బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ రేంజ్ ఏంటో.. ఆయనకున్న డిమాండ్ ఏంటో చెప్పడానికి ఇది ఉదాహరణ. హిందీలో సల్మాన్ నడిపించే రియాలిటీ షో ‘బిగ్ బాస్’లో ఒక్కో ఎపిసోడ్కు గాను సల్మాన్ ఏకంగా రూ.16 కోట్ల పారితోషకం డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం.
ఆ మొత్తం ఇవ్వడానికి కూడా నిర్వాహకులు సిద్ధమయ్యారట. హిందీలో అత్యంత ఆదరణ కలిగిన టీవీ షో ‘బిగ్ బాస్’యే. ఇండియాలోనే ఇది నంబర్ వన్ షో అని చెప్పొచ్చు. పది సీజన్లుగా సల్మాన్యే హోస్ట్గా ఈ షోను నడిపిస్తున్నాడు.
నాలుగో సీజన్ నుంచి ఆరో సీజన్కు సల్మాన్ ఒక్కో ఎపిసోడ్కు రూ.2.5 కోట్ల పారితోషకం తీసుకోగా.. అది తర్వాతి సీజన్లలో పెరుగుతూ వచ్చి రూ.14 కోట్లు అయింది. గత ఏడాదిలో జరిగిన 13 సీజన్లో 26 ఎపిసోడ్లకు గాను అతను రూ. 403 కోట్లు అందుకున్నట్లు వార్తలు వచ్చాయి.
గతంలో ఎన్నడూ లేని స్థాయిలో 2019 సీజన్కు టీఆర్పీ రేటింగ్స్ రావడం, భారీగా ఆదాయం సమకూరడంతో నిర్వాహకులు ఈసారి బిగ్ బాస్ను ఇంకో ఐదు వారాలకు పొడిగిస్తున్నట్లు సమాచారం. తనకు ఇంకా డిమాండ్ పెరగడంతో సల్మాన్ ఈసారి ఎపిసోడ్కు రూ.16 కోట్ల పారితోషకం డిమాండ్ చేయగా.. దానికి అంగీకారం కుదిరినట్లు తెలుస్తోంది.
ఈసారి షోపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. కరోనా కారణంగా షో నిర్వహణపై పలు అనుమానాలు తలెత్తాయి. ఐతే గత నెలలో ప్రభుత్వాలు షూటింగ్లకు అనుమతివ్వడంతో ఈ ఏడాది అక్టోబర్ నుంచి బిగ్బాస్ షో ఆరంభించాలని.. అంతకంటే ముందే చిత్రీకరణ మొదలుపెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం.
పార్టిసిపెంట్లందరికీ కరోనా పరీక్షలు చేసి.. అందరూ సేఫ్ అనుకున్నాకే బిగ్ బాస్ హౌస్లోకి పంపనున్నారని.. వాళ్లకు ఏ రకంగానూ కరోనా సోకకుండా జాగ్రత్తగా షోను నిర్వహించాలని భావిస్తున్నట్లు సమాచారం. సల్మాన్ ఖాన్ పన్వెల్ ఫామ్హౌస్లోనే ఈ బిగ్బాస్ సీజన్ 14 షూటింగ్ని నిర్వహించనున్నట్లు సమాచారం.
This post was last modified on July 7, 2020 5:08 pm
ప్రపంచకప్ గెలిచిన భారత అంధ మహిళల క్రికెట్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించిన దీపిక, తమ గ్రామానికి ఇప్పటికీ సరైన రహదారి…
ఏపీ సీఎం చంద్రబాబును ఆ పార్టీ నాయకులు ఒకే కోణంలో చూస్తున్నారా? బాబుకు రెండో కోణం కూడా ఉందన్న విషయాన్ని…
గుంటూరు ఎంపీ అదే విధంగా కేంద్ర మంత్రిగా ఉన్న పెమ్మసాని చంద్రశేఖరకు సీఎం చంద్రబాబు కీలక బాధ్యతలు అప్పగించారు. రెండు…
కేంద్రంలోని బిజెపి తమకు తోడుగా ఉంటుందని లేదా వచ్చే ఎన్నికలనాటికీ తమతో కలిసి వస్తుందన్న ఆశల్లో వైసిపి ఉంది. ఈ…
భారత రాష్ట్రసమితి(బీఆర్ఎస్).. ఈ పేరుకు పెద్ద ప్రాభవమే ఉంది. ఒక్కొక్కపార్టీకి నాయకుల పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. కానీ, బీఆర్ఎస్ కు…
సెంటిమెంటుకు-రాజకీయాలకు మధ్య సయామీ కవలలకు ఉన్నంత బంధం ఉంటుంది. సో.. సెంటిమెంటును కాదని నాయకులు రాజకీయాలు చేయగలరా? సాధ్యంకాదు. సో..…