ఈ దసరా పండుగకు టాలీవుడ్ కింగ్ నాగార్జున నుంచి ‘ది ఘోస్ట’ అనే సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా నటించింది. సిస్టర్ సెంటిమెంట్ ప్రధానంగా సాగే ఔట్ అండ్ ఔట్ హై వోల్టేజ్ యాక్షన్ మూవీ ఇది. ఇందులో ఇంటర్ పోల్ ఆఫీసర్ గా ఫిరోషియస్ అండ్ టెర్రిఫిక్ లుక్ లో నాగ్ కనిపించబోతున్నారు. అలాగే ఈ చిత్రంలో నాగార్జున సోదరిగా బాలీవుడ్ నటి గుల్ పనగ్ నటించారు.
శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నారాయణ్ దాస్ నారంగ్, సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి భరత్ సౌరభ్, మార్క్ కె రాబిన్ సంగీత దర్శకులిగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే బయటకు వచ్చిన పోస్టర్స్, గ్లింప్స్, టీజర్, ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేశాయి.
మరింత బజ్ ను క్రియేట్ చేసేందుకు మరోవైపు మేకర్స్ విసృతంగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్గా మారింది. అదేంటంటే ఈ సినిమాకు నాగార్జున రెమ్యునరేషన్ వద్దన్నారట. సాధారణంగా నాగార్జున ఒక్కో సినిమాకు రూ. 6 నుంచి 7 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకునేవారని టాక్ ఉంది.
కానీ, ‘ది ఘోస్ట్’పై ఉన్న నమ్మకంతో రెమ్యునరేషన్కు బదులుగా నాగార్జున నాలుగు ఏరియాల థియేట్రికల్ హక్కులను తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. వైజాగ్, ఈస్ట్, వెస్ట్, గుంటూరు ఏరియాలలో ఈ సినిమా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై పంపిణీ కానుందని అంటున్నారు. మరి ఈ ప్రచారమే నిజమై ‘ది ఘోస్ట్’ ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుందంటే.. ఏపీలోని ఏరియాల ద్వారా వచ్చే మొత్తం నాగ్ రెమ్యునరేషన్ అవుతుందని టాక్ నడుస్తోంది.
కాగా, ఈ దసరా పండుగకు నాగార్జున ‘ది ఘోస్ట్’తో పాటు మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘గాడ్ ఫాదర్’ సినిమా సైతం విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. మలయాళ హిట్ ‘లూసిఫర్’కు రీమేక్గా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి మోహన్ రాజా దర్శకత్వం వహించాడు. రీమేక్ మూవీ అయినప్పటికీ ‘గాడ్ ఫాదర్’పై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. దీంతో దసరాకు ఇద్దరు సీనియర్ స్టార్ల మధ్య బాక్సాఫీస్ పోరు ఎంతో ఆసక్తికరంగా మారింది.
This post was last modified on September 30, 2022 3:28 pm
వైసీపీ పార్లమెంట్ సభ్యుడు, సీనియర్ నేత మిథున్ రెడ్డి ఆస్తులు భారీగా పెరిగాయని పేర్కొంటూ ఏడిఆర్ సర్వే తాజాగా వెల్లడించింది.…
టాక్సిక్ టీజర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా కారులో రొమాన్స్ పెట్టి దాని ద్వారా స్మశానంలో…
ఇంకొద్ది గంటల్లో రాజా సాబ్ ప్రీమియర్లు ప్రారంభం కాబోతున్నాయి. జీవో త్వరగా రావడంతో ఆంధ్రప్రదేశ్ బుకింగ్స్ వేగంగా ఉండగా తెలంగాణది…
ఈ సంక్రాంతికి ‘మాస్ రాజా’ ట్యాగ్ తీసేసి.. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు…
అంతా అనుకున్న ప్రకారం జరిగితే తమిళనాడు థియేటర్ల దగ్గర ఈపాటికి పండుగ వాతావరణం ఉండేది. రేపటి ఉదయం ‘జననాయగన్’ రిలీజ్…
తిరుమల శ్రీవారి ఆలయం అంటే దేవుడు లేడని భావించే నాస్తికులు కూడా పన్నెత్తు మాట అనని కలియుగ వైకుంఠం. ఎంతో…