టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ లో వీవీ వినాయక్ ఒకరు. మాస్ కమర్షియల్ సినిమాలతో బ్లాక్ బస్టర్స్ అందుకొని మంచి కెరీర్ చూశాడు. కొన్నేళ్లుగా వరుస ఫ్లాపులు అందుకున్న వినాయక్ ‘ఖైదీ 150’తో మళ్లీ బౌన్స్ బ్యాక్ అయ్యాడు. ఆ తర్వాత ‘ ఇంటెలిజెంట్’ అనే డిజాస్టర్ తీసి గ్యాప్ తీసుకున్నాడు.
ప్రస్తుతం రాజమౌళి బ్లాక్ బస్టర్ మూవీ ఛత్రపతిని బెల్లంకొండ శ్రీనివాస్ తో హిందీలో తీస్తున్నాడు. అయితే ఈ సినిమా ఔట్ పుట్ చూసి పెన్ మూవీస్ వీవీ వినాయక్ కి 500 కోట్ల బడ్జెట్ ఫిలిం ఆఫర్ ఇచ్చారట. ఈ విషయాన్ని బెల్లంకొండ సురేష్ మీడియాతో పంచుకున్నాడు. చెన్న కేశవ రెడ్డి రీ రిలీజ్ కి సంబంధించి వీవీ వినాయక్ తో కలిసి బెల్లంకొండ సురేష్ ప్రెస్ మీట్ పెట్టుకున్నాడు. అందులో భాగంగా తన ఛత్రపతి సినిమా గురించి కూడా మాట్లాడాడు సురేష్.
ఇక త్వరలోనే వీవీ వినాయక్ ను హీరోగా పెట్టి సినిమా తీసే ఆలోచన ఉందని చెప్పుకున్నాడు. హీరోలంతా ఫుల్ బిజీగా ఉన్నారని, ఈ సమయంలో వినాయక్ హీరోగా రాణించాల్సి ఉందని, మంచి మనసున్న హీరో కృష్ణ లాగా వినాయక్ సినిమాలు చేయాలని కోరుకుంటున్నా అంటూ సురేష్ మాట్లాడారు.
నిజానికి బెల్లంకొండ చెప్పినట్టు వీవీ వినాయక్ మీద 500కోట్ల బడ్జెట్ పెట్టేందుకు పెన్ మూవీస్ అంతా సాహసం చేస్తుందా ? ఇదంతా తన కొడుకు హిందీ సినిమా కు పాజిటివ్ గా చెప్పుకోవడం కోసమే బెల్లంకొండ సురేష్ ఇలా మాట్లాడి ఉంటారేమో నన్నసందేహం ప్రేక్షకులకు కలుగుతుంది. అలాగే వీవీ వినాయక్ హీరోగా సినిమాలు చేయాలని కోరుకోవడం బాగానే ఉంది కానీ కృష్ణ గారితో పోల్చడం ఎందుకో బెల్లంకొండ కే తెలియాలి.
పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక,…
మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో రాజీపడరు.. చేతల్లో ఆలస్యం చేయరు. ఇదేదో మనం చెప్పే మాట కాదు..…
తన కొత్త సినిమా పెద్ది ప్రమోషన్లలో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎక్కడికి వెళ్లినా… ఆయన వెంట…
ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…