ఈ ఏడాది ప్రారంభంలో బంగార్రాజుతో మంచి సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్న అక్కినేని నాగ చైతన్యకి గత రెండు సినిమాల ఫలితాలు తీవ్ర నిరాశ కలిగించాయి. ఎన్నో ఆశలు పెట్టుకుని కష్టపడి మేకోవర్ చేసుకుని నటించిన థాంక్ యు దారుణంగా డిజాస్టర్ కాగా అమీర్ ఖాన్ తో నటించడం గర్వకారణమే కాదు బాలీవుడ్ లో తనకో బెస్ట్ డెబ్యూ అవుతుందని నమ్మి చేసిన లాల్ సింగ్ చడ్డా చెప్పుకోలేన్నంత తీవ్రంగా బోల్తా కొట్టింది. అమెజాన్ ప్రైమ్ కోసం వెబ్ సిరీస్ దూత షూటింగ్ పూర్తి చేసిన చైతు ప్రస్తుతం తమిళ దర్శకుడు వెంకట్ ప్రభుతో ఓ ప్రాజెక్టు చేస్తున్న సంగతి తెలిసిందే. కృతి శెట్టి ఇందులో హీరోయిన్.
ఇది కాకుండా పరశురామ్ పేట్లకు ఓ కమిట్ మెంట్ ఇచ్చాడు చైతు. అయితే ప్రస్తుతానికి దాన్ని హోల్డ్ పెట్టారని ఇన్ సైడ్ టాక్. స్క్రిప్ట్ విషయంలో పూర్తి ఏకాభిప్రాయం రాలేదట. అందుకే మరోసారి రిపేర్లు చేశాక అప్పుడు ఫైనల్ డెసిషన్ తీసుకుందామని చెప్పినట్టు వినికిడి. ఒకవేళ సర్కారు వారి పాట అంచనాలను మించి బ్లాక్ బస్టర్ అయ్యుంటే పరశురామ్ కి ఈ ఇబ్బంది వచ్చి ఉండేది కాదు. కానీ మహేష్ బాబు లాంటి స్టార్ దొరికినప్పుడు ఆయన్ని హ్యాండిల్ చేయడంలో పడిన తడబాటు పెద్ద ఇండస్ట్రీ హిట్ ని మిస్ చేసి జస్ట్ ఓకే హిట్ దగ్గర ఆగిపోవాల్సి వచ్చింది.
ఒక రకంగా ఇదీ కారణమైనా ఆశ్చర్యం లేదు. కెరీర్ మొదలుపెట్టినప్పటి నుంచి చైతన్యకు అదేదో బ్యాడ్ లక్ లా ఒక హిట్టు దక్కితే ఆ వెంటనే రెండో మూడో పరాజయాలు పలకరించడం పరిపాటి అయ్యింది. అందుకే మార్కెట్ ఒక పరిమితికి మించి పెరగడం లేదు. అటు అఖిల్ కూడా స్ట్రగుల్ అవుతున్నాడు కానీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కొంత ఊరటనిచ్చాక ఏజెంట్ ని ప్యాన్ ఇండియా లెవెల్ లో భారీ అంచనాలతో చేస్తున్నాడు. చైతు పరశురామ్ లది క్యాన్సిల్ కాలేదు కానీ కొంచెం ఎక్కువ టైం పట్టేలా ఉంది. ఎలాగూ వెంకట్ ప్రభుది ఎంతలేదన్నా ఆరు నెలలు పడుతుందిగా.
This post was last modified on September 28, 2022 6:06 am
రెండు నెలల కిందట రిలీజైన దురంధర్ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ను ఎలా షేక్ చేసిందో తెలిసిందే. ఆ చిత్రం కేవలం…
బుల్లితెరపై ఘన చరిత్ర ఉన్న ఈటీవీ ప్రభాకర్ నట వారసత్వాన్ని సినీ రంగంలోకి హీరోగా అడుగు పెట్టిన చంద్రహాస్.. తన…
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించారని.. పంది, ఆవు కొవ్వులను కూడా వినియోగించారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ను సిట్ అధికారులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు నంది…
కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశ పెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్లో ప్రత్యేకంగా ఒక రాష్ట్రానికి అంటూ పెద్దగా కేటాయింపులు ఏమీ…
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లపై వైసీపీ నేత జోగి రమేశ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం…