ఒకే తరహా కథలతో మళ్లీ మళ్లీ సినిమాలు రావడం మామూలే. ఐతే మన జనం పెద్దగా చూడని వేరే భాష నుంచి ఐడియాలు కాపీ కొట్టి తీసేవాళ్లు కొందరైతే.. అందరూ చూసిన సినిమా కథ నుంచే స్ఫూర్తి పొంది.. డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో సినిమాలు తీసేవాళ్లు కొందరు. అలా కాకుండా అప్పుడప్పుడూ ఒకే టైంలో ఒకే రకమైన కథతో రెండు సినిమాలు తెరకెక్కడం మాత్రం అరుదైన విషయమే. ఇప్పుడు అలాంటి అరుదైన చిత్రమే చోటు చేసుకుంది.
కొన్ని నెలల కిందటే విడుదలైన నాని సినిమా అంటే సుందరానికీ.. ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన కృష్ణ వృంద విహారికి కథ పరంగా చాలా దగ్గరి పోలికలు ఉండడం విశేషం. నాని సినిమా చూసిన వారికి.. కృష్ణ వృంద విహారి చూస్తుండగా.. అందులోని సన్నివేశాలు కళ్ల ముందు కదలాడుతున్నట్లే అనిపిస్తే ఆశ్చర్యమేమీ లేదు.
అందులో ఇందులో హీరో సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అబ్బాయి. ఇంట్లో కట్టుబాట్లతో అతను సతమతం అయిపోతుంటాడు. ఏం చేయాలన్నా ఆచారాలు, మడి అంటుంటారు. అందులో, ఇందులో బామ్మ పాత్ర సేమ్ టు సేమ్ లాగా ఉంటుంది. నాని సినిమాలో హీరోను తండ్రి సతాయిస్తే.. ఇక్కడ తల్లి ఇబ్బంది పెడుతుంది. ఇక కథానాయికకు పిల్లలు పుట్టరని తెలిసి తనకు లోపం ఉందని హీరో అబద్ధం చెప్పి పెళ్లికి ఒప్పించడం అనే పాయింట్ రెండింట్లోనూ సేమ్ టు సేమ్ అన్నమాట. కాకపోతే ఈ పాయింట్ ను డీల్ చేసిన విధానంలో కొంచెం తేడా ఉంది.
అంటే సుందరానికీలో కామెడీ ఉన్నప్పటికీ కథ కొంచెం ఇంటెన్స్ గా సాగితే.. కృష్ణ వృంద విహారి పూర్తిగా లైటర్ వీన్లో నడుస్తుంది. ఈ రెండు చిత్రాలు కాస్త అటు ఇటుగా ఒకే టైంలో మొదలయ్యాయి. కాకపోతే నాని సినిమా ముందు రిలీజైంది. నాగశౌర్య మూవీ కొంచెం ఆలస్యంగా వచ్చింది. ఇలా ఇద్దరు దర్శకులు ఒకే టైంలో కథ, పాత్రల విషయంలో ఒకేలా ఆలోచించడం ఆశ్చర్యం కలిగించే విషయమే.
This post was last modified on September 23, 2022 10:38 pm
ఐపీఎల్ 2026 సీజన్ మొదటి మ్యాచ్లో ఎదురుదెబ్బ తగిలినా, సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) రెండో మ్యాచ్లోనే అద్భుతంగా పుంజుకుంది. కోల్కతాలోని…
టాలీవుడ్ ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. సాధారణంగా…
అందరూ ఎదురు చూస్తున్న రామాయణ పార్ట్ 1 టీజర్ వచ్చేసింది. రెండు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ల వీడియో మొత్తం…
తెలంగాణకు చెందిన రాజ్యసభ సభ్యురాలు, కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ నాయకురాలు రేణుకా చౌదరి.. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే…
మొన్న సోమవారం నుంచి దురంధర్ ది రివెంజ్ ఆక్యుపెన్సీలు బాగా తగ్గిపోవడం ట్రేడ్ వర్గాలను ఆందోళనకు గురి చేశాయి. యాభై…
ఏపీకి అమరావతి ఏకైక, శాశ్వత రాజధానిగా కొనసాగేందుకు అవసరమైన చట్ట సవరణలు సవ్యంగా ముగిసిన వేళ... అమరావతిని చిదిమేసేందుకు వైసీపీ చేసిన దాష్టీకం…