బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ రేంజ్ ఏంటో.. ఆయనకున్న డిమాండ్ ఏంటో చెప్పడానికి ఇది ఉదాహరణ. హిందీలో సల్మాన్ నడిపించే రియాలిటీ షో ‘బిగ్ బాస్’లో ఒక్కో ఎపిసోడ్కు గాను సల్మాన్ ఏకంగా రూ.16 కోట్ల పారితోషకం డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం.
ఆ మొత్తం ఇవ్వడానికి కూడా నిర్వాహకులు సిద్ధమయ్యారట. హిందీలో అత్యంత ఆదరణ కలిగిన టీవీ షో ‘బిగ్ బాస్’యే. ఇండియాలోనే ఇది నంబర్ వన్ షో అని చెప్పొచ్చు. పది సీజన్లుగా సల్మాన్యే హోస్ట్గా ఈ షోను నడిపిస్తున్నాడు.
నాలుగో సీజన్ నుంచి ఆరో సీజన్కు సల్మాన్ ఒక్కో ఎపిసోడ్కు రూ.2.5 కోట్ల పారితోషకం తీసుకోగా.. అది తర్వాతి సీజన్లలో పెరుగుతూ వచ్చి రూ.14 కోట్లు అయింది. గత ఏడాదిలో జరిగిన 13 సీజన్లో 26 ఎపిసోడ్లకు గాను అతను రూ. 403 కోట్లు అందుకున్నట్లు వార్తలు వచ్చాయి.
గతంలో ఎన్నడూ లేని స్థాయిలో 2019 సీజన్కు టీఆర్పీ రేటింగ్స్ రావడం, భారీగా ఆదాయం సమకూరడంతో నిర్వాహకులు ఈసారి బిగ్ బాస్ను ఇంకో ఐదు వారాలకు పొడిగిస్తున్నట్లు సమాచారం. తనకు ఇంకా డిమాండ్ పెరగడంతో సల్మాన్ ఈసారి ఎపిసోడ్కు రూ.16 కోట్ల పారితోషకం డిమాండ్ చేయగా.. దానికి అంగీకారం కుదిరినట్లు తెలుస్తోంది.
ఈసారి షోపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. కరోనా కారణంగా షో నిర్వహణపై పలు అనుమానాలు తలెత్తాయి. ఐతే గత నెలలో ప్రభుత్వాలు షూటింగ్లకు అనుమతివ్వడంతో ఈ ఏడాది అక్టోబర్ నుంచి బిగ్బాస్ షో ఆరంభించాలని.. అంతకంటే ముందే చిత్రీకరణ మొదలుపెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం.
పార్టిసిపెంట్లందరికీ కరోనా పరీక్షలు చేసి.. అందరూ సేఫ్ అనుకున్నాకే బిగ్ బాస్ హౌస్లోకి పంపనున్నారని.. వాళ్లకు ఏ రకంగానూ కరోనా సోకకుండా జాగ్రత్తగా షోను నిర్వహించాలని భావిస్తున్నట్లు సమాచారం. సల్మాన్ ఖాన్ పన్వెల్ ఫామ్హౌస్లోనే ఈ బిగ్బాస్ సీజన్ 14 షూటింగ్ని నిర్వహించనున్నట్లు సమాచారం.
అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రాకా సినిమా మేజర్ షెడ్యూల్ ఈ జూన్ మధ్యలో ప్రారంభం కాబోతున్నట్లు…
ఒకప్పుడు ఎంత పెద్ద సినిమా వచ్చినా.. దానికి ఎంత క్రేజున్నా, దాని బడ్జెట్ ఎంత అయినా సరే.. ప్రభుత్వం నిర్ణయించిన…
కరుప్పు / వీరభద్రుడు ఇచ్చిన సక్సెస్ కిక్కుతో సూర్య మాములు ఆనందంలో లేడు. పదమూడేళ్ళగా తన హయ్యెస్ట్ కలెక్షన్ దాటలేని…
తెలంగాణ ఎవరి అయ్య జాగీరు కాదు అంటూ జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లు…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు తెలంగాణ వ్యతిరేకిగా…
వైసీపీ అదినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు వింటేనే… ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం…