ఒకే తరహా కథలతో మళ్లీ మళ్లీ సినిమాలు రావడం మామూలే. ఐతే మన జనం పెద్దగా చూడని వేరే భాష నుంచి ఐడియాలు కాపీ కొట్టి తీసేవాళ్లు కొందరైతే.. అందరూ చూసిన సినిమా కథ నుంచే స్ఫూర్తి పొంది.. డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో సినిమాలు తీసేవాళ్లు కొందరు. అలా కాకుండా అప్పుడప్పుడూ ఒకే టైంలో ఒకే రకమైన కథతో రెండు సినిమాలు తెరకెక్కడం మాత్రం అరుదైన విషయమే. ఇప్పుడు అలాంటి అరుదైన చిత్రమే చోటు చేసుకుంది.
కొన్ని నెలల కిందటే విడుదలైన నాని సినిమా అంటే సుందరానికీ.. ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన కృష్ణ వృంద విహారికి కథ పరంగా చాలా దగ్గరి పోలికలు ఉండడం విశేషం. నాని సినిమా చూసిన వారికి.. కృష్ణ వృంద విహారి చూస్తుండగా.. అందులోని సన్నివేశాలు కళ్ల ముందు కదలాడుతున్నట్లే అనిపిస్తే ఆశ్చర్యమేమీ లేదు.
అందులో ఇందులో హీరో సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అబ్బాయి. ఇంట్లో కట్టుబాట్లతో అతను సతమతం అయిపోతుంటాడు. ఏం చేయాలన్నా ఆచారాలు, మడి అంటుంటారు. అందులో, ఇందులో బామ్మ పాత్ర సేమ్ టు సేమ్ లాగా ఉంటుంది. నాని సినిమాలో హీరోను తండ్రి సతాయిస్తే.. ఇక్కడ తల్లి ఇబ్బంది పెడుతుంది. ఇక కథానాయికకు పిల్లలు పుట్టరని తెలిసి తనకు లోపం ఉందని హీరో అబద్ధం చెప్పి పెళ్లికి ఒప్పించడం అనే పాయింట్ రెండింట్లోనూ సేమ్ టు సేమ్ అన్నమాట. కాకపోతే ఈ పాయింట్ ను డీల్ చేసిన విధానంలో కొంచెం తేడా ఉంది.
అంటే సుందరానికీలో కామెడీ ఉన్నప్పటికీ కథ కొంచెం ఇంటెన్స్ గా సాగితే.. కృష్ణ వృంద విహారి పూర్తిగా లైటర్ వీన్లో నడుస్తుంది. ఈ రెండు చిత్రాలు కాస్త అటు ఇటుగా ఒకే టైంలో మొదలయ్యాయి. కాకపోతే నాని సినిమా ముందు రిలీజైంది. నాగశౌర్య మూవీ కొంచెం ఆలస్యంగా వచ్చింది. ఇలా ఇద్దరు దర్శకులు ఒకే టైంలో కథ, పాత్రల విషయంలో ఒకేలా ఆలోచించడం ఆశ్చర్యం కలిగించే విషయమే.
మా ఇంటి బంగారం కథ ముందుగా సాయిపల్లవి దగ్గరికి వెళ్లిన సంగతి సమంత స్వయంగా ఇంటర్వ్యూలో చెప్పాక బయటికి వచ్చింది.…
స్టార్ అన్న గుర్తింపు తెచ్చుకోలేకపోయి ఉండొచ్చు కానీ.. తమిళ, తెలుగు భాషల్లో సీనియర్ నటుడు ఆనంద్కు మంచి గుర్తింపే ఉంది.…
ముంబైలో ఇటీవల జరిగిన ఇంటర్నేషనల్ యోగా డే వేడుకల్లో హీరోయిన్ శ్రీలీలకు అవమానం జరిగిందని సోషల్ మీడియాలో ఒక వీడియో…
తప్పు చేసింది కేంద్ర ప్రభుత్వం. తన తప్పును ఏమాత్రం పట్టించుకోని కేంద్రం… విద్యార్థులు చేసిన చిన్నపాటి తప్పులకూ పెద్ద శిక్షలేసింది.…
ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ 'మై వాపస్ ఆవుంగా'కు తొలి రోజు రివ్యూలు ఏమంత ఆశాజనకంగా లేవు. పబ్లిక్ టాక్…
సాయిధరమ్ తేజ్ హీరోగా రెండేళ్ల ముందు మొదలైన సినిమా.. సంబరాల యేటిగట్టు. తన మార్కెట్ స్థాయికి మించి పెద్ద బడ్జెట్లో…