తమిళంలో డిఫరెంట్ కాన్సెప్ట్స్తో ఎంటర్టైనింగ్ సినిమాలు తీసే దర్శకుల్లో వెంకట్ ప్రభు ఒకడు. చెన్నై-28 నుంచి మానాడు వరకు వెంకట్ ప్రభు సినిమాలంటే వేరే లెవెల్ అనే చెప్పాలి. తమిళ ప్రేక్షకులకే కాదు.. తెలుగు వారికి కూడా ఆయన మీద అభిమానం ఉంది. వెంకట్ సినిమాలు చాలా వరకు తెలుగులోకి అనువాదం అయ్యాయి. మానాడు కూడా డిజిటల్గా తెలుగులో రిలీజై మన ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఇప్పుడు ఆయన తొలిసారిగా తెలుగులో ఓ సినిమా చేస్తున్నారు. ఇందులో అక్కినేని నాగచైతన్య హీరో అన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తమిళ, తెలుగు భాషల్లో ఒకేసారి తెరకెక్కనుంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బేనర్ మీద శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ సినిమా గురించి చాన్నాళ్ల ముందే ప్రకటన వచ్చినప్పటికీ.. సెట్స్ మీదికి వెళ్లడంలో ఆలస్యం జరిగింది. ముందు ఈ చిత్రం మానాడుకు రీమేక్ అని ప్రచారం జరిగింది కానీ.. అలాంటిదేమీ లేదని.. కొత్త కథతో సినిమా తెరకెక్కనుందని వెంకట్ ప్రభు క్లారిటీ ఇచ్చాడు. ఎట్టకేలకు ఈ సినిమాకు ప్రి ప్రొడక్షన్ పనులన్నీ పూర్తయ్యాయి. బుధవారమే చిత్రీకరణ మొదలు కానుంది. ఈ సందర్భంగా ఒక ఇంట్రెస్టింగ్ పోస్టర్ కూడా రిలీజ్ చేశాడు వెంకట్ ప్రభు. హీరోను షాడో రూపంలో చూపిస్తూ అతడి మీదికి లేజర్ లైట్లు టార్గెట్ చేసినట్లుగా పోస్టర్ డిజైన్ చేశారు. ఇదొక యాక్షన్ థ్రిల్లర్ అనే సంకేతాలను ఈ పోస్టర్ ఇస్తోంది. ఇందులో చైతూ పోలీస్ పాత్ర చేయనున్నట్లు సమాచారం.
ఇంతకుముందు సాహసం శ్వాసగా సాగిపో సినిమాలో కొన్ని నిమిషాలు పోలీస్ పాత్రలో కనిపించడం మినహా.. చైతూ ఫుల్ లెంగ్త్ పోలీస్ పాత్ర చేసింది లేదు. మరి ఖాకీ పాత్రలో చైతూ ఎలా ఆకట్టుకుంటాడో.. అతణ్ని వెంకట్ ప్రభు ఎలా ప్రెజెంట్ చేస్తాడో చూడాలి.
This post was last modified on September 20, 2022 3:02 pm
ఫార్చునర్ కారు.. చేతిలో చీపురు! కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా బంట్వాల్లో కనిపిస్తున్న ఈ దృశ్యం ఇప్పుడు అందరి దృష్టినీ…
నందమూరి బాలకృష్ణ హీరోగా వీరసింహారెడ్డి కాంబో రిపీట్ చేస్తూ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న ఎన్బికె 111కు రెండు…
ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దశాబ్దాల పాటు నంబర్ వన్ హీరోగా నిలవడం కోసం మెగాస్టార్ చిరంజీవి ఎంత…
బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన కంగనా రనౌత్.. పరిశ్రమలో ఒక స్థాయి అందుకున్న దగ్గర్నుంచి తాను పని చేసే ఇండస్ట్రీలోనే…
రాష్ట్రంలో హైదరాబాద్ కు చెందిన ఐఐటీయన్ల సర్వే పేరుతో వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు రెండు మూడు రోజుల నుంచి…
ఇరుముడి వసూళ్లు చూసి చాలా మందికి అసలేం జరుగుతోందో అర్థం కావడం లేదు. ఎక్కడో మారుమూల మూసేయడానికి రెడీగా ఉన్నాయనిపించే…