Adipurush
ప్రభాస్ అభిమానుల దృష్ణంతా ఇప్పుడు ‘ఆదిపురుష్’ మీదే ఉంది. ఇప్పటికే ఎన్నోసార్లు వెండితెరపై చూసిన రామాయణ గాథను అత్యాధునిక టెక్నాలజీతో సరికొత్తగా ప్రెజెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు ‘తానాజీ’ దర్శకుడు ఓం రౌత్. ఈ సినిమా గురించి ఓం రౌత్ ఎప్పుడు మాట్లాడినా చాలా ఎగ్జైట్ అవుతున్నాడు. తాజాగా ఆయనే కాదు.. ప్రభాస్కు ఆప్త మిత్రుడు, ప్రభాస్ పేరునే తన ఇంటి పేరుగా మార్చుకున్న ప్రభాస్ శీను ఒక ఇంటర్వ్యూలో ‘ఆదిపురుష్’ గురించి చెప్పిన మాటలు అభిమానులకు గూస్ బంప్స్ ఇస్తున్నాయి.
‘ఆదిపురుష్’ షూటింగ్ సందర్భంగా .. తొలిసారి ప్రభాస్ రాముడి అవతారంలో కనిపించినపుడు అందరూ స్టన్ అయిపోయినట్లు శీను వెల్లడించాడు ప్రభాస్ రాముడి గెటప్ వేసుకుని అలా నడిచి వస్తుంటే.. రోమాలు నిక్కబొడుచుకున్నాయని.. ఆ గెటప్లో అంత అద్భుతంగా కనిపించాడని ప్రభాస్ శీను తెలిపాడు.
“ఆదిపురుష్ సినిమా నెక్స్ట్ లెవెల్. అది మామూలుగా ఉండదు. ప్రభాస్ గారికి ఉన్న ఆరాకు పర్ఫెక్ట్ యాప్ట్ అనిపించే సినిమా అది. మేమందరం రాముడి గెటప్లో ఆయన్ని చూసి మెస్మరైజ్ అయిపోయి అలా నిలబడి ఉండిపోయాం. ఇలాంటి వ్యక్తి పక్కన మేమున్నామా అనిపించింది. డైరెక్టర్ గారు కూడా ఆశ్చర్యపోయి అలా చూస్తుండిపోయారు. అందరికీ గుండె జలదరించింది. ఇలాంటి పాత్ర చేయడం ప్రభాస్ గారి అదృష్టం” అని ప్రభాస్ శీను తెలిపాడు.
ఇదే సమయంలో ఓం రౌత్ ఒక బాలీవుడ్ మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తూ ‘ఆదిపురుష్’ గురించి, అందులో ప్రభాస్ నటన గురించి ఒక రేంజిలో ఎలివేషన్ ఇచ్చాడు. “మేం షూట్కు వెళ్లడానికి చాలాసార్లు లుక్ టెస్ట్ చేశాం. అందుకోసం చాలా సమయం వెచ్చించాం. ఒక పీరియడ్ ఫిలిం చేస్తున్నపుడు ఇవన్నీ జరుగుతుంటాయి. ఐతే అంతా చేశాక కూడా ప్రభాస్ను చూసి నాతో సహా అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయి చూస్తూ ఉండిపోయాం. ప్రభాస్లోని స్వచ్ఛత మొత్తం అతడి కళ్లోకి వచ్చినట్లుగా అనిపించింది. తన కళ్లు ఎంతో మాట్లాడుతున్నట్లు అనిపించింది. నిజానికి అది చూసే ప్రభాస్తో ఈ సినిమా చేయాలనుకున్నా. అతను ఒప్పుకోకుంటే ఈ సినిమా చేసేవాడినే కాదు” అని ఓం రౌత్ తెలిపాడు.
This post was last modified on September 26, 2022 2:31 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…