సరిలేరు నీకెవ్వరుతో కమర్షియల్ విజయాన్నిఅందుకున్న అనిల్ రావిపూడి ఆ తర్వాత మరో టాప్ స్టార్ తో సినిమా చేస్తాడని అనుకున్నారు. కానీ ప్రస్తుత సూపర్ స్టార్స్ ఎవరూ అంత ఆసక్తి చూపించలేదు. దాంతో ఎఫ్ 2 సీక్వెల్ కి కథ రాసే పనిలో రావిపూడి బిజీ అయ్యాడు. ఆ కథ ఒక దారికి వచ్చేసింది కానీ… రావిపూడి మొదలు పెడదామన్నా ఇద్దరు హీరోలు అందుబాటులో లేరు.
వెంకటేష్ ఇంకా నారప్ప పూర్తి చేయలేదు. నారప్ప కోసం వెంకీ గడ్డం పెంచి గెటప్ మార్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా పూర్తయ్యే వరకు ఎఫ్ 3 కోసం ఫ్యామిలీ లుక్ తో వెంకీ రాలేరు. అలాగే వరుణ్ తేజ్ కూడా బాక్సర్ గా నటిస్తున్న సినిమా కోసం బాడీ పెంచి కొత్తగా కనిపిస్తున్నాడు. అతను కూడా అది పూర్తి చేసేవరకు దొరకడు.
ప్రస్తుత పరిస్థితుల్లో ఆ రెండు చిత్రాల షూటింగ్ ఈ ఏడాది చివరకు పూర్తయితే గొప్పే అనుకోవచ్చు. వీళ్ళు అందుబాటులో ఉండరనేది స్పష్టం కావడంతో రావిపూడి వేరే కథ, వేరే ఆప్షన్స్ మీద దృష్టి పెట్టాడని సమాచారం.
This post was last modified on July 7, 2020 10:22 am
బీహార్.. జాతీయ రాజకీయాల్లో మరోమారు పతాక శీర్షికలకు ఎక్కేసింది. నిన్నటిదాకా బీజేపీ, జేడీయూ మైత్రి... జేడియూ చీఫ్ నితీశ్ కుమార్ నుంచి పాలనా…
నమ్మలేక పోతున్నారా… అయినా ఇది నిజం. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుందన్న సంగతి అందరికీ…
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…
గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో పైవరుసలో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒకరు.…
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…