ఎన్నడూ లేనిది మెగాస్టార్ చిరంజీవి కింగ్ నాగార్జున ఒకే రోజు బాక్సాఫీస్ క్లాష్ పట్ల అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇద్దరూ ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ అయినప్పటికీ తప్పని పరిస్థితుల్లో తలపడాల్సి రావడంతో స్పోర్టివ్ గానే ఉన్నారు. పరస్పరం ఓపెనింగ్స్ మీద కొంత ప్రభావం చూపించే అవకాశం లేకపోలేదు కానీ బెల్లంకొండ గణేష్, మంచు విష్ణులే ధైర్యం చేయగా లేనిది ఈ సీనియర్లు మాత్రం ఎందుకు తగ్గాలనే ప్రశ్నలో లాజిక్ ఉంది. ప్రమోషన్ల వేగం మెల్లగా పెంచుతున్నారు. ది ఘోస్ట్ ఆల్రెడీ ట్రైలర్ తో పాటు ఒక లిరికల్ వీడియోని మార్కెట్ లో వదిలేసింది. కొత్త పోస్టర్లు కూడా వస్తున్నాయి.
కర్నూలులో ఘోస్ట్ టీమ్ ఈ 25న ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేసుకుని ఆ మేరకు అధికారికంగా ప్రకటించేసింది. సినిమా ఫంక్షన్లు ఎక్కువగా జరిగే ఎస్టిబిసి గ్రౌండ్స్ నే ఎంచుకున్నారు. కార్తికేయ 2, విరాట పర్వం, అఖండ తదితర వేడుకలు అక్కడే జరిగాయి. నాగ్ చాలా కాలం తర్వాత సీమకు వస్తుండటంతో ఏర్పాట్లలో ఫ్యాన్స్ బిజీగా ఉన్నారు. ఇక గాడ్ ఫాదర్ అనంతపూర్ లో 28న అక్కడి జూనియర్ కాలేజీ గ్రౌండ్ లో ముందస్తు విడుదల వేడుకను జరపబోతున్నట్టు ఆల్రెడీ ఇన్ఫో బయటికి వచ్చేసింది. అభిమనులు ఆ మేరకు అక్కడి వెళ్లేందుకు రెడీ అవుతున్నారు.
ట్విస్ట్ ఏంటంటే రెండు ప్రాంతాలు రాయలసీమే. వీటి మధ్య దూరం జస్ట్ 150 కిలోమీటర్లు. మాస్ ప్రేక్షకులు సింహభాగం ఇక్కడ ఉన్నారు. కాకతాళీయంగా ప్లాన్ చేసుకున్నారో లేక ఎలాగూ కాంపిటీషన్ తప్పడం లేదు కాబట్టి ఇలా కూడా పోటీ పడదామని డిసైడ్ అయ్యారో తెలియదు కానీ మొత్తానికి ఈ పరిణామం ఆసక్తికరంగా ఉంది. మూడు రోజుల గ్యాప్ లో ఇవి జరగనుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఘోస్ట్ ఈవెంట్ రోజే గాడ్ ఫాదర్ ట్రైలర్ రిలీజ్ ని ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి రియల్ లైఫ్ స్నేహితులు ఇలా అన్ని విషయాల్లో భలేగా పోటీ పడుతున్నారు.
This post was last modified on September 21, 2022 10:28 pm
వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 విడుదల కానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం ఎంత సంచలనం…
రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…
ఒకప్పుడు శంకర్తో సినిమా చేయడానికి వివిధ ఇండస్ట్రీల టాప్ స్టార్లు, అగ్ర నిర్మాతలు లైన్లో ఉండేవారు. మెగాస్టార్ చిరంజీవి అంతటి…
ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ఎగ్గొట్టిన మాజీ సీఎం జగన్…తాపీగా ఈ రోజు మీడియా ముందుకు వచ్చారు. బడ్జెట్ లో…
ఫంకీ ఫలితం త్వరగా తేలిపోవడంతో హీరో విశ్వక్ సేన్, నిర్మాణ సంస్థ సితార హఠాత్తుగా సైలెంటైపోయాయి. ఊరికే లేనిపోని హడావిడి…
వైసీపీ మాజీ ఎంపీ, ఆ పార్టీ మాజీ నేత రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారం జగన్ హయాంలో దేశవ్యాప్తంగా సంచలనం…