2023 సంక్రాంతి పోరు వేడెక్కుతోంది. ఇంకో మూడు నెలలే టైం ఉండటంతో అఫీషియల్ గా లాక్ చేసుకోవడానికి నిర్మాతలు రెడీ అవుతున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ కళ్ళలో ఒత్తులు వేసుకుని ఎదురు చూసిన ఆది పురుష్ కీలక అప్ డేట్ ని ఇవాళ దర్శకుడు ఓం రౌత్ పంచుకోవడంతో వాళ్ళ ఆనందానికి పట్టపగ్గాలు లేకుండా పోయాయి. జనవరి 12 సంక్రాంతి పండగను టార్గెట్ చేసుకుని వరల్డ్ వైడ్ థియేటర్ రిలీజ్ చేయబోతున్నట్టు కన్ఫర్మేషన్ ఇచ్చారు. బహుశా ఇండియన్ సినిమాలో కనివిని ఎరుగని స్థాయిలో దీని విడుదల ఉండే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
ఇక్కడే చిరంజీవి విజయ్ లకు చిక్కొచ్చి పడింది. వాల్తేర్ వీరయ్య(టైటిల్ ఖరారు కాలేదు) షూటింగ్ శరవేగంగా చేస్తున్నారు. గాడ్ ఫాదర్ ప్రమోషన్లు ఉన్నా సరే డెడ్ లైన్లు మీట్ కావాలనే ఉద్దేశంతో నాన్ స్టాప్ గా చిత్రీకరణ జరుపుతూనే ఉన్నారు. ఎలాగైనా సరే పండగ బరిలో దిగాలన్నది లక్ష్యం. పైగా రవితేజ డేట్లు ఇప్పుడు మిస్ చేసుకుంటే మళ్ళీ దొరకడం కష్టం కాబట్టి ఆ కోణం కూడా ఈ స్పీడ్ కి కారణం. ఇక వారసుడుని పొంగల్ కు తేవడం ఖాయమని ఇటీవలే పలు ట్వీట్ల ద్వారా దిల్ రాజు నిర్మాణ సంస్థ ఎస్విసి స్పష్టం చేసింది. పైగా విజయ్ కు ఇది సెంటిమెంట్ కూడా.
ఇప్పుడు ఆది పురుష్ వల్ల ఈ రెండింటికి ఇబ్బందులు తప్పవు. స్టార్ డం పరంగా ఎవరికెవరు తీసిపోని రేంజ్ లో ఉన్నా సరే ప్యాన్ ఇండియా అప్పీల్ పరంగా ఎక్కువ అడ్వాంటేజ్ ఉన్నది ప్రభాస్ కే. ముఖ్యంగా నార్త్ డిస్ట్రిబ్యూటర్లు ఎగబడి కొంటారు. పైగా ప్రొడ్యూసర్ టి సిరీస్ సంస్థ. ఒక్కసారి స్కెచ్ వేశారంటే ఉత్తరాది మొత్తం స్క్రీన్లు పట్టేస్తారు. వారసుడికి విజయ్ ఇమేజ్ ఒకటే అండదండా. అది మినహాయిస్తే ఇదో రెగ్యులర్ కమర్షియల్ ఎంటర్ టైనరే. వీరయ్య సైతం ఊర మాస్ ని నమ్ముకున్నదే. సంక్రాంతికి రెండు మూడు పెద్ద సినిమాలకు స్కోప్ ఉంటుంది కానీ ఈసారి ఆది పురుష్ తో లెక్కలు అంత ఈజీగా ఉండవు.
This post was last modified on September 28, 2022 6:12 am
బాలీవుడ్లో మంచి పేరున్న హీరోయిన్లు తెలుగులో సినిమాలు చేయడం కొత్తేమీ కాదు. కానీ హిందీలో స్టార్ స్టేటస్ సంపాదించాక, తెలుగులో…
గత వారం విడుదలైన కెజెక్యూ మీద పరిశ్రమలో ప్రత్యేకమైన సానుభూతి ఉండేది. దర్శకుడు కెకె దీని షూటింగ్ పూర్తవ్వడానికి దగ్గరగా…
వైసీపీ హయాంలో జరిగిన ఘటనలపై కేసులు కొనసాగుతున్నాయి. అనేక మంది నాయకులపై కేసులు నమోదై... ప్రస్తుతం విచారణ దశలో ఉన్నాయి.…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటనకు వస్తున్నారంటే చాలు.. కర్నూలు జిల్లా ఆలూరులో వ్యాపారులు ముందుగానే తమ దుకాణాలు మూసివేయడం…
ఏపీ అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలు సోమవారం(ఆగస్టు 17) నుంచి ప్రారంభం అవుతున్నాయి. అసెంబ్లీకి వైసీపీ నాయకులు ఎలానూ రావడం…
హైదరాబాద్ ఈగల్ పోలీసులకు గంజాయి ముఠా చుక్కలు చూపించింది. పక్కా సమాచారంతో పట్టుకునేందుకు వెళ్లిన ఈగల్ పోలీసులపై తిరగబడిన గంజాయి…