ఈ దసరా పండుగకు టాలీవుడ్ కింగ్ నాగార్జున నుంచి ‘ది ఘోస్ట’ అనే సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా నటించింది. సిస్టర్ సెంటిమెంట్ ప్రధానంగా సాగే ఔట్ అండ్ ఔట్ హై వోల్టేజ్ యాక్షన్ మూవీ ఇది. ఇందులో ఇంటర్ పోల్ ఆఫీసర్ గా ఫిరోషియస్ అండ్ టెర్రిఫిక్ లుక్ లో నాగ్ కనిపించబోతున్నారు. అలాగే ఈ చిత్రంలో నాగార్జున సోదరిగా బాలీవుడ్ నటి గుల్ పనగ్ నటించారు.
శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నారాయణ్ దాస్ నారంగ్, సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి భరత్ సౌరభ్, మార్క్ కె రాబిన్ సంగీత దర్శకులిగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే బయటకు వచ్చిన పోస్టర్స్, గ్లింప్స్, టీజర్, ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేశాయి.
మరింత బజ్ ను క్రియేట్ చేసేందుకు మరోవైపు మేకర్స్ విసృతంగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్గా మారింది. అదేంటంటే ఈ సినిమాకు నాగార్జున రెమ్యునరేషన్ వద్దన్నారట. సాధారణంగా నాగార్జున ఒక్కో సినిమాకు రూ. 6 నుంచి 7 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకునేవారని టాక్ ఉంది.
కానీ, ‘ది ఘోస్ట్’పై ఉన్న నమ్మకంతో రెమ్యునరేషన్కు బదులుగా నాగార్జున నాలుగు ఏరియాల థియేట్రికల్ హక్కులను తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. వైజాగ్, ఈస్ట్, వెస్ట్, గుంటూరు ఏరియాలలో ఈ సినిమా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై పంపిణీ కానుందని అంటున్నారు. మరి ఈ ప్రచారమే నిజమై ‘ది ఘోస్ట్’ ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుందంటే.. ఏపీలోని ఏరియాల ద్వారా వచ్చే మొత్తం నాగ్ రెమ్యునరేషన్ అవుతుందని టాక్ నడుస్తోంది.
కాగా, ఈ దసరా పండుగకు నాగార్జున ‘ది ఘోస్ట్’తో పాటు మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘గాడ్ ఫాదర్’ సినిమా సైతం విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. మలయాళ హిట్ ‘లూసిఫర్’కు రీమేక్గా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి మోహన్ రాజా దర్శకత్వం వహించాడు. రీమేక్ మూవీ అయినప్పటికీ ‘గాడ్ ఫాదర్’పై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. దీంతో దసరాకు ఇద్దరు సీనియర్ స్టార్ల మధ్య బాక్సాఫీస్ పోరు ఎంతో ఆసక్తికరంగా మారింది.
బిచ్చగాడు హీరోగా విజయ్ ఆంటోనీకి ఫ్లాపులతో సంబంధం లేకుండా తెలుగు ప్రేక్షకుల్లో గుర్తింపు ఉంది. అయితే వరస డిజాస్టర్లు తన…
అగ్రరాజ్యం అమెరికాలో చదువుకునేందుకు వెళ్లేవారు అప్రమత్తం కావాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పటి వరకు ఈ దేశంలో చదువుకునేందుకు వెళ్లేవారు.. ఎడ్యుకేషన్…
400 కోట్లకు పైగా వసూలు చేసినా గట్టిగా బ్లాక్ బస్టరని చెప్పుకోలేని విచిత్ర పరిస్థితి పెద్దిది. ఓవర్సీస్, ఉత్తరాది రాష్ట్రాలు,…
ఇవాళ హైదరాబాద్ ప్రసాద్ పీసీఎక్స్ లో హనుమాన్ 3డి రీ రిలీజ్ ట్రైలర్ లాంచ్ జరిగింది. మళ్ళీ విడుదల చేస్తున్న…
మళ్ళీ ఓజి 2 హాట్ టాపిక్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ హ్యాండిల్ నుంచి పవన్, దర్శకుడు సుజిత్…
హీరోల స్టార్ పవర్ పెద్దగా పని చేయట్లేదు ఈ రోజుల్లో. కంటెంట్ను బట్టే సినిమాలు చూస్తున్నారు. స్టార్లను చూసి ఎగబడి…