మొదటిసారి నందమూరి బాలకృష్ణ యాంకర్ గా మారి ఆహా కోసం చేసిన అన్ స్టాపబుల్ టాక్ షో ఎంత పెద్ద బ్లాక్ బస్టరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఊహించిన దానికన్నా డబుల్ ఎనర్జీతో దాన్ని నడిపించిన తీరు ఆ ఓటిటికి ఇచ్చిన మైలేజ్ చాలా పెద్దది.
సెలబ్రిటీలతో సంభాషించిన విధానం, చలాకిగా హుషారుగా నడిపించిన వైనం భారీ వ్యూస్ ని తీసుకొచ్చింది. ప్రమోషన్లకు వచ్చిన యూనిట్లతో సైతం సరికొత్త విషయాలు చెప్పించి మూవీ లవర్స్ కి, అభిమానులకు జోష్ తీసుకొచ్చారు. త్వరలోనే దీనికి సెకండ్ సీజన్ రెడీ అవుతోంది.
ఈసారి మొదటి ఎపిసోడ్ కోసం సమంతాను తీసుకొచ్చేందుకు గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఇన్ సైడ్ టాక్. వాస్తవానికి పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ ల కాంబినేషన్ సెట్ చేయాలని చాలా ట్రై చేశారట. అయితే పవర్ స్టార్ డైరీ ఫుల్ ప్యాక్ అయ్యుంది.
దానికి తోడు ప్రస్తుత రాజకీయ వాతావరణంలో బాలకృష్ణ రన్ చేసే షోకు అతిథిగా వెళ్తే జరిగే పరిణామాల గురించి కూడా ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. ఆ కారణం వల్లే అలోచించి చెప్తామనే కబురు వెళ్లిందట. అందుకే వాళ్ళిద్దరి స్థానంలో సామ్ ని తీసుకురావాలని ప్లాన్. ఇదే ఆహా కోసం సమంతా గతంలో సామ్ జామ్ చేసిన సంగతి తెలిసిందే.
ఆ బాండింగ్ ఎలాగూ ఉంది కాబట్టి ఇప్పుడు వస్తే షోకి మంచి రేటింగ్స్ ఎక్స్ పెక్ట్ చేయొచ్చు. విడాకులు తీసుకున్నాక సామ్ ఇలా ఇంటర్వ్యూ ఇచ్చింది ఒక్క కరణ్ జోహార్ కు మాత్రమే. ఎందరో ట్రై చేసినా నో చెబుతూ వచ్చింది. ఇప్పుడు ఆహాతో పాటు బాలయ్య కాంబో అంటే వద్దని చెప్పడానికి రీజన్ ఉండకపోవచ్చు.
ఒకవేళ నిజంగా జరిగితే ఇద్దరి మధ్య ఎలాంటి చిట్ ఛాట్ ఉంటుందోననే ఆసక్తి సహజంగానే ఆడియన్స్ లో కలుగుతుంది. సినిమాల కంటే ఎక్కువగా రియాలిటీ షోలు, ముఖాముఖీల మీద ఆధారపడుతున్న ఆహా ఈ రెండో సిరీస్ ని భారీగా ప్లాన్ చేస్తోంది.
This post was last modified on September 25, 2022 4:31 pm
చిన్న సినిమా వెనుక అగ్ర నిర్మాతలు, హీరోలు ఉండటం వాటికి చాలా పెద్ద బలమవుతుంది. బలగంలో ఎంత గొప్ప కంటెంట్…
తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్ ఎన్నో ఏళ్ల పాటు నంబర్ వన్ హీరోగా కొనసాగారు. రజినీ ఉండగా ఆయన్ని మించే స్టార్ రాబోడని అంతా…
చిరంజీవి పుట్టినరోజు ఇంకో ఆరు రోజుల్లో రానుంది. రెండు కీలక అప్డేట్స్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. మెగా 158…
ఇంకో పది రోజుల్లో టాక్సిక్ విడుదల కానుంది. కెజిఎఫ్ తర్వాత సుమారు నాలుగేళ్ల విలువైన కాలాన్ని దీని కోసమే ఖర్చు…
ఏపీలో వచ్చే సెప్టెంబరులో నిర్వహించాలని భావిస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలను బ్యాలెట్ విధానంలోనే నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. దీంతో…
తెలంగాణాలో స్థానిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు జోరందుకుంటున్నాయి. దీంతో రాజకీయ వేడి రాజుకుంటుంది.…