తమిళ దర్శకుడు గౌతమ్ మీనన్ స్థాయి ఏంటో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. కాక్క కాక్క మూవీతో కెరీర్ ఆరంభంలోనే గొప్ప దర్శకుల జాబితాలో చేరిపోయాడతను. ఆ తర్వాత ఏమాయ చేసావె, సూర్య సన్నాఫ్ కృష్ణన్, ఎన్నై అరిందాల్ లాంటి చిత్రాలతో లెజెండరీ స్టేటస్ తెచ్చుకున్నాడు గౌతమ్. అలాంటి దర్శకుడిని ఇంటర్వ్యూ చేస్తూ మిడిమిడి జ్ఞానంతో ఒక తెలుగు యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూయర్ వేసిన ప్రశ్న.. దానికి గౌతమ్ వేసిన జవాబు చర్చనీయాంశంగా మారాయి.
ఒక లెజెండరీ డైరెక్టర్ను ఇంటర్వ్యూ చేస్తున్నపుడు మినిమం రీసెర్చ్ చేయకుండా.. ఆయన తీయని సినిమా గురించి ప్రశ్న అడిగి తన అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నాడు ఆ ఇంటర్వ్యూయర్. దానికి గౌతమ్ ఇచ్చిన సమాధానం హైలైట్ అని చెప్పాలి. ఇంతకీ ఏం జరిగిందంటే..
మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన నవాబ్ సినిమాలో శింబు, విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి ముఖ్య పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. ఐతే ఈ సినిమా తీసింది గౌతమ్ మీనన్ అనుకున్న ఇంటర్వ్యూయర్.. సినిమా పేరెత్తకుండా శింబు, సేతుపతి, అరవింద్ లాంటి పేరున్న ఆర్టిస్టులతో పని చేసిన అనుభవం ఎలా ఉంటుంది.. అందరినీ ఎలా కోఆర్డినేట్ చేసుకుంటారు అన్నట్లుగా ప్రశ్న అడిగాడు. ఐతే ప్రశ్న తప్పు అని చెప్పకుండా, గౌతమ్ చాలా హుందాగా మాట్లాడుతూనే ఇంటర్వ్యూయర్ పరువు తీసేశాడు.
నేను గౌతమ్ మీనన్ అయితే ఇబ్బంది పెడతారేమో కానీ.. నేను మణిరత్నం కాబట్టి శింబు అయినా, సేతుపతి అయినా ఏ టైం చెబితే ఆ టైంకి వచ్చి షూటింగ్లో పాల్గొంటారు అన్నాడు గౌతమ్. ఐతే గౌతమ్ ఆ మాట అన్నాక కూడా ఇంటర్వ్యూయర్కు విషయం బోధపడలేదు. ఈ వీడియో నిన్నట్నుంచి సోషల్ మీడియాలో తెగ తిరుగుతోంది. యూట్యూబ్ ఛానెళ్ల వ్యవహారం ఇలా ఉంటుందంటూ నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.
This post was last modified on September 21, 2022 9:40 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…