తమిళ దర్శకుడు గౌతమ్ మీనన్ స్థాయి ఏంటో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. కాక్క కాక్క మూవీతో కెరీర్ ఆరంభంలోనే గొప్ప దర్శకుల జాబితాలో చేరిపోయాడతను. ఆ తర్వాత ఏమాయ చేసావె, సూర్య సన్నాఫ్ కృష్ణన్, ఎన్నై అరిందాల్ లాంటి చిత్రాలతో లెజెండరీ స్టేటస్ తెచ్చుకున్నాడు గౌతమ్. అలాంటి దర్శకుడిని ఇంటర్వ్యూ చేస్తూ మిడిమిడి జ్ఞానంతో ఒక తెలుగు యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూయర్ వేసిన ప్రశ్న.. దానికి గౌతమ్ వేసిన జవాబు చర్చనీయాంశంగా మారాయి.
ఒక లెజెండరీ డైరెక్టర్ను ఇంటర్వ్యూ చేస్తున్నపుడు మినిమం రీసెర్చ్ చేయకుండా.. ఆయన తీయని సినిమా గురించి ప్రశ్న అడిగి తన అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నాడు ఆ ఇంటర్వ్యూయర్. దానికి గౌతమ్ ఇచ్చిన సమాధానం హైలైట్ అని చెప్పాలి. ఇంతకీ ఏం జరిగిందంటే..
మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన నవాబ్ సినిమాలో శింబు, విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి ముఖ్య పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. ఐతే ఈ సినిమా తీసింది గౌతమ్ మీనన్ అనుకున్న ఇంటర్వ్యూయర్.. సినిమా పేరెత్తకుండా శింబు, సేతుపతి, అరవింద్ లాంటి పేరున్న ఆర్టిస్టులతో పని చేసిన అనుభవం ఎలా ఉంటుంది.. అందరినీ ఎలా కోఆర్డినేట్ చేసుకుంటారు అన్నట్లుగా ప్రశ్న అడిగాడు. ఐతే ప్రశ్న తప్పు అని చెప్పకుండా, గౌతమ్ చాలా హుందాగా మాట్లాడుతూనే ఇంటర్వ్యూయర్ పరువు తీసేశాడు.
నేను గౌతమ్ మీనన్ అయితే ఇబ్బంది పెడతారేమో కానీ.. నేను మణిరత్నం కాబట్టి శింబు అయినా, సేతుపతి అయినా ఏ టైం చెబితే ఆ టైంకి వచ్చి షూటింగ్లో పాల్గొంటారు అన్నాడు గౌతమ్. ఐతే గౌతమ్ ఆ మాట అన్నాక కూడా ఇంటర్వ్యూయర్కు విషయం బోధపడలేదు. ఈ వీడియో నిన్నట్నుంచి సోషల్ మీడియాలో తెగ తిరుగుతోంది. యూట్యూబ్ ఛానెళ్ల వ్యవహారం ఇలా ఉంటుందంటూ నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.
This post was last modified on September 21, 2022 9:40 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…