చాలారోజుల తర్వాత ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీతో మంచి మాస్ హిట్టు కొట్టాడు పూరీ జగన్నాథ్. ఇస్మార్ట్ ఇచ్చిన జోరుతో విజయ్ దేవరకొండతో ‘ఫైటర్’ చేస్తున్నాడు. బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య పాండేను హీరోయిన్గా ఎంపిక చేసిన పూరీ, ‘ఫైటర్’ను హిందీలోనూ గ్రాండ్గా రిలీజ్ చేస్తున్నాడు. ఈ మూవీ హిట్టయితే, పూరీ బాలీవుడ్లో బిజీ డైరెక్టర్ అవుతాడని భావించారంతా. అయితే పూరీ ప్లాన్ మాత్రం వేరేగా ఉంది.
‘ఫైటర్’ రిజల్ట్తో సంబంధం లేకుండా నందమూరి బాలకృష్ణతో తన తర్వాతి సినిమా ఉంటుందని ప్రకటించాడు పూరీ. ఇంతకుముందు వీరి కాంబోలో ‘పైసా వసూల్’ మూవీ వచ్చింది. ఈ సినిమా పెద్దగా ఆడకపోయినా బాలయ్యబాబును పూరీ చూపించిన విధానం అభిమానులకు తెగ నచ్చేసింది. క్రేజీ మేనరిజం అండ్ డిఫరెంట్ స్టైల్తో బాలయ్యతో రచ్చ రచ్చ చేయించాడు పూరీ.
నిజానికి గురువు రామ్గోపాల్ వర్మ ఇక్కడి నుంచి వెళ్లి, బాలీవుడ్లో కొన్నేళ్లపాటు పాగా వేశాడు. పూరీ కూడా హిందీలో రెండు సినిమాలు తీశాడు కానీ పెద్దగా వర్కవుట్ కాలేదు. ఇప్పుడు విజయ్కి అక్కడున్న క్రేజ్తో ‘ఫైటర్’ హిట్టయితే, పూరీ బాలీవుడ్లో పాగా వేస్తాడని, అక్కడ మెగా ప్రాజెక్ట్స్తో బిజీ అయిపోతాడని అనుకున్నారంతా. కానీ పూరీ మాత్రం టాలీవుడ్కే ప్రాధాన్యం ఇస్తున్నాడు.
అదీగాక నాలుగు వరుస ఫ్లాపులతో ఉన్న సమయంలో తనకు 101వ సినిమా డైరెక్ట్ చేసే అవకాశం ఇచ్చాడు బాలయ్య. అందుకే ‘ఫైటర్’ తర్వాత బాలకృష్ణతో సినిమా చేయాలని, స్క్రిప్ట్ పనులు పూర్తి చేసే పనిలో పడ్డాడట పూరీ. బోయపాటి శ్రీనుతో తన తర్వాతి సినిమాను కన్ఫార్మ్ చేసిన బాలయ్య, పూరీ ప్రాజెక్ట్కు ఓకే చెప్పడం దాదాపు లాంఛనమే.
This post was last modified on April 22, 2020 1:44 pm
అక్టోబర్ 2 ఆదర్శ కుటుంబం ఏకె 47 వస్తుందో లేదో ఖచ్చితంగా చెప్పలేం కానీ సందీప్ కిషన్ సిగ్మా రిలీజవుతోంది.…
ఏపీ ప్రతిపక్షం వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అయితే.. ఇప్పటి వరకు చూసింది ఒక లెక్క.. ఇక నుంచి మరో…
ప్రస్తుతం ఏపీలో చర్చనీయాంశంగా మారిన 'డీజే సౌండ్' వ్యవహారం.. కీలక మలుపు తిరిగింది. తాజాగా అనంతపురంలో నిర్వహించిన వినాయక నిమజ్జన…
ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమ అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న సినిమా.. ది ప్యారడైజ్. క్వాలిటీ సినిమాలతో పెద్ద స్టార్గా…
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తమ్ముడు అనే బ్రాండ్ నుంచి బయట పడి స్వంతంగా ఇమేజ్ సృష్టించుకునేందుకు కష్టపడుతున్న ఆనంద్…
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హుడేనంటూ తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ విషయాన్ని అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్…