంట్లో నుంచి వెళ్లగొట్టారని, దీంతో గత్యంతరం లేక తాను పుట్టింట్లో ఉంటున్నానని శ్రీలక్ష్మి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే 2017లో భర్త నుంచి తనకు భరణం ఇప్పించాలని కోరుతూ శ్రీలక్ష్మి విజయవాడ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. పెళ్లైన కొత్తలో తన భర్త పృథ్వీ విజయవాడలోని తమ ఇంట్లోనే ఉండేవారని, అక్కడి నుంచి చెన్నైకి వెళ్లి సినిమా అవకాశాల కోసం ప్రయత్నించే వారని ఆ ఫిర్యాదులో శ్రీలక్ష్మి పేర్కొన్నారు.

అప్పట్లో ఆ ఖర్చులన్నీ తన తల్లిదండ్రులు భరించే వారని శ్రీలక్ష్మి అన్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా శ్రీలక్ష్మి పెట్టిన కేసుపై విచారణ జరిపిన విజయవాడ ఫ్యామిలీ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. శ్రీలక్ష్మికి నెలకు 8 లక్షల రూపాయల భరణం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఈ ప్రకారం విజయవాడ 14వ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి ఇందిరా ప్రియదర్శిని తీర్పు చెప్పారు.

ఈనెల 10వ తేదీ నాటికి శ్రీలక్ష్మికి రూ.8 లక్షల భరణం చెల్లించాలని ఆదేశించారు. అంతేకాదు, శ్రీలక్ష్మి కేసు దాఖలు చేసిన 2017 నుంచి ఆ మొత్తాన్ని చెల్లించాలని న్యాయమూర్తి ఆదేశించారు. కాగా, విజయవాడకు చెందిన శ్రీలక్ష్మికి, పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లికి చెందిన బాలిరెడ్డి పృథ్వీ (శేషు)కి 1984లో వివాహం జరిగింది. వీరిద్దరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.

This post was last modified on October 1, 2022 10:47 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

క్లాస్ రవితేజకు మాస్ చిరు ఛాలెంజ్

సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వందల కోట్లతో తీసిన రాజా సాబ్ కు మిశ్రమ స్పందన…

1 hour ago

అనిల్ రావిపూడి కారు సమర్పించుకోవాల్సిందే..

నిన్న రాత్రి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. చిరు కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్…

2 hours ago

‘పోలవరం పూర్తయితే ఏపీతో ఎవరూ పోటీ పడలేరు’

పోలవరం అత్యత్భుతమైన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దక్షిణ భారత్‌లో ఏ రాష్ట్రమూ మనతో పోటీ పడలేదు.. అని…

3 hours ago

వరప్రసాదుకి పోలికలు అవసరం లేదు

మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…

4 hours ago

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

9 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

9 hours ago