చాలారోజుల తర్వాత ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీతో మంచి మాస్ హిట్టు కొట్టాడు పూరీ జగన్నాథ్. ఇస్మార్ట్ ఇచ్చిన జోరుతో విజయ్ దేవరకొండతో ‘ఫైటర్’ చేస్తున్నాడు. బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య పాండేను హీరోయిన్గా ఎంపిక చేసిన పూరీ, ‘ఫైటర్’ను హిందీలోనూ గ్రాండ్గా రిలీజ్ చేస్తున్నాడు. ఈ మూవీ హిట్టయితే, పూరీ బాలీవుడ్లో బిజీ డైరెక్టర్ అవుతాడని భావించారంతా. అయితే పూరీ ప్లాన్ మాత్రం వేరేగా ఉంది.
‘ఫైటర్’ రిజల్ట్తో సంబంధం లేకుండా నందమూరి బాలకృష్ణతో తన తర్వాతి సినిమా ఉంటుందని ప్రకటించాడు పూరీ. ఇంతకుముందు వీరి కాంబోలో ‘పైసా వసూల్’ మూవీ వచ్చింది. ఈ సినిమా పెద్దగా ఆడకపోయినా బాలయ్యబాబును పూరీ చూపించిన విధానం అభిమానులకు తెగ నచ్చేసింది. క్రేజీ మేనరిజం అండ్ డిఫరెంట్ స్టైల్తో బాలయ్యతో రచ్చ రచ్చ చేయించాడు పూరీ.
నిజానికి గురువు రామ్గోపాల్ వర్మ ఇక్కడి నుంచి వెళ్లి, బాలీవుడ్లో కొన్నేళ్లపాటు పాగా వేశాడు. పూరీ కూడా హిందీలో రెండు సినిమాలు తీశాడు కానీ పెద్దగా వర్కవుట్ కాలేదు. ఇప్పుడు విజయ్కి అక్కడున్న క్రేజ్తో ‘ఫైటర్’ హిట్టయితే, పూరీ బాలీవుడ్లో పాగా వేస్తాడని, అక్కడ మెగా ప్రాజెక్ట్స్తో బిజీ అయిపోతాడని అనుకున్నారంతా. కానీ పూరీ మాత్రం టాలీవుడ్కే ప్రాధాన్యం ఇస్తున్నాడు.
అదీగాక నాలుగు వరుస ఫ్లాపులతో ఉన్న సమయంలో తనకు 101వ సినిమా డైరెక్ట్ చేసే అవకాశం ఇచ్చాడు బాలయ్య. అందుకే ‘ఫైటర్’ తర్వాత బాలకృష్ణతో సినిమా చేయాలని, స్క్రిప్ట్ పనులు పూర్తి చేసే పనిలో పడ్డాడట పూరీ. బోయపాటి శ్రీనుతో తన తర్వాతి సినిమాను కన్ఫార్మ్ చేసిన బాలయ్య, పూరీ ప్రాజెక్ట్కు ఓకే చెప్పడం దాదాపు లాంఛనమే.
This post was last modified on April 22, 2020 1:44 pm
బీఆర్ ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టు నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు మరో సారి నిప్పు రాజుకున్నాయి.…
ఎట్టకేలకు మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు.అంబటి రాంబాబుపై ఉన్న అన్ని కేసుల్లోనూ ఆయనకు…
ఒకప్పుడు నిర్మాతలకు విపరీతమైన గౌరవం ఉండేది. పరిశ్రమను పోషించేది వాళ్లే కాబట్టి హీరో హీరోయిన్ దగ్గర నుంచి సాంకేతిక నిపుణులు,…
తెలంగాణలోని జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్లో ఒక వింత సంఘటన స్థానికులను, ప్రయాణికులను ఆశ్చర్యానికి గురిచేసింది. బుర్ఖా వేసుకుని మహిళల…
తాజాగా రాజ్యసభలో ఖాళీ అవుతున్న 37 స్థానాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ అయింది. దీనికి…
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్.. గత ఆదివారం కొలంబోకు వెళ్లి ఇండియా, పాకిస్థాన్ మధ్య టీ20 ప్రపంచకప్ మ్యాచ్ను వీక్షించడం…