2023 సంక్రాంతి పోరు వేడెక్కుతోంది. ఇంకో మూడు నెలలే టైం ఉండటంతో అఫీషియల్ గా లాక్ చేసుకోవడానికి నిర్మాతలు రెడీ అవుతున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ కళ్ళలో ఒత్తులు వేసుకుని ఎదురు చూసిన ఆది పురుష్ కీలక అప్ డేట్ ని ఇవాళ దర్శకుడు ఓం రౌత్ పంచుకోవడంతో వాళ్ళ ఆనందానికి పట్టపగ్గాలు లేకుండా పోయాయి. జనవరి 12 సంక్రాంతి పండగను టార్గెట్ చేసుకుని వరల్డ్ వైడ్ థియేటర్ రిలీజ్ చేయబోతున్నట్టు కన్ఫర్మేషన్ ఇచ్చారు. బహుశా ఇండియన్ సినిమాలో కనివిని ఎరుగని స్థాయిలో దీని విడుదల ఉండే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
ఇక్కడే చిరంజీవి విజయ్ లకు చిక్కొచ్చి పడింది. వాల్తేర్ వీరయ్య(టైటిల్ ఖరారు కాలేదు) షూటింగ్ శరవేగంగా చేస్తున్నారు. గాడ్ ఫాదర్ ప్రమోషన్లు ఉన్నా సరే డెడ్ లైన్లు మీట్ కావాలనే ఉద్దేశంతో నాన్ స్టాప్ గా చిత్రీకరణ జరుపుతూనే ఉన్నారు. ఎలాగైనా సరే పండగ బరిలో దిగాలన్నది లక్ష్యం. పైగా రవితేజ డేట్లు ఇప్పుడు మిస్ చేసుకుంటే మళ్ళీ దొరకడం కష్టం కాబట్టి ఆ కోణం కూడా ఈ స్పీడ్ కి కారణం. ఇక వారసుడుని పొంగల్ కు తేవడం ఖాయమని ఇటీవలే పలు ట్వీట్ల ద్వారా దిల్ రాజు నిర్మాణ సంస్థ ఎస్విసి స్పష్టం చేసింది. పైగా విజయ్ కు ఇది సెంటిమెంట్ కూడా.
ఇప్పుడు ఆది పురుష్ వల్ల ఈ రెండింటికి ఇబ్బందులు తప్పవు. స్టార్ డం పరంగా ఎవరికెవరు తీసిపోని రేంజ్ లో ఉన్నా సరే ప్యాన్ ఇండియా అప్పీల్ పరంగా ఎక్కువ అడ్వాంటేజ్ ఉన్నది ప్రభాస్ కే. ముఖ్యంగా నార్త్ డిస్ట్రిబ్యూటర్లు ఎగబడి కొంటారు. పైగా ప్రొడ్యూసర్ టి సిరీస్ సంస్థ. ఒక్కసారి స్కెచ్ వేశారంటే ఉత్తరాది మొత్తం స్క్రీన్లు పట్టేస్తారు. వారసుడికి విజయ్ ఇమేజ్ ఒకటే అండదండా. అది మినహాయిస్తే ఇదో రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్ టైనరే. వీరయ్య సైతం ఊర మాస్ ని నమ్ముకున్నదే. సంక్రాంతికి రెండు మూడు పెద్ద సినిమాలకు స్కోప్ ఉంటుంది కానీ ఈసారి ఆది పురుష్ తో లెక్కలు అంత ఈజీగా ఉండవు.
కెరీర్ తొలి నాళ్లలో పెద్దగా అవకాశాలు లేనపుడు దక్షిణాదిన వచ్చే ప్రతి ఛాన్సునూ మహా ప్రసాదం అనుకుంటారు. స్టార్ ఇమేజ్…
మెగా హీరోల సినిమాలకు సంబంధించి ఏ ఈవెంట్ అయినా.. అందులో ఎక్కడో ఒక చోట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్…
హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగిన పెద్ది సక్సెస్ మీట్ కోసం వేలాది అభిమానులు తరలివచ్చారు. ఈ సినిమాకు సంబంధించి ఇదే…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేస్తూ విపక్ష వైసీపీ ఇటీవల డోస్ పెంచిన…
ప్రతి సంవత్సరం విజయ్కి స్పెషల్ పిక్తో పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పే త్రిష.. ఈసారి చెప్పలేదు. ఇన్స్టాగ్రామ్లో కూడా ఆయన్ని…
నిజమే…ఆ ఇద్దరూ కలిశారు. రాష్ట్ర అభివృద్ది కోసం రాజకీయాలను పక్కనపెట్టేశారు. అంతే… ఇద్దరు ముగ్గురయ్యారు. ఆ ముగ్గురూ నలుగురయ్యారు. వెరసి…