చాలారోజుల తర్వాత ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీతో మంచి మాస్ హిట్టు కొట్టాడు పూరీ జగన్నాథ్. ఇస్మార్ట్ ఇచ్చిన జోరుతో విజయ్ దేవరకొండతో ‘ఫైటర్’ చేస్తున్నాడు. బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య పాండేను హీరోయిన్గా ఎంపిక చేసిన పూరీ, ‘ఫైటర్’ను హిందీలోనూ గ్రాండ్గా రిలీజ్ చేస్తున్నాడు. ఈ మూవీ హిట్టయితే, పూరీ బాలీవుడ్లో బిజీ డైరెక్టర్ అవుతాడని భావించారంతా. అయితే పూరీ ప్లాన్ మాత్రం వేరేగా ఉంది.
‘ఫైటర్’ రిజల్ట్తో సంబంధం లేకుండా నందమూరి బాలకృష్ణతో తన తర్వాతి సినిమా ఉంటుందని ప్రకటించాడు పూరీ. ఇంతకుముందు వీరి కాంబోలో ‘పైసా వసూల్’ మూవీ వచ్చింది. ఈ సినిమా పెద్దగా ఆడకపోయినా బాలయ్యబాబును పూరీ చూపించిన విధానం అభిమానులకు తెగ నచ్చేసింది. క్రేజీ మేనరిజం అండ్ డిఫరెంట్ స్టైల్తో బాలయ్యతో రచ్చ రచ్చ చేయించాడు పూరీ.
నిజానికి గురువు రామ్గోపాల్ వర్మ ఇక్కడి నుంచి వెళ్లి, బాలీవుడ్లో కొన్నేళ్లపాటు పాగా వేశాడు. పూరీ కూడా హిందీలో రెండు సినిమాలు తీశాడు కానీ పెద్దగా వర్కవుట్ కాలేదు. ఇప్పుడు విజయ్కి అక్కడున్న క్రేజ్తో ‘ఫైటర్’ హిట్టయితే, పూరీ బాలీవుడ్లో పాగా వేస్తాడని, అక్కడ మెగా ప్రాజెక్ట్స్తో బిజీ అయిపోతాడని అనుకున్నారంతా. కానీ పూరీ మాత్రం టాలీవుడ్కే ప్రాధాన్యం ఇస్తున్నాడు.
అదీగాక నాలుగు వరుస ఫ్లాపులతో ఉన్న సమయంలో తనకు 101వ సినిమా డైరెక్ట్ చేసే అవకాశం ఇచ్చాడు బాలయ్య. అందుకే ‘ఫైటర్’ తర్వాత బాలకృష్ణతో సినిమా చేయాలని, స్క్రిప్ట్ పనులు పూర్తి చేసే పనిలో పడ్డాడట పూరీ. బోయపాటి శ్రీనుతో తన తర్వాతి సినిమాను కన్ఫార్మ్ చేసిన బాలయ్య, పూరీ ప్రాజెక్ట్కు ఓకే చెప్పడం దాదాపు లాంఛనమే.
తమిళంలో చాలా ఏళ్ల నుంచి మంచి మంచి సినిమాలు చేస్తున్నప్పటికీ.. తెలుగమ్మాయి గుత్తా జ్వాలను పెళ్లి చేసుకోవడం ద్వారానే ఎక్కువగా తెలుగు వాళ్ల దృష్టిని ఆకర్షించాడు…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై కర్నూలుకు చెందిన సుగాలి ప్రీతి తల్లి పార్వతీదేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయనపై…
వరసగా మూడు సూపర్ హిట్స్ లవ్ టుడే, డ్రాగన్, డ్యూడ్ సాధించి హ్యాట్రిక్ హీరో అనిపించుకున్న ప్రదీప్ రంగనాథన్ కి…
116 ఏళ్ల వయసులోనూ తన ఇష్ట దైవం తిరుమల శ్రేవేంకటేశ్వర స్వామి దర్శనానికి కాలి నడకన వచ్చిన వృద్ధురాలికి తిరుమల…
టాలీవుడ్ తో పాటు ఇతర భాషల్లోనూ వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న బ్యూటీ రెజీనా కసాండ్రా లేటెస్ట్ గా నెట్టింట…
ఇంకో అయిదు రోజుల్లో లెనిన్ విడుదల కానుంది. జూలై 10 కోసం అక్కినేని అభిమానులే కాదు సగటు మూవీ లవర్స్…