టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ లో వీవీ వినాయక్ ఒకరు. మాస్ కమర్షియల్ సినిమాలతో బ్లాక్ బస్టర్స్ అందుకొని మంచి కెరీర్ చూశాడు. కొన్నేళ్లుగా వరుస ఫ్లాపులు అందుకున్న వినాయక్ ‘ఖైదీ 150’తో మళ్లీ బౌన్స్ బ్యాక్ అయ్యాడు. ఆ తర్వాత ‘ ఇంటెలిజెంట్’ అనే డిజాస్టర్ తీసి గ్యాప్ తీసుకున్నాడు.
ప్రస్తుతం రాజమౌళి బ్లాక్ బస్టర్ మూవీ ఛత్రపతిని బెల్లంకొండ శ్రీనివాస్ తో హిందీలో తీస్తున్నాడు. అయితే ఈ సినిమా ఔట్ పుట్ చూసి పెన్ మూవీస్ వీవీ వినాయక్ కి 500 కోట్ల బడ్జెట్ ఫిలిం ఆఫర్ ఇచ్చారట. ఈ విషయాన్ని బెల్లంకొండ సురేష్ మీడియాతో పంచుకున్నాడు. చెన్న కేశవ రెడ్డి రీ రిలీజ్ కి సంబంధించి వీవీ వినాయక్ తో కలిసి బెల్లంకొండ సురేష్ ప్రెస్ మీట్ పెట్టుకున్నాడు. అందులో భాగంగా తన ఛత్రపతి సినిమా గురించి కూడా మాట్లాడాడు సురేష్.
ఇక త్వరలోనే వీవీ వినాయక్ ను హీరోగా పెట్టి సినిమా తీసే ఆలోచన ఉందని చెప్పుకున్నాడు. హీరోలంతా ఫుల్ బిజీగా ఉన్నారని, ఈ సమయంలో వినాయక్ హీరోగా రాణించాల్సి ఉందని, మంచి మనసున్న హీరో కృష్ణ లాగా వినాయక్ సినిమాలు చేయాలని కోరుకుంటున్నా అంటూ సురేష్ మాట్లాడారు.
నిజానికి బెల్లంకొండ చెప్పినట్టు వీవీ వినాయక్ మీద 500కోట్ల బడ్జెట్ పెట్టేందుకు పెన్ మూవీస్ అంతా సాహసం చేస్తుందా ? ఇదంతా తన కొడుకు హిందీ సినిమా కు పాజిటివ్ గా చెప్పుకోవడం కోసమే బెల్లంకొండ సురేష్ ఇలా మాట్లాడి ఉంటారేమో నన్నసందేహం ప్రేక్షకులకు కలుగుతుంది. అలాగే వీవీ వినాయక్ హీరోగా సినిమాలు చేయాలని కోరుకోవడం బాగానే ఉంది కానీ కృష్ణ గారితో పోల్చడం ఎందుకో బెల్లంకొండ కే తెలియాలి.
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…
శాకుంతలం విడుదలై డిజాస్టరైనప్పుడు దాని ఫలితానికి బాధ్యుడు దర్శకుడు గుణశేఖర్ అయినప్పటికీ టైటిల్ రోల్ పోషించిన సమంత కూడా విమర్శలను…
మెగాస్టార్ చిరంజీవి సినిమా రహస్యాలను లీక్ చేయడంలో ఫేమస్ అన్న సంగతి తెలిసిందే. ‘ఆచార్య’ సినిమా టైటిల్ను అనుకోకుండా రివీల్…
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… టీడీపీ ఎమ్మెల్యే, టాలీవుడ్ అగ్ర నటుడు నందమూరి…
"ఏనుగు పోతుంటే చూడరు.. చీమ కుడితే గగ్గోలు పెడతారు" అనే సామెత రాజకీయాలకు కూడా సరిగ్గా సరిపోతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.…
ఇటీవలే విడుదలైన వంద దేవుళ్ళులో కథ మొత్తం ఆర్టిస్ట్ స్వసిక చుట్టూ నడుస్తుంది. భర్తను కోల్పోయి పెళ్లీడుకొచ్చిన ఇద్దరు పిల్లల…