తమిళ దర్శకుడు గౌతమ్ మీనన్ స్థాయి ఏంటో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. కాక్క కాక్క మూవీతో కెరీర్ ఆరంభంలోనే గొప్ప దర్శకుల జాబితాలో చేరిపోయాడతను. ఆ తర్వాత ఏమాయ చేసావె, సూర్య సన్నాఫ్ కృష్ణన్, ఎన్నై అరిందాల్ లాంటి చిత్రాలతో లెజెండరీ స్టేటస్ తెచ్చుకున్నాడు గౌతమ్. అలాంటి దర్శకుడిని ఇంటర్వ్యూ చేస్తూ మిడిమిడి జ్ఞానంతో ఒక తెలుగు యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూయర్ వేసిన ప్రశ్న.. దానికి గౌతమ్ వేసిన జవాబు చర్చనీయాంశంగా మారాయి.
ఒక లెజెండరీ డైరెక్టర్ను ఇంటర్వ్యూ చేస్తున్నపుడు మినిమం రీసెర్చ్ చేయకుండా.. ఆయన తీయని సినిమా గురించి ప్రశ్న అడిగి తన అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నాడు ఆ ఇంటర్వ్యూయర్. దానికి గౌతమ్ ఇచ్చిన సమాధానం హైలైట్ అని చెప్పాలి. ఇంతకీ ఏం జరిగిందంటే..
మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన నవాబ్ సినిమాలో శింబు, విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి ముఖ్య పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. ఐతే ఈ సినిమా తీసింది గౌతమ్ మీనన్ అనుకున్న ఇంటర్వ్యూయర్.. సినిమా పేరెత్తకుండా శింబు, సేతుపతి, అరవింద్ లాంటి పేరున్న ఆర్టిస్టులతో పని చేసిన అనుభవం ఎలా ఉంటుంది.. అందరినీ ఎలా కోఆర్డినేట్ చేసుకుంటారు అన్నట్లుగా ప్రశ్న అడిగాడు. ఐతే ప్రశ్న తప్పు అని చెప్పకుండా, గౌతమ్ చాలా హుందాగా మాట్లాడుతూనే ఇంటర్వ్యూయర్ పరువు తీసేశాడు.
నేను గౌతమ్ మీనన్ అయితే ఇబ్బంది పెడతారేమో కానీ.. నేను మణిరత్నం కాబట్టి శింబు అయినా, సేతుపతి అయినా ఏ టైం చెబితే ఆ టైంకి వచ్చి షూటింగ్లో పాల్గొంటారు అన్నాడు గౌతమ్. ఐతే గౌతమ్ ఆ మాట అన్నాక కూడా ఇంటర్వ్యూయర్కు విషయం బోధపడలేదు. ఈ వీడియో నిన్నట్నుంచి సోషల్ మీడియాలో తెగ తిరుగుతోంది. యూట్యూబ్ ఛానెళ్ల వ్యవహారం ఇలా ఉంటుందంటూ నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.
This post was last modified on September 21, 2022 9:40 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…