హీరోయిన్ల కొరతతో అల్లాడుతున్న టాలీవుడ్ కు కొత్త బ్యూటీల అవసరం చాలా ఉంది. పూజా హెగ్డే, రష్మిక మందన్నలను స్టార్ హీరోలు వదిలి పెట్టడం లేదు. కృతి శెట్టి ఏమో వరస డిజాస్టర్లతో ఉక్కిరిబిక్కిరవుతోంది. కియారా అద్వానీ, అలియా భట్ లు బాలీవుడ్ తర్వాతే ఏదైనా అంటున్నారు. ఈ నేపథ్యంలో ప్యాన్ ఇండియా సినిమాలకు ఈ అంశమొక్కటే పెద్ద చిక్కుగా మారింది. ఈ అవకాశం ఏజెంట్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమవుతున్న సాక్షి వైద్యకు వరంగా మారుతోంది. అఖిల్ కు జోడిగా ఫస్ట్ మూవీనే హై లెవెల్ లో పట్టేసిన సాక్షికి ఇప్పుడు రెండో ఛాన్స్ తలుపు తట్టింది.
ఎనర్జిటిక్ స్టార్ రామ్ బోయపాటి శీను కాంబినేషన్లో రూపొందబోయే భారీ చిత్రంలో సాక్షి వైద్యనే కథానాయికగా ఎంచుకున్నట్టు లేటెస్ట్ అప్ డేట్. అఫీషియల్ గా చెప్పడానికి టైం, కొంత ప్రాసెస్ ఉంది కాబట్టి దీన్ని ఖరారుగా చెప్పలేం కానీ లాక్ చేసిన మాట వాస్తవమేనని విశ్వసనీయ వర్గాల సమాచారం. మోడలింగ్ తో కెరీర్ మొదలుపెట్టి పలు యాడ్ ఫిలింస్ లో నటించిన సాక్షి నిజానికి హిందీ మార్కెట్ కోసం ఎదురు చూసింది. అది ఆలస్యం కావడం ఈలోగా అక్కినేని వారసుడికి జోడిగా ఆఫర్ రావడం చకచకా జరిగిపోయాయి.
ఈ ప్రాజెక్టు కోసం రామ్ హెయిర్ స్టైల్ మార్చి కొత్త రూపంలోకి వెళ్ళుతున్నాడు. తన హీరోలతో ఫిజిక్స్ నే ఛాలెంజ్ చేసే యాక్షన్ ఎపిసోడ్లతో ఓ రేంజ్ లో ఎలివేషన్లు ఇచ్చే బోయపాటి ఇప్పుడు రామ్ ని ఎలా చూపిస్తాడోననే ఆసక్తి ఫ్యాన్స్ లో విపరీతంగా ఉంది. ఐస్మార్ట్ శంకర్ ఇచ్చిన మాస్ ఇమేజ్ పెంచుకునేందుకు రామ్ శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు. ఈ కోవలో చేసిన రెడ్ ఆశించిన గొప్ప ఫలితాన్ని ఇవ్వలేకపోయినా డీసెంట్ గానే బయటపడింది. కానీ లింగుస్వామిని ఎక్కువ ఊహించుకుని కష్టపడిన ది వారియర్ మాత్రం దెబ్బేసింది. సో ఇప్పుడు భారమంతా బోయపాటి మీదే.
This post was last modified on September 26, 2022 10:43 pm
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…