టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ లో వీవీ వినాయక్ ఒకరు. మాస్ కమర్షియల్ సినిమాలతో బ్లాక్ బస్టర్స్ అందుకొని మంచి కెరీర్ చూశాడు. కొన్నేళ్లుగా వరుస ఫ్లాపులు అందుకున్న వినాయక్ ‘ఖైదీ 150’తో మళ్లీ బౌన్స్ బ్యాక్ అయ్యాడు. ఆ తర్వాత ‘ ఇంటెలిజెంట్’ అనే డిజాస్టర్ తీసి గ్యాప్ తీసుకున్నాడు.
ప్రస్తుతం రాజమౌళి బ్లాక్ బస్టర్ మూవీ ఛత్రపతిని బెల్లంకొండ శ్రీనివాస్ తో హిందీలో తీస్తున్నాడు. అయితే ఈ సినిమా ఔట్ పుట్ చూసి పెన్ మూవీస్ వీవీ వినాయక్ కి 500 కోట్ల బడ్జెట్ ఫిలిం ఆఫర్ ఇచ్చారట. ఈ విషయాన్ని బెల్లంకొండ సురేష్ మీడియాతో పంచుకున్నాడు. చెన్న కేశవ రెడ్డి రీ రిలీజ్ కి సంబంధించి వీవీ వినాయక్ తో కలిసి బెల్లంకొండ సురేష్ ప్రెస్ మీట్ పెట్టుకున్నాడు. అందులో భాగంగా తన ఛత్రపతి సినిమా గురించి కూడా మాట్లాడాడు సురేష్.
ఇక త్వరలోనే వీవీ వినాయక్ ను హీరోగా పెట్టి సినిమా తీసే ఆలోచన ఉందని చెప్పుకున్నాడు. హీరోలంతా ఫుల్ బిజీగా ఉన్నారని, ఈ సమయంలో వినాయక్ హీరోగా రాణించాల్సి ఉందని, మంచి మనసున్న హీరో కృష్ణ లాగా వినాయక్ సినిమాలు చేయాలని కోరుకుంటున్నా అంటూ సురేష్ మాట్లాడారు.
నిజానికి బెల్లంకొండ చెప్పినట్టు వీవీ వినాయక్ మీద 500కోట్ల బడ్జెట్ పెట్టేందుకు పెన్ మూవీస్ అంతా సాహసం చేస్తుందా ? ఇదంతా తన కొడుకు హిందీ సినిమా కు పాజిటివ్ గా చెప్పుకోవడం కోసమే బెల్లంకొండ సురేష్ ఇలా మాట్లాడి ఉంటారేమో నన్నసందేహం ప్రేక్షకులకు కలుగుతుంది. అలాగే వీవీ వినాయక్ హీరోగా సినిమాలు చేయాలని కోరుకోవడం బాగానే ఉంది కానీ కృష్ణ గారితో పోల్చడం ఎందుకో బెల్లంకొండ కే తెలియాలి.
This post was last modified on September 22, 2022 7:05 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…