ప్రతి హీరోకు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన జానర్, స్టైల్, సబ్జెక్ట్ సెన్స్ ఉంటుంది. దానికి లోబడే కథలను రాసుకుంటారు దర్శకులు. ఉదాహరణకు రజనీకాంత్ కు మేనరిజమ్స్, బాలయ్యకు ఫ్యాక్షన్, చిరంజీవికి కమర్షియాలిటీ, నాగార్జునకు ఎక్స్ పరిమెంట్, వెంకటేష్ కు ఫ్యామిలీ ఇలా అందరికీ ఒక స్కూలంటూ ఏర్పడింది. ఇప్పటి జనరేషన్ స్టార్లు ఇలా గిరి గీసుకోకుండా వీలైనన్ని ప్రయోగాలు చేస్తున్నారు కానీ కొన్నిసార్లు క్లిక్ అవ్వడం కొన్ని సార్లు మిస్ ఫైర్ కావడం జరుగుతూనే ఉంటుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తమ్ముడిగా ఇండస్ట్రీకి వచ్చిన అల్లు శిరీష్ ఇప్పటికీ ఎలాంటి బ్రాండ్ ఏర్పరుచుకోలేకపోయాడు.
ఇతని కొత్త సినిమా ఊర్వశివో రాక్షసివో నవంబర్ 4 విడుదలకు రెడీ అవుతోంది. అదే రోజు ప్లాన్ చేసుకున్న శాకుంతలం డ్రాప్ కావడంతో మేలే జరిగింది. నిజానికిది ఎప్పుడో పూర్తయ్యింది. మొదట్లో ప్రేమ కాదంట టైటిల్ తో తీసుకుంటూ వచ్చారు. పోస్టర్లు, చిన్న టీజర్ వచ్చి చాలా కాలమయ్యింది. రాకేష్ శశి దర్శకత్వంలో తమిళ హిట్ ప్యార్ ప్రేమ కాదల్ రీమేక్ గా దీన్ని రూపొందించారు. ఈ రాకేష్ ఎవరో కాదు. మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ ని విజేతతో లాంచ్ చేసింది ఇతనే. బొమ్మ తేడా కొట్టి గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. తర్వాత గీతా కాంపౌండ్ లో పడ్డాడు.
ఇదంతా ఓకే కానీ టీజర్ చూశాక అల్లు శిరీష్ మీద ఇంత హెవీ రొమాన్స్ వర్కౌట్ అవుతుందానే అనుమానం రాకమానదు. అను ఇమ్మానియేల్ హీరోయిన్ గా నటించిన ఊర్వశివో రాక్షసివోలో లీడ్ పెయిర్ మధ్య ఘాటైన కెమిస్ట్రీ బలంగా కనిపిస్తోంది. డైలాగులు కూడా దాన్నే సూచిస్తున్నాయి. స్నేహం, ప్రేమ మధ్య కన్ఫ్యూజన్ లో శారీరక సంబంధం దాకా వెళ్లిన ఓ అమ్మాయి అబ్బాయి కథ ఇది. లైన్ మరీ కొత్తేమి కాదు కానీ ఒరిజినల్ వెర్షన్ ట్రీట్ మెంట్ లో ఉన్న ఫ్రెష్ నెస్ వల్ల యూత్ కి కనెక్ట్ అయ్యింది. వాళ్లనే నమ్ముకుని శిరీష్ తో ఈ రిస్క్ చేస్తున్నారు. 2013 గౌరవంతో డెబ్యూ చేసిన అల్లు తమ్ముడి ఇదైనా బ్రేక్ ఇస్తుందేమో లెట్ సీ.
This post was last modified on September 29, 2022 7:51 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…