దొంగలున్నారు జాగ్రత్త.. ఈ వారం ప్రేక్షకుల ముందుకు రానున్న మూడు కొత్త చిత్రాల్లో ఒకటి. కీరవాణి చిన్న కొడుకు సింహా కోడూరి కథానాయకుడిగా సతీష్ త్రిపుర అనే కొత్త దర్శకుడు రూపొందించిన చిత్రమిది. తెలుగులో వస్తున్న తొలి సర్వైవల్ థ్రిల్లర్గా ఈ చిత్రాన్ని ప్రమోట్ చేస్తున్నారు. అనుకోకుండా ఒక కారులో ఇరుక్కుపోయిన కుర్రాడు.. దాన్నుంచి బయటపడటానికి చేసే ప్రయత్నం నేపథ్యంలో ఈ సినిమా నడుస్తుంది.
ఈ సినిమా ట్రైలర్ చూసిన అందరికీ 44 అనే హాలీవుడ్ మూవీ గుర్తుకొచ్చింది. చిత్ర బృందం ఆ సినిమాను ఫ్రీమేక్ చేసేసిందంటూ కౌంటర్లు వేశారు సోషల్ మీడియాలో. ఐతే తమ సినిమా అలా కాపీ కొట్టి తీసింది కాదని హీరో సింహా వెల్లడించాడు. 44 సినిమా రీమేక్ హక్కులు అధికారికంగా తీసుకునే దొంగలున్నారు జాగ్రత్త చిత్రాన్ని రూపొందించినట్లు అతను ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు.
ఐతే ఒరిజినల్ను యాజిటీజ్గా తాము ఫాలో అయిపోలేదని సింహా చెప్పాడు. బేసిక్ ఐడియా తీసుకుని, దాన్ని మన నేటివిటీకి తగ్గట్లు అడాప్ట్ చేసుకున్నట్లు తెలిపాడు. మాతృకతో పోలిస్తే ఇందులో వేరే పాత్రలు, సన్నివేశాలు ఉంటాయని.. ఒక ఎమోషనల్ యాంగిల్ కూడా జోడించామని.. హీరో బ్యాక్ స్టోరీ, అలాగే క్లైమాక్స్ కొన్ని సీన్లు అదనంగా ఉంటాయని సింహా చెప్పాడు. గంటన్నర నిడివి మాత్రమే ఉండే సినిమాలో ప్రతి సీన్ గ్రిప్పింగ్గా ఉంటుందని.. ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేస్తుందని అతనన్నాడు.
ఇక తన కెరీర్ గురించి మాట్లాడుతూ తమ కుటుంబంలో భారీ సినిమాలు చేసే పెద్ద పెద్ద వ్యక్తులు ఉన్నప్పటికీ.. సొంతంగా ప్రతిభ చాటుకోవాలనే ఉద్దేశంతో తన అభిరుచి మేరకు చిన్న సినిమాలు చేస్తున్నానని.. వీటితో తనేంటో రుజువు చేసుకున్నాక పెద్ద సినిమాలు చేస్తానని.. నేరుగా పెద్ద సినిమాలు చేస్తే తాను ఇప్పటికి ఇండస్ట్రీలో ఉండేవాణ్ని కాదని.. ఒక్క సినిమాతోనే పనైపోయేదని సింహా వ్యాఖ్యానించడం విశేషం.
'బ్రహ్మోత్సవం' సినిమాలో చిన్న పాత్రతో కెరీర్ స్టార్ట్ చేసిన అవంతికా వందనపు, ఇప్పుడు అమెరికన్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో తనకంటూ…
ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో డిబేట్ ఒకటుంది. జనం మునుపటిలా థియేటర్లకు ఎక్కువ సంఖ్యలో ఎందుకు రావడం లేదనేది అందులో మెయిన్…
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తుల నుంచి భారీ సంఖ్యలో విరాళాలు అందుతున్నాయి. ఈ నిధులతో…
ఇంకో పద్దెనిమిది రోజుల్లో లెనిన్ విడుదల. అక్కినేని అభిమానులు బాగా ఎగ్ జైట్మెంట్ తో ఉన్నారు. ఇప్పటికే పలు వాయిదాలు…
అభివృద్ధి చెందిన దేశాల్లో రాజకీయ స్థిరత్వం ఎక్కువగా ఉంటుందని భావిస్తారు. కానీ గత పదేళ్లుగా యునైటెడ్ కింగ్డమ్ పరిస్థితి మాత్రం…
టాలీవుడ్ స్టార్ రామ్ పోతినేని, యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ గతంలోనే సోషల్ మీడియాలో చాలా…