నిన్న మొన్నటి దాకా చాలా పరిమితంగా ఉన్న శాండల్ వుడ్ మార్కెట్ ని కెజిఎఫ్ రూపంలో ఒక్కసారిగా వేయి కోట్ల స్థాయికి చేర్చిన ఘనత నిర్మాణ సంస్థ హోంబాలే ఫిలింస్ కి దక్కుతుంది. ప్రస్తుతం ప్రభాస్ తో సలార్ ని సైతం దానికి రెట్టింపు స్థాయిలో తీర్చిదిద్దుతున్న సంగతి తెలిసిందే. రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్ టైనర్స్ కి దూరంగా విభిన్నమైన కథలను ఎంచుకుంటూనే భారీ బడ్జెట్ లతో డబ్బును ఖర్చు చేసే విషయంలో ఏ మాత్రం రాజీపడని సంస్థగా నేషనల్ మీడియా దృష్టిలోనూ పడింది. ఇప్పుడీ బ్యానర్ కి మరో జాక్ పాట్ దక్కింది. దాని పేరు కంటర(సంస్కృత అర్థం దట్టమైన అడవి).
పొన్నియన్ సెల్వన్ 1 పోటీని ఏ మాత్రం లెక్కచేయకుండా ఈ సినిమాను కర్ణాటకలో భారీ ఎత్తున్న రిలీజ్ చేశారు. తమిళం తెలుగు కూడా అనుకున్నారు కానీ థియేటర్ల సమస్యతో పాటు ప్రమోషన్ కు టైం లేకపోవడం వల్ల ఆ నిర్ణయం వాయిదా వేసుకున్నారు. ఇప్పుడీ కంటరకు విమర్శకుల ప్రశంసలతో పాటు ఆడియన్స్ మెప్పులు అందుతున్నాయి. అటవీ సంపదను రక్షించే విషయంలో ఒక ఫారెస్ట్ ఆఫీసర్ కి, అక్కడే ఉంటూ తాతలు తండ్రుల వృత్తిని నమ్ముకున్న యువకుడికి మధ్య అంతర్యుద్ధాన్ని నేపథ్యంగా తీసుకున్నారు. గత ఏడాది గరుడ గమన వృషభ వాహనతో వావ్ అనిపించిన రిషబ్ శెట్టి దీనికి హీరో కమ్ దర్శకుడు.
విలేజ్ నేటివిటీ అయినప్పటికీ చాలా నిజాయితీగా కంటరను తెరకెక్కించిన తీరు అబ్బురపరుస్తుంది. అసలు మనం చూస్తోంది సినిమానేనా అనిపించేలా సరికొత్త అనుభూతినిస్తూ చాలా అరుదుగా చూసే రాతి ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది. సాంకేతిక వర్గం పోటీపడుతూ పని చేస్తే ఎలా ఉంటుందో దానికి మంచి ఉదాహరణగా ఈ మూవీ గురించి చెప్పుకోవచ్చు. హ్యాపీ నుంచి ఆచార్య దాకా తెలుగు సినిమాల్లోనూ రెగ్యులర్ గా కనిపించే కిషోర్ ఇందులో పోలీస్ అధికారిగా అదరగొట్టేశాడు. క్యాస్టింగ్ చాలా సహజంగా ఉంది. రా డ్రామాలను ఇష్టపడే వాళ్లకు కంటర నచ్చేస్తుంది. ముఖ్యంగా క్లైమాక్స్ షాక్ ఇస్తుంది. తెలుగులో త్వరలోనే రావొచ్చు.
This post was last modified on October 1, 2022 6:58 am
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…